Political News

ఏపీలో గంజాయిపై రాజ్యసభలో షాకింగ్ గణాంకాలు

కొద్ది రోజులుగా ఏపీలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడుతోన్న వైనం కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు యథేచ్ఛగా సాగుతోందని, అయినా పోలీసులు, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా…వాటి మూలాలు ఏపీలో ఉంటున్నాయని, ఏపీ బ్రాండ్ నేమ్ చెడిపోతోందని విమర్శిస్తున్నారు.

గతంలో ఈ స్థాయిలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడిన దాఖలాలు లేవని అంటున్నారు. మరోవైైపు, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఏపీలో గంజాయి వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో చేసిన ప్రకటన షాకింగ్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో దొరికిన గంజాయి పరిమాణం చాలా ఎక్కువని, గత మూడేళ్లలో ఈ పరిమాణం 3 రెట్లు పెరిగిందని సభలో ఆయన వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. 2018లో 33,930.5 కిలోల గంజాయి ఆధారిత మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, 2019లో అది రెండింతలై 66,665.5 కిలోలకు పెరిగిందని చెప్పారు. గత ఏడాది ఆ పరిమాణం ఏకంగా 3 రెట్లు పెరిగి 1,06,042.7 కిలోలకు చేరుకుందని వెల్లడించారు.

ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఈ ఏడాది రికార్డు స్థాయిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు సభకు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసేందుకు మాదకద్రవ్యాల నియంత్రణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని సభకు రాయ్ వెల్లడించారు.

This post was last modified on December 2, 2021 2:46 pm

Share
Show comments
Published by
news Content

Recent Posts

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

36 mins ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

37 mins ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

45 mins ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

1 hour ago

ఏపీ ఎలక్షన్స్: చిరంజీవి రాక తప్పేలా లేదు.!

మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల…

1 hour ago

ఉండి పై రఘురామ ఉడుం పట్టు.!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన…

1 hour ago