టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. తాజాగా స్పందించారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై విరుచుకుపడిన వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలు.. తన పేరును ప్రస్తావించ డం.. ఘోరమైన వ్యాఖ్యలు చేయడంపై తాజాగా ఆమె ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న భువనేశ్వరి.. అదే సంస్థ లెటర్ హెడ్పై ప్రజలను ఉద్దేశించి లేఖ రాయడం.. సంచలనంగా మారింది. వాస్తవానికి ఈ రోజు(శుక్రవారం) ఈ ఘటన జరిగి వారం అయింది. ఈ వారం రోజుల్లోనూ భువనేశ్వరి మౌనంగానే ఉన్నారు.
కానీ, తాజాగా ఆమె లేఖరాయడం.. ఈ లేఖలో.. తనకు జరిగిన అవమానం.. తనను ఉద్దేశించి చేసిన ఘోరమైన వ్యాఖ్యలు.. మరెవ్వరికీ ఎదురు కాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన తల్లిదండ్రులు.. బసవతారకం, ఎన్టీఆర్లు.. ఎన్నో ఉన్నతమైన విలువలతో పెంచారని.. ఎన్నడూ తాము రాజకీయాల్లోకి రాలేదని.. కానీ.. తనను నిండు సభలో అగౌరవపరచడం అత్యంత హేయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ భువ నేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.
తనకు జరిగిన అవమానాన్ని.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ తోబుట్టువువు, తమ తల్లికి.. జరిగిన అవమానంగా భావించి.. స్పందించడం.. తనను ఊరటపరిచిందని పేర్కొన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ తనకు అండగా నిలిచిన క్షణాలను తాను ఎన్నటికీ మరిచిపోనని చెప్పారు. అయితే.. ప్రస్తుతం వరదలు.. వర్షాల కారణంగా.. అనేక మంది ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. వారికి వెంటనే సాయం చేయాలని.. ఆమె ప్రతి ఒక్కరికీ సూచించారు. తనకు జరిగిన అవమానం.. మాటలు.. వంటివి భవిష్యత్తులో ఏ మహిళకు ఎదురు కాకూడదని.. భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
This post was last modified on November 26, 2021 1:01 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…