రాజకీయాల్లో సాధారణంగా.. వ్యక్తుల కేంద్రంగా రాజకీయాలు సాగుతాయి. వ్యక్తుల నేపథ్యంలో.. వారి హవా.. ఆర్థిక పరిస్థితి.. వారి వెనుక ఉన్న ప్రజలు.. వారి వ్యూహాలు.. పరిస్థితి.. ఇలా.. అనేక విషయాలను పరిశీలించి.. నాయకులను ఎంపిక చేసుకుంటారు. దీంతో వ్యక్తికేంద్రాలుగానే .. రాజకీయాలు సాగుతున్న విషయం.. మనకు దేశవ్యాప్తంగా అన్ని చోట్లా కనిపిస్తోంది. అయితే.. వ్యక్తిని కేంద్రంగా చేసుకుని సాగిస్తున్న రాజకీయాలు.. కొన్ని సార్లు సక్సెస్ అవుతున్నాయి.. ఎక్కువ సార్లు విఫలం కూడా అవుతున్నాయి. ఉదాహరణకు.. ఏ పార్టీ అయినా.. వ్యక్తిపై నమ్మకం పెట్టుకుంటే.. ఆయనకు టికెట్ ఇస్తున్నాయి.
ఆయన పార్టీ జెండా కావొచ్చు.. తన అజెండా కావొచ్చు.. గెలుస్తున్నారు. ఒంటెత్తు పోకడలు పోయే వారు పోతున్నారు. లేకపోతే, రెండు చేతలా సంపాయించుకునేవారు కనిపిస్తున్నారు. ఇది అంతిమంగా.. పార్టీలకు మేలు చేయకపోగా.. చాలా నష్టం చేస్తోంది. వ్యక్తి కేంద్ర రాజకీయాలు.. వాస్తవానికి 1990లలో పెద్దగా లేవు. పార్టీ కేంద్రంగానే సాగేవి. పార్టీ తరఫున ఎవరు బరిలోకి దిగినా.. పార్టీని చూసి ఓట్లే సే పరిస్థితి వచ్చింది. గతంలో కాంగ్రెస్ అయినా.. తర్వాత ప్రాంతీయ పార్టీగా వచ్చిన టీడీపీ అయినా.. ఇదే పంథాలో ముందుకు సాగాయి. దీంతో పార్టీలకు విలువ, ప్రజల్లో బలిమి ఉండేది.
కానీ, రాను రాను.. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు కూడా వ్యక్తి కేంద్ర రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది. ఫలితంగా.. పార్టీల ప్రాభవం పోయి.. వ్యక్తుల ప్రభావం పడింది. ఇదే ఇప్పుడు.. టీడీపీని వెంటాడుతున్న శాపంగా మారింది. “మేం ఉండబట్టే.. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు“, మేం కష్టపడి ఆయనను ముఖ్యమంత్రిని చేశాం.. అనే ధోరణలు 2014 తర్వాత.. టీడీపీలో జోరుగా వినిపించాయి. ఈ పరిస్థితిని ఆనాడే.. చంద్రబాబు ఖండించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.
కానీ, నాడు.. ఆయన ఏమనుకున్నారో.. ఏమో.. ఇలాంటి వారిని చూసీ చూడనట్టు వదిలేశారు. పలితంగా ఇప్పుడు పార్టీ ప్రాభవం ముందు.. వ్యక్తుల ప్రాబల్యమే.. పెద్దగా కనిపిస్తోంది. దీంతో నేతలను తయారు చేసే పార్టీలో నేతలే.. సమస్యగా మారారనేది నిష్టుర సత్యం అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 29, 2021 11:29 am
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
వైసీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంపై అదే పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు.. సంచలన…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…