Political News

టాలీవుడ్ హీరోలపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేత, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. జగనన్న ఇళ్లు చిన్నవిగా ఉన్నాయని, హాల్లోనే శోభనం చేసుకోవాలని గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇక, అంతకుముందు పోలీసుల తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ప్రసన్న కుమార్ రెడ్డి తన మార్క్ కామెంట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు.
ఈ సారి టాలీవుడ్ సినీ హీరోలు, దర్శక నిర్మాతలపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయాయని, అయినప్పటికీ సినీ హీరోలు, ప్రముఖులు స్పందించకపోవడం బాధాకరమని ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. వరద బాధితుల గురించి వారంతా కనీసం ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రజల వల్లే వారంతా హీరోలుగా అయ్యారని, అటువంటి ప్రజలు కష్టాల్లో ఉంటే సాయం చేయలేదని, కనీసం ఓ ప్రకటన కూడా ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారని, కానీ, అందుకు కారణమైన ప్రజల కోసం డబ్బు ఖర్చుపెట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆపదలో సాయం చేసేవారిని జనం గుర్తు పెట్టుకుంటారని, ఇకనైనా స్పందించి తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను సినీ ప్రముఖులు ఆదుకోవాలని కోరారు.

గతంలో ఎన్టీఆర్, అక్కినేని వరద బాధితుల కోసం, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం జోలె పట్టి రోడ్డు మీదకు వచ్చి మరీ సాయం చేసేవారని ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తు చేశారు. వారిద్దరూ సినీ ఇండస్ట్రీకి రెండు కళ్లు అని ఆయన కొనియాడారు. మరి, ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on November 27, 2021 12:26 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

9 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

4 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

8 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

8 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

9 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

9 hours ago