పంజాబ్ విషయంలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంపై సానుకూల స్పందన కనబడుతోంది. పంజాబ్ పర్యటనలో కేజ్రీవాల్ మాట్లాడుతు తాను రెడీ అంటే ఇప్పటికప్పుడు ఆప్ లో చేరటానికి 25 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలు రెడీగా ఉన్నారంటు చెప్పిన విషయం తెలిసిందే. ఎంఎల్ఏలే కాకుండా 3 ఎంపీలు కూడా ఆప్ లో చేరుతామని అడుగుతున్నారట. అయితే అలాంటి చెత్తను తాను తమ పార్టీలోకి తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏలను ఆప్ లోకి చేర్చుకోకూడదని కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం మంచిదే అని విశ్లేషకులంటున్నారు. గడచిన ఆరుమాసాలుగా పంజాబ్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ జరుగుతున్న పరిణామాలతో పార్టీ జనాల్లో బాగా పలుచనైపోయింది. పీసీసీ అధ్యక్షునిగా ఉన్న నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రభుత్వాన్ని బాగా గబ్బు పట్టించేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల్లాగ సిద్ధూ సొంతపార్టీ ప్రభుత్వాన్నే రోజుకో తీరుతో నిలదీస్తు రోడ్డున పడేస్తున్నారు.
రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మామూలు జనాల్లో అలాంటి నమ్మకమేమీ కనబడటంలేదు. ఇందులో భాగంగానే ప్రీపోల్ సర్వేల్లో సింగిల్ లార్జెస్టుపార్టీగా ఆప్ నిలుస్తుందని తేలింది. మొత్తం 117 సీట్లలో ఆప్ కు 51 సీట్లు వస్తాయని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. సర్వే రిపోర్టులు ప్రతిసారి నిజమవ్వాలని ఏమీలేదు. కానీ పంజాబ్ లో పరిస్ధితులు చూసిన తర్వాత మామూలు జనాల్లో కూడా ఆప్ పైనే దృష్టి ఉందని ఎప్పటినుండో అనుకుంటున్నారు.
అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణల కారణంగా జనాల్లో కాంగ్రెస్ పలుచనైపోయింది. ఇదే సమయంలో బీజేపీని జనాలు పట్టించుకోవటంలేదు. ఇక శిరోమణి అకాలీదళ్ కూడా జనాల్లో పెద్దగా పుంజుకోలేదు. ఈ కారణంగానే ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా 20 సీట్లతో ఉన్న ఆప్ రేపటి ఎన్నికల్లో బాగా పుంజుకుంటుందనే మొదటినుండి జనాల్లో అభిప్రాయముంది. ప్రీపోల్ సర్వే తర్వాత ఆప్ విషయంలో జనాల్లో సానుకూలత పెరుగుతోందనే విషయం అర్ధమవుతోంది.
ఇలాంటి నేపధ్యంలోనే కాంగ్రెస్ ఎంఎల్ఏలను తన పార్టీలో చేర్చుకునే ఉద్దేశ్యంలో లేమని కేజ్రీవాల్ చెప్పి మంచిపని చేశారు. అందుకనే సొంతంగానే 117 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఆప్ ఎంఎల్ఏలు బాగానే పనిచేస్తున్నారనే అభిప్రాయం జనాల్లో ఉందట. కాబట్టి ఆప్ రేపటి ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
This post was last modified on November 25, 2021 10:50 am
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…