కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబుపై, ఆయన సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీ నేతల వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ పొలిటిషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఉండవల్లి షాకింగ్ కామెంట్లు చేశారు.
చంద్రబాబును దారుణంగా తిట్టారని, ఓ మంత్రి అయితే రేయ్, వాడు, వీడు అనడం సర్వసాధారణం అయిపోయిందని ఉండవల్లి అన్నారు. విపక్ష నేతలు, మనుషులను వైసీపీ మంత్రులు గౌరవించాలని ఉండవల్లి హితవు పలికారు. ఎన్టీఆర్ కుమార్తెల గురించి తానెప్పుడూ ఏ రకమైన పుకార్లు వినలేదని, హరికృష్ణ, పురంధేశ్వరిలతో తనకు పరిచయం ఉందని అన్నారు. చంద్రబాబు కన్నీళ్లు డ్రామా అనుకోవడం లేదని, సింపతీ పనిచేయదని చంద్రబాబుకు తెలుసని అన్నారు. విపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం. విపక్షంలేని అసెంబ్లీలో వైసీపీ నేతలు జగన్ భజన చేసి పాటలు పాడారని ఎద్దేవా చేశారు.
జగన్ పాలన అట్టర్ ప్లాప్ అని, జగన్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని ఉండవల్లి సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు లేవు కాబట్టే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరుసగా గెలుస్తున్నారని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బాగా పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. కానీ, జగన్ మాత్రం రెండున్నరేళ్ల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని ఉండవల్లి విమర్శించారు. జగన్ పాలనలో అవినీతి లేదని ఎవరైనా చెప్పగలరా..? అని సవాల్ విసిరారు.
This post was last modified on November 27, 2021 4:31 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…