Political News

కేంద్రం ఎఫెక్ట్‌.. అందుకే జ‌గ‌న్‌ యూట‌ర్న్‌?

దాదాపు రెండేళ్ల‌కు పైగా రైతుల పోరాటం.. పోలీసుల నుంచి లాఠీ దెబ్బ‌లు.. అవ‌మానాలు..మంత్రుల నుంచి ఈస‌డింపు మాట‌లు.. వెర‌సి.. అమ‌రావ‌తి విష‌యం ర‌గిలిన భోగిమంట‌లా.. కొన‌సాగింది. రైతులు వెనుదిరిగేది లేద‌ని.. త‌మ త్యాగాలు వృథా కారాద‌ని.. స్ప‌ష్టం చేస్తూ.. అమ‌రావ‌తికోసం. ఉద్య‌మించారు. మూడు రాజ‌ధానుల‌ను తిర‌స్క‌రించారు. అయితే.. తాము వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని., ప్ర‌భుత్వం భీష్మించింది.

ద‌రిమిలా కోర్టులో ఈ కేసులు నాన‌డం..రోజువారి విచార‌ణ జ‌రుగుతుండ‌డం స‌ర్వ‌త్రా తీవ్ర ఉత్కంఠ‌కు వివాదానికి దారితీసింది. అయితే.. ఇప్పుడు ప్ర‌భుత్త‌మే ఉన్న‌ప‌ళాన ఈ మూడు రాజ‌ధానుల బిల్లుతోపాటు.. సీఆర్‌డీయే ర‌ద్దు చ‌ట్టాన్ని కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్టు హైకోర్టుకు తెలిపింది.

ఈ క్ర‌మంలో ఉరుములేని పిడుగులా వ‌చ్చిన ఈ నిర్ణ‌యం ఒక‌వైపు రైతుల‌ను ఆనందంలో ముంచెత్తింది. మ‌రోవైపు విశ్లేష‌కులు..రాజ‌కీయ నేత‌ల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తింది. దీని వెనుక అసలు ఏం జ‌రిగింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌డ‌మ తిప్పేది లేద‌ని ప‌దేప‌దే చెప్పిన జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని భ్ర‌మ‌రావ‌తి అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైసీపీ నాయ‌కులు.. ఇప్పుడు ఒక్క‌సారిగా రైతుల నెత్తిన పాలు పోయ‌డం వెనుక‌.. జ‌రిగిన విష‌యాలేంటి? అస‌లు ఏం జ‌రిగింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

దీనికి ఇప్ప‌టికిప్పుడు మ‌న‌కు రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి ఉద్య‌మానికి దూరంగా ఉన్న బీజేపీ. రెండు.. రాజ‌కీయంగా వైసీపీ ఎదుర్కొంటున్న వివాదాలు.. దీనికి వస్తున్న వ్య‌తిరేక‌త‌.

బీజేపీ విష‌యాన్ని చూసుకుంటే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా అమ‌రావ‌తికి దూరంగా ఉంది. అయితే.. ఇటీవ‌ల బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా ఏపీ ప‌ర్య‌ట‌న‌లో అమ‌రావతికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని రాష్ట్ర నేత‌ల‌ను ఆదేశించారు. ఈ క్ర‌మంలో వారంతా కూడా రంగంలోకి దిగారు. ఇది.. ఏపీ ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది ఎందుకంటే..రేపు మూడు రాజ‌ధానులు అంటే.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల మ‌ద్ద‌తు లేక‌పోతే..ఒక్క పుల్ల తీసి అటు వేయ‌లేరు. ఇటు వేయ‌లేరు. సో.. అమ‌రావ‌తికి బీజేపీ మ‌ద్ద‌తు విష‌యం సంక‌టంగా మారింది. దీంతో ఇది తెగేది కాద‌ని.. లాక్కుంటే న‌ష్ట‌పోతామ‌ని.. జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుని వుంటార‌ని అంటున్నారు.

అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా ఇప్పుడు వెల్లువెత్తిన వివాదాల‌తో వైసీపీకి మైలేజీ పూర్తిగా త‌గ్గిపోయింది. దీనికి తోడు ఈ రెండున్న‌రేళ్ల‌లో అభివృద్ది అనేది భూత‌ద్దం పెట్టుకుని వెతికినా క‌నిపించ‌డం లేదు. దీనికి రాజ‌ధాని లేక పోవడ‌మేన‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ప‌రిస్థితి మ‌రింత సంక‌టంగా మారుతుంద‌ని.. గ్ర‌హించే అమ‌రావ‌తిపై వెన‌క్కి త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, వీటికి తోడు.. రాజ‌ధానిరైతుల‌కు అన్ని వ‌ర్గాల నుంచి పోటెత్తుతున్న మ‌ద్ద‌తు కూడా రాజ‌ధాని విషయంలో మ‌డ‌మ తిప్ప‌డానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

1 hour ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

2 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

2 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago