మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ కౌన్సిలర్, టీఆర్ఎస్ నేత మల్లాది వాసు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొడాలి నాని, వంశీలను చంపితే 50 లక్షల రూపాయల నజరానా ఇస్తానని వాసు చేసిన ప్రకటన పెను దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు.
కొడాలి నానిని, తనను కమ్మ సామాజిక వర్గం నుంచి వెలివేయాలనుకుంటున్నారని వంశీ ఆరోపించారు. అరికెపూడి గాంధీవంటి వారంతా ఆస్తులు పెంచుకోవడానికే పార్టీలు మారారని ఆరోపించారు. కుట్రలు పన్నడం చంద్రబాబు స్వభావమని, చంద్రబాబే కమ్మ సామాజిక వర్గానికి పట్టిన అతిపెద్ద చీడపురుగు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, చంద్రబాబు ఉండగా ఈ కులం బాగుపడదని షాకింగ్ కామెంట్లు చేశారు.
అయితే, ఈ కులానికి చంద్రబాబో, తానో, కొడాలి నానినో మొదలు కాదు.. చివర కాదని అన్నారు. అన్నగారు నందమూరి తారకరామారావు గారు టీడీపీని కమ్మ కులస్తుల కోసం పెట్టలేదని, అణగారిన, బడుగు, బలహీన, పేద వర్గాల కోసం పెట్టారని గుర్తు చేశారు. టీడీపీని కులపార్టీగా మార్చింది చంద్రబాబేనని, పార్టీ కార్యకర్తల్లో,నేతల్లో కులబీజాలు నాటింది ఆయనేనని వంశీ ఆరోపించారు.
15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, చాలామంది బలమైన ప్రత్యర్థులతో పోరాడి ఈ స్థాయికి వచ్చానని వంశీ అన్నారు. తాజాగా వచ్చిన బెదిరింపులపై స్పందిస్తూ… వీళ్ల తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు, పిచ్చి వాగుళ్లకు కొడాలి నాని, వంశీలు భయపడరిన చెప్పారు. దేనికైనా రెడీ అని, దేన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధమని తెగేసి చెప్పారు. ఎవడేం చేస్తాడో చూద్దాం.. ఎవడేం చేయగలడో తేలుతుంది కదా అని ఆ నజరానా వ్యాఖ్యలపై వంశీ సవాల్ విసిరారు. వంశీ వ్యాఖ్యలు ఈ రేంజ్ లో ఉంటే…ఇక కొడాలి నాని మరింత ఘాటుగా స్పందిస్తారేమో వేచి చూడాలి.
This post was last modified on December 1, 2021 7:23 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…