Political News

భీమ‌వ‌రంపై జ‌గ‌న్ దృష్టి.. వాళ్ల‌కు చెక్ పెట్టేందుకే!

శాస‌న మండ‌లి ఛైర్మ‌న్‌గా మోషేన్ రాజు, క్ష‌త్రియ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా పాత‌పాటి స‌ర్రాజు, జడ్పీ ఛైర్మ‌న్‌గా క‌వురు శ్రీనివాస్‌, డీసీసీబీ ఛైర్మ‌న్‌గా పీవీఎల్ న‌ర‌సింహ‌రాజు, డీఎస్ఎంఎస్ ఛైర్మ‌న్‌గా వెంక‌ట‌స్వామి.. ఇలా వివిధ స్థాయిల్లో ఛైర్మ‌న్లుగా ఉన్న వీళ్లంతా భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ నేత‌లు. సీఎం జ‌గ‌న్ ఆ నియోజ‌క‌వర్గంపై ప్ర‌ధాన దృష్టి సారించ‌డానికి చెప్పేందుకు ఈ జాబితానే ఉదాహ‌ర‌ణ‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజుకు చెక్ పెట్టేందుకే జ‌గ‌న్ ఆ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌ని టాక్‌.

ఆ వ్యూహంతో..
రాష్ట్రంలో భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ నేత‌ల‌కు జ‌గ‌న్ అధిక ప్రాధాన్య‌త‌నిస్తుండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీలైన‌న్ని ఎక్కువ ప‌ద‌వులు ఆ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుల‌కే ద‌క్కుతున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే దీని వెన‌క ప‌వ‌న్‌కు, ర‌ఘురామ‌కు చెక్ పెట్టాల‌నే జ‌గ‌న్ వ్యూహం దాగి ఉన్న‌ట్లు స‌మాచారం. 2024 ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి ప‌వ‌న్ పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు న‌ర‌సాపురం ఎంపీగా ఉన్న ర‌ఘురామ కృష్ణం రాజు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే భీమ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉంది. అందుకే భీమ‌వ‌రం నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇచ్చి.. అక్క‌డ పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసి ప‌వ‌న్‌కు, ర‌ఘ‌రామ‌కు షాక్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

వాళ్ల ఓట్ల కోసం..
న‌ర‌సాపురం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని న‌ర‌సాపురం, భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో క్ష‌త్రియ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంది. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కాపు సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ప‌వ‌న్‌, ర‌ఘురామ‌ను నిలువ‌రించాలంటే వ‌చ్చే బీసీ, ఎస్సీ, ఎస్టీల‌తో పాటు క్ష‌త్రియ సామాజిక వ‌ర్గాన్ని కూడా ఆక‌ట్టుకోవాల‌న‌దే జ‌గ‌న్ ప్ర‌య‌త్నంగా క‌నిపిస్తోంది. అందుకే ఇక్క‌డ వైసీపీ నేత‌ల‌కు ఆయ‌న ప‌ద‌వులు ఇస్తున్నార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు గ్రంధి శ్రీనివాస్‌కు కూడా కొత్తగా ప్ర‌క‌టించే కేబినేట్‌లో స్తానం దొరికే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి జ‌గన్ వ్యూహం ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ర‌కూ ఆగాల్సిందే. 

This post was last modified on December 4, 2021 1:11 pm

Share
Show comments

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

54 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago