Political News

కేంద్రం ఎఫెక్ట్‌.. అందుకే జ‌గ‌న్‌ యూట‌ర్న్‌?

దాదాపు రెండేళ్ల‌కు పైగా రైతుల పోరాటం.. పోలీసుల నుంచి లాఠీ దెబ్బ‌లు.. అవ‌మానాలు..మంత్రుల నుంచి ఈస‌డింపు మాట‌లు.. వెర‌సి.. అమ‌రావ‌తి విష‌యం ర‌గిలిన భోగిమంట‌లా.. కొన‌సాగింది. రైతులు వెనుదిరిగేది లేద‌ని.. త‌మ త్యాగాలు వృథా కారాద‌ని.. స్ప‌ష్టం చేస్తూ.. అమ‌రావ‌తికోసం. ఉద్య‌మించారు. మూడు రాజ‌ధానుల‌ను తిర‌స్క‌రించారు. అయితే.. తాము వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని., ప్ర‌భుత్వం భీష్మించింది.

ద‌రిమిలా కోర్టులో ఈ కేసులు నాన‌డం..రోజువారి విచార‌ణ జ‌రుగుతుండ‌డం స‌ర్వ‌త్రా తీవ్ర ఉత్కంఠ‌కు వివాదానికి దారితీసింది. అయితే.. ఇప్పుడు ప్ర‌భుత్త‌మే ఉన్న‌ప‌ళాన ఈ మూడు రాజ‌ధానుల బిల్లుతోపాటు.. సీఆర్‌డీయే ర‌ద్దు చ‌ట్టాన్ని కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్టు హైకోర్టుకు తెలిపింది.

ఈ క్ర‌మంలో ఉరుములేని పిడుగులా వ‌చ్చిన ఈ నిర్ణ‌యం ఒక‌వైపు రైతుల‌ను ఆనందంలో ముంచెత్తింది. మ‌రోవైపు విశ్లేష‌కులు..రాజ‌కీయ నేత‌ల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తింది. దీని వెనుక అసలు ఏం జ‌రిగింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌డ‌మ తిప్పేది లేద‌ని ప‌దేప‌దే చెప్పిన జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని భ్ర‌మ‌రావ‌తి అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైసీపీ నాయ‌కులు.. ఇప్పుడు ఒక్క‌సారిగా రైతుల నెత్తిన పాలు పోయ‌డం వెనుక‌.. జ‌రిగిన విష‌యాలేంటి? అస‌లు ఏం జ‌రిగింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

దీనికి ఇప్ప‌టికిప్పుడు మ‌న‌కు రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి ఉద్య‌మానికి దూరంగా ఉన్న బీజేపీ. రెండు.. రాజ‌కీయంగా వైసీపీ ఎదుర్కొంటున్న వివాదాలు.. దీనికి వస్తున్న వ్య‌తిరేక‌త‌.

బీజేపీ విష‌యాన్ని చూసుకుంటే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా అమ‌రావ‌తికి దూరంగా ఉంది. అయితే.. ఇటీవ‌ల బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా ఏపీ ప‌ర్య‌ట‌న‌లో అమ‌రావతికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని రాష్ట్ర నేత‌ల‌ను ఆదేశించారు. ఈ క్ర‌మంలో వారంతా కూడా రంగంలోకి దిగారు. ఇది.. ఏపీ ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది ఎందుకంటే..రేపు మూడు రాజ‌ధానులు అంటే.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల మ‌ద్ద‌తు లేక‌పోతే..ఒక్క పుల్ల తీసి అటు వేయ‌లేరు. ఇటు వేయ‌లేరు. సో.. అమ‌రావ‌తికి బీజేపీ మ‌ద్ద‌తు విష‌యం సంక‌టంగా మారింది. దీంతో ఇది తెగేది కాద‌ని.. లాక్కుంటే న‌ష్ట‌పోతామ‌ని.. జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుని వుంటార‌ని అంటున్నారు.

అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా ఇప్పుడు వెల్లువెత్తిన వివాదాల‌తో వైసీపీకి మైలేజీ పూర్తిగా త‌గ్గిపోయింది. దీనికి తోడు ఈ రెండున్న‌రేళ్ల‌లో అభివృద్ది అనేది భూత‌ద్దం పెట్టుకుని వెతికినా క‌నిపించ‌డం లేదు. దీనికి రాజ‌ధాని లేక పోవడ‌మేన‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ప‌రిస్థితి మ‌రింత సంక‌టంగా మారుతుంద‌ని.. గ్ర‌హించే అమ‌రావ‌తిపై వెన‌క్కి త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, వీటికి తోడు.. రాజ‌ధానిరైతుల‌కు అన్ని వ‌ర్గాల నుంచి పోటెత్తుతున్న మ‌ద్ద‌తు కూడా రాజ‌ధాని విషయంలో మ‌డ‌మ తిప్ప‌డానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.

This post was last modified on November 22, 2021 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

11 minutes ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

5 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

7 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

7 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

8 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

9 hours ago