Political News

పట్టు వదలని రైతు సంఘాలు

వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన ప్రకటనతో అంతా అయిపోలేదని భారతీయ కిసాన్ సంఘ్ నరేంద్ర మోడీకి తేల్చి చెప్పింది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు ఇంకా మిగిలిన డిమాండ్లను కూడా వాపసు తీసుకోవాల్సిందే అంటు రైతు సంఘాలు గట్టిగా పట్టబట్టాయి. అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా ఈరోజు ‘మహాపంచాయితి’ని నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల చిట్టాను మోడి ముందు రైతు సంఘం ఉంచింది. దాంతో మోడి సర్కార్ లో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన ఏడాదిగా రైతు సంఘాలు తీవ్రంగా వ్యతేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు నరేంద్రమోడి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని మిగిలిన డిమాండ్లను కూడా రద్దు చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఇంతకీ రైతుల మిగిలిన డిమాండ్లు ఏమిటంటే ఉద్యమంలో భాగంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలట. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి, వ్యవసాయ విద్యుత్ కు మీటర్లకు వాడకం బిల్లును ఉపసంహరించుకోవాలట.

అలాగే ర్యాలీ చేస్తున్న లఖింపూర్ ఖేరీ లో కారుతో తొక్కించి చంపిన ఘటనకు మూల కారకుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించి అరెస్టు చేయాలట. తమ డిమాండ్లను కేంద్రం ఆమోదించేవరకు తమ ఉద్యమాన్ని ఆపేదిలేదంటు రైతు సంఘాలు కేంద్రానికి స్పష్టం చేశాయి. 27వ తేదీన సమావేశమై కార్యచరణ నిర్ణయించనున్నట్లు ప్రకటించాయి. 26వ తేదీన ఢిల్లీ శివార్లకు భారీ ఎత్తున రైతులు ర్యాలీగా చేరుకోవాలని డిసైడ్ చేశాయి.

29వ తేదీన పార్లమెంటుకు భారీగా ట్రాక్టర్ల ర్యాలీని కూడా నిర్వహించబోతున్నట్లు రైతు సంఘం ప్రకటించింది. రైతు సంఘాల తాజా ప్రకటనతో కేంద్రంలో టెన్షన్ పెరిగిపోతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే రైతు సంఘాలు ఉద్యమాన్ని నిలిపేస్తాయని మోడి అనుకున్నట్లున్నారు. కానీ తమ డిమాండ్లను నూరుశాతం ఆమోదించి యాక్షన్ లో కనబరిచేంతవరకు ఉద్యమాన్ని నిలిపేది లేదని రైతులు చెప్పటంతో కేంద్రం తల పట్టుకుంటోంది.

విద్యుత్ బిల్లును ఉపసంహసరించుకోవటం, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటం కేంద్రం చేతిలోని పనే. కానీ రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవటం కేంద్రం చేతిలోని పనికాదు. ఎందుకంటే ఇప్పటికే కేసులన్నీ కోర్టు విచారణ పరిధిలోకి వెళిపోయాయి. ఇక చివరదైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను అరెస్టు చేయటమంటే కేంద్రానికి అవమానం అనే చెప్పాలి. ఏదేమైనా ఈనెల 24వ తేదీన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో డిమాండ్ల విషయం తేలిపోతుంది.

This post was last modified on November 22, 2021 11:52 am

Share
Show comments

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

4 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

8 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

9 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

10 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

12 hours ago