Political News

కేంద్రం ఎఫెక్ట్‌.. అందుకే జ‌గ‌న్‌ యూట‌ర్న్‌?

దాదాపు రెండేళ్ల‌కు పైగా రైతుల పోరాటం.. పోలీసుల నుంచి లాఠీ దెబ్బ‌లు.. అవ‌మానాలు..మంత్రుల నుంచి ఈస‌డింపు మాట‌లు.. వెర‌సి.. అమ‌రావ‌తి విష‌యం ర‌గిలిన భోగిమంట‌లా.. కొన‌సాగింది. రైతులు వెనుదిరిగేది లేద‌ని.. త‌మ త్యాగాలు వృథా కారాద‌ని.. స్ప‌ష్టం చేస్తూ.. అమ‌రావ‌తికోసం. ఉద్య‌మించారు. మూడు రాజ‌ధానుల‌ను తిర‌స్క‌రించారు. అయితే.. తాము వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని., ప్ర‌భుత్వం భీష్మించింది.

ద‌రిమిలా కోర్టులో ఈ కేసులు నాన‌డం..రోజువారి విచార‌ణ జ‌రుగుతుండ‌డం స‌ర్వ‌త్రా తీవ్ర ఉత్కంఠ‌కు వివాదానికి దారితీసింది. అయితే.. ఇప్పుడు ప్ర‌భుత్త‌మే ఉన్న‌ప‌ళాన ఈ మూడు రాజ‌ధానుల బిల్లుతోపాటు.. సీఆర్‌డీయే ర‌ద్దు చ‌ట్టాన్ని కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్టు హైకోర్టుకు తెలిపింది.

ఈ క్ర‌మంలో ఉరుములేని పిడుగులా వ‌చ్చిన ఈ నిర్ణ‌యం ఒక‌వైపు రైతుల‌ను ఆనందంలో ముంచెత్తింది. మ‌రోవైపు విశ్లేష‌కులు..రాజ‌కీయ నేత‌ల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తింది. దీని వెనుక అసలు ఏం జ‌రిగింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌డ‌మ తిప్పేది లేద‌ని ప‌దేప‌దే చెప్పిన జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని భ్ర‌మ‌రావ‌తి అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైసీపీ నాయ‌కులు.. ఇప్పుడు ఒక్క‌సారిగా రైతుల నెత్తిన పాలు పోయ‌డం వెనుక‌.. జ‌రిగిన విష‌యాలేంటి? అస‌లు ఏం జ‌రిగింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

దీనికి ఇప్ప‌టికిప్పుడు మ‌న‌కు రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి ఉద్య‌మానికి దూరంగా ఉన్న బీజేపీ. రెండు.. రాజ‌కీయంగా వైసీపీ ఎదుర్కొంటున్న వివాదాలు.. దీనికి వస్తున్న వ్య‌తిరేక‌త‌.

బీజేపీ విష‌యాన్ని చూసుకుంటే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా అమ‌రావ‌తికి దూరంగా ఉంది. అయితే.. ఇటీవ‌ల బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా ఏపీ ప‌ర్య‌ట‌న‌లో అమ‌రావతికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని రాష్ట్ర నేత‌ల‌ను ఆదేశించారు. ఈ క్ర‌మంలో వారంతా కూడా రంగంలోకి దిగారు. ఇది.. ఏపీ ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది ఎందుకంటే..రేపు మూడు రాజ‌ధానులు అంటే.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల మ‌ద్ద‌తు లేక‌పోతే..ఒక్క పుల్ల తీసి అటు వేయ‌లేరు. ఇటు వేయ‌లేరు. సో.. అమ‌రావ‌తికి బీజేపీ మ‌ద్ద‌తు విష‌యం సంక‌టంగా మారింది. దీంతో ఇది తెగేది కాద‌ని.. లాక్కుంటే న‌ష్ట‌పోతామ‌ని.. జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుని వుంటార‌ని అంటున్నారు.

అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా ఇప్పుడు వెల్లువెత్తిన వివాదాల‌తో వైసీపీకి మైలేజీ పూర్తిగా త‌గ్గిపోయింది. దీనికి తోడు ఈ రెండున్న‌రేళ్ల‌లో అభివృద్ది అనేది భూత‌ద్దం పెట్టుకుని వెతికినా క‌నిపించ‌డం లేదు. దీనికి రాజ‌ధాని లేక పోవడ‌మేన‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ప‌రిస్థితి మ‌రింత సంక‌టంగా మారుతుంద‌ని.. గ్ర‌హించే అమ‌రావ‌తిపై వెన‌క్కి త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, వీటికి తోడు.. రాజ‌ధానిరైతుల‌కు అన్ని వ‌ర్గాల నుంచి పోటెత్తుతున్న మ‌ద్ద‌తు కూడా రాజ‌ధాని విషయంలో మ‌డ‌మ తిప్ప‌డానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.

This post was last modified on November 22, 2021 2:39 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఆ పార్టీలో అందరూ కాబోయే మంత్రులే !

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…

1 hour ago

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

12 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

13 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

16 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

16 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

17 hours ago