Political News

అసెంబ్లీలో ఆ ఘటనపై ఉండవల్లి సీరియస్

కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబుపై, ఆయన సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీ నేతల వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ పొలిటిషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఉండవల్లి షాకింగ్ కామెంట్లు చేశారు.

చంద్రబాబును దారుణంగా తిట్టారని,  ఓ మంత్రి అయితే రేయ్‌, వాడు, వీడు అనడం సర్వసాధారణం అయిపోయిందని ఉండవల్లి అన్నారు. విపక్ష నేతలు, మనుషులను వైసీపీ మంత్రులు గౌరవించాలని ఉండవల్లి హితవు పలికారు. ఎన్టీఆర్‌ కుమార్తెల గురించి తానెప్పుడూ ఏ రకమైన పుకార్లు వినలేదని, హరికృష్ణ, పురంధేశ్వరిలతో తనకు పరిచయం ఉందని అన్నారు. చంద్రబాబు కన్నీళ్లు డ్రామా  అనుకోవడం లేదని, సింపతీ పనిచేయదని చంద్రబాబుకు తెలుసని అన్నారు. విపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం. విపక్షంలేని అసెంబ్లీలో వైసీపీ నేతలు జగన్ భజన చేసి పాటలు పాడారని ఎద్దేవా చేశారు.

జగన్ పాలన అట్టర్ ప్లాప్ అని, జగన్‌ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని ఉండవల్లి సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు లేవు కాబట్టే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వరుసగా గెలుస్తున్నారని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బాగా పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. కానీ, జగన్ మాత్రం రెండున్నరేళ్ల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని ఉండవల్లి విమర్శించారు. జగన్‌ పాలనలో అవినీతి లేదని ఎవరైనా చెప్పగలరా..? అని సవాల్ విసిరారు.

This post was last modified on November 27, 2021 4:31 pm

Share
Show comments

Recent Posts

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

11 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

31 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago