ఏపీ ఉద్యోగులు పోరుబాటను ఎంచుకున్నారు. ఇక, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు వారు రెడీ అయ్యారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు.. గతంలో పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీలు నెరవేరలేదని.. ముఖ్యంగా పీఆర్ సీ వంటి కీలకమైన.. అంశాల్లోనూ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని.. ఉద్యోగ సంఘాలు.. కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నాయి. అదేసమయంలో ఎన్నికలకు ముందు.. సీపీఎస్ పింఛను విధానాన్ని రద్దు చేస్తామని.. అధికారంలోకి వచ్చిన వారంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన జగన్.. పాలనా పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు అయినప్పటికీ.. మౌనంగా ఉండడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ల కిందట నుంచి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. వాస్తవానికి గత ఏడాది ప్రభుత్వంతో కలిసి మెలిసి పోయిన.. ఉద్యోగులు.. అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్తో వివాదానికి దిగి సంచలనం సృష్టించారు. ప్రభుత్వానికి అనుకూలంగా మీడియా ముందుకు వచ్చారు. అయితే.. ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు ఏ ఒక్కటీ నెరవేరని నేపథ్యంలో ఇప్పుడు.. వారు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఉద్యమాలకు తెరదీయాలని చూస్తున్నారు. దీనిలో భాగంగా డిసెంబరు 1న ప్రభుత్వానికి నోటీసులు అందించాలని నిర్ణయించారు.
తాజాగా మీడియా ముందుకు వచ్చిన.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. అమరావతి జేఏసీ, అమరావతి ఉద్యోగుల సంఘం.. ఇలా అందరూ ఒకే మాటపై నిలబడ్డారు. కనీసం ఒకటో తారీకున జీతాలు కూడా ఇవ్వలేకపోతోందని.. ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఉద్యమం తప్ప.. తమకు ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు. ఉద్యోగులను ప్రభుత్వం చాలా చిన్నచూపు చూస్తోందని వ్యాఖ్యానించారు. పీఆర్సీ, పెండింగ్ బకాయిలు.. సీపీఎస్, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రధానంగా చర్చిస్తు న్నారు. డిసెంబరు 16 నుంచి అన్ని తాలూకా కేంద్రాల్లోనూ ధర్నాలు, నిరసనలకు పిలుపునిచ్చారు. డిసెంబరు 21 నుంచి 26 వరకు జిల్లాల ప్రధాన కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు వ్యక్తం చేస్తారు. అదేవిధంగా డిసెంబరు 27న విశాఖ.. 30న తిరుపతి, జనవరి 3న ఏలూరుల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదీ.. కార్యాచరణ..
This post was last modified on November 28, 2021 10:17 pm
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…
కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…
నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…