Political News

షాకింగ్: అమరావతి రైతులకు అండగా వైసీపీ ఎమ్మెల్యే

అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిపై ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు, యువతీయువకులు ‘న్యాయస్థానం టు దేవస్థానంస మహాపాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ పాదయాత్రకు ఊరూరా ప్రజలు, టీడీపీ నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. అయితే, పాదయాత్రకు అనూహ్యంగా తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే మద్దతు తెలపడం హాట్ టాపిక్ గా మారింది.

కొద్ది రోజులుగా రైతుల చేస్తున్న పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకుంది. వారం రోజుల పాటు జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. అయితే, కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాను వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు ఉదయం పాదయాత్ర చేస్తున్న రైతులకు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. మరో, వారం రోజులపాటు నెల్లూరులోనే యాత్ర జరగనున్న నేపథ్యంలో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయాలంటూ శ్రీధర్ రెడ్డి చెప్పడం షాకింగ్ గా మారింది.

పాదయాత్ర చేస్తున్న మహిళలను ఆప్యాయంగా పలకరించిన శ్రీధర్ రెడ్డి…వర్షాలు, వరదల వల్ల ఏ ఇబ్బంది వచ్చినా తనకు ఫోన్ చేయాలని నంబర్ ఇచ్చారు. అయితే, వరద బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న క్రమంలోనే రాజధాని రైతులను కలిశానని కోటం రెడ్డి తెలిపారు. తమ జిల్లాలో పర్యటన సందర్భంగా వర్షాల వల్ల ఏ ఇబ్బంది వచ్చినా తనకు ఫోన్ చేయమన్నానని చెప్పారు.

అయితే, అమరావతికి మద్దతివ్వాలని మహిళా రైతులు తనను కోరారని, కానీ, పార్టీ ఏ స్టాండ్ లో వెళ్తే.. తనదీ అదే స్టాండ్ అని చెప్పానన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో వరదలు, వర్షాల వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకూడదన్నదే తన ఉద్దేశమని చెప్పారు. అందుకే తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయమన్నానని, అదే మానవత్వం, సంస్కారం అని అన్నారు.

Satya

Recent Posts

రామాయణ డిమాండ్ సగానికి తగ్గిందా?

బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…

8 minutes ago

పెళ్లి కాలేదు… పిల్లల కోసం హీరోయిన్ ఏం చేసింది?

బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్‌లో కొనసాగుతున్న…

3 hours ago

ఇంకెంతమంది లెఫ్ట్ హ్యాండర్స్… పటిదార్ కనిపించట్లేదా?

జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…

4 hours ago

అనుభవం తోడయ్యుంటే ‘బంధం’ బలంగా ఉండేది  

ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…

4 hours ago

విశ్వంభరకు అసలు ఇరకాటం అదే

రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…

5 hours ago

జ‌న‌సేన‌లోకి వంగవీటి కుమార్తె..!

కాపు నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా కుమార్తె ఆశాల‌త త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…

5 hours ago