కొద్ది రోజులుగా ఏపీలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడుతోన్న వైనం కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు యథేచ్ఛగా సాగుతోందని, అయినా పోలీసులు, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా…వాటి మూలాలు ఏపీలో ఉంటున్నాయని, ఏపీ బ్రాండ్ నేమ్ చెడిపోతోందని విమర్శిస్తున్నారు.
గతంలో ఈ స్థాయిలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడిన దాఖలాలు లేవని అంటున్నారు. మరోవైైపు, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఏపీలో గంజాయి వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో చేసిన ప్రకటన షాకింగ్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్లో దొరికిన గంజాయి పరిమాణం చాలా ఎక్కువని, గత మూడేళ్లలో ఈ పరిమాణం 3 రెట్లు పెరిగిందని సభలో ఆయన వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. 2018లో 33,930.5 కిలోల గంజాయి ఆధారిత మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, 2019లో అది రెండింతలై 66,665.5 కిలోలకు పెరిగిందని చెప్పారు. గత ఏడాది ఆ పరిమాణం ఏకంగా 3 రెట్లు పెరిగి 1,06,042.7 కిలోలకు చేరుకుందని వెల్లడించారు.
ఎన్డీపీఎస్ చట్టం కింద ఈ ఏడాది రికార్డు స్థాయిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు సభకు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసేందుకు మాదకద్రవ్యాల నియంత్రణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని సభకు రాయ్ వెల్లడించారు.
This post was last modified on December 2, 2021 2:46 pm
"రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయన మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్నా" ఓ 15 ఏళ్ల కిందట కర్ణాటకలో జరిగిన రాజకీయం…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుట్టూ బీజేపీకి చెందిన హేమాహేమీలు ఉంటారు. దాదాపుగా వారంతా ఉత్తరాదికి చెందిన వారే. దక్షిణాదికి…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…