Political News

కేంద్రం ఎఫెక్ట్‌.. అందుకే జ‌గ‌న్‌ యూట‌ర్న్‌?

దాదాపు రెండేళ్ల‌కు పైగా రైతుల పోరాటం.. పోలీసుల నుంచి లాఠీ దెబ్బ‌లు.. అవ‌మానాలు..మంత్రుల నుంచి ఈస‌డింపు మాట‌లు.. వెర‌సి.. అమ‌రావ‌తి విష‌యం ర‌గిలిన భోగిమంట‌లా.. కొన‌సాగింది. రైతులు వెనుదిరిగేది లేద‌ని.. త‌మ త్యాగాలు వృథా కారాద‌ని.. స్ప‌ష్టం చేస్తూ.. అమ‌రావ‌తికోసం. ఉద్య‌మించారు. మూడు రాజ‌ధానుల‌ను తిర‌స్క‌రించారు. అయితే.. తాము వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని., ప్ర‌భుత్వం భీష్మించింది.

ద‌రిమిలా కోర్టులో ఈ కేసులు నాన‌డం..రోజువారి విచార‌ణ జ‌రుగుతుండ‌డం స‌ర్వ‌త్రా తీవ్ర ఉత్కంఠ‌కు వివాదానికి దారితీసింది. అయితే.. ఇప్పుడు ప్ర‌భుత్త‌మే ఉన్న‌ప‌ళాన ఈ మూడు రాజ‌ధానుల బిల్లుతోపాటు.. సీఆర్‌డీయే ర‌ద్దు చ‌ట్టాన్ని కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్టు హైకోర్టుకు తెలిపింది.

ఈ క్ర‌మంలో ఉరుములేని పిడుగులా వ‌చ్చిన ఈ నిర్ణ‌యం ఒక‌వైపు రైతుల‌ను ఆనందంలో ముంచెత్తింది. మ‌రోవైపు విశ్లేష‌కులు..రాజ‌కీయ నేత‌ల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తింది. దీని వెనుక అసలు ఏం జ‌రిగింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌డ‌మ తిప్పేది లేద‌ని ప‌దేప‌దే చెప్పిన జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని భ్ర‌మ‌రావ‌తి అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైసీపీ నాయ‌కులు.. ఇప్పుడు ఒక్క‌సారిగా రైతుల నెత్తిన పాలు పోయ‌డం వెనుక‌.. జ‌రిగిన విష‌యాలేంటి? అస‌లు ఏం జ‌రిగింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

దీనికి ఇప్ప‌టికిప్పుడు మ‌న‌కు రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి ఉద్య‌మానికి దూరంగా ఉన్న బీజేపీ. రెండు.. రాజ‌కీయంగా వైసీపీ ఎదుర్కొంటున్న వివాదాలు.. దీనికి వస్తున్న వ్య‌తిరేక‌త‌.

బీజేపీ విష‌యాన్ని చూసుకుంటే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా అమ‌రావ‌తికి దూరంగా ఉంది. అయితే.. ఇటీవ‌ల బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా ఏపీ ప‌ర్య‌ట‌న‌లో అమ‌రావతికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని రాష్ట్ర నేత‌ల‌ను ఆదేశించారు. ఈ క్ర‌మంలో వారంతా కూడా రంగంలోకి దిగారు. ఇది.. ఏపీ ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది ఎందుకంటే..రేపు మూడు రాజ‌ధానులు అంటే.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల మ‌ద్ద‌తు లేక‌పోతే..ఒక్క పుల్ల తీసి అటు వేయ‌లేరు. ఇటు వేయ‌లేరు. సో.. అమ‌రావ‌తికి బీజేపీ మ‌ద్ద‌తు విష‌యం సంక‌టంగా మారింది. దీంతో ఇది తెగేది కాద‌ని.. లాక్కుంటే న‌ష్ట‌పోతామ‌ని.. జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుని వుంటార‌ని అంటున్నారు.

అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా ఇప్పుడు వెల్లువెత్తిన వివాదాల‌తో వైసీపీకి మైలేజీ పూర్తిగా త‌గ్గిపోయింది. దీనికి తోడు ఈ రెండున్న‌రేళ్ల‌లో అభివృద్ది అనేది భూత‌ద్దం పెట్టుకుని వెతికినా క‌నిపించ‌డం లేదు. దీనికి రాజ‌ధాని లేక పోవడ‌మేన‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ప‌రిస్థితి మ‌రింత సంక‌టంగా మారుతుంద‌ని.. గ్ర‌హించే అమ‌రావ‌తిపై వెన‌క్కి త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, వీటికి తోడు.. రాజ‌ధానిరైతుల‌కు అన్ని వ‌ర్గాల నుంచి పోటెత్తుతున్న మ‌ద్ద‌తు కూడా రాజ‌ధాని విషయంలో మ‌డ‌మ తిప్ప‌డానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.

Satya

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

54 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

2 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

2 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

3 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

3 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago