వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన ప్రకటనతో అంతా అయిపోలేదని భారతీయ కిసాన్ సంఘ్ నరేంద్ర మోడీకి తేల్చి చెప్పింది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు ఇంకా మిగిలిన డిమాండ్లను కూడా వాపసు తీసుకోవాల్సిందే అంటు రైతు సంఘాలు గట్టిగా పట్టబట్టాయి. అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా ఈరోజు ‘మహాపంచాయితి’ని నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల చిట్టాను మోడి ముందు రైతు సంఘం ఉంచింది. దాంతో మోడి సర్కార్ లో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన ఏడాదిగా రైతు సంఘాలు తీవ్రంగా వ్యతేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు నరేంద్రమోడి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని మిగిలిన డిమాండ్లను కూడా రద్దు చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఇంతకీ రైతుల మిగిలిన డిమాండ్లు ఏమిటంటే ఉద్యమంలో భాగంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలట. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి, వ్యవసాయ విద్యుత్ కు మీటర్లకు వాడకం బిల్లును ఉపసంహరించుకోవాలట.
అలాగే ర్యాలీ చేస్తున్న లఖింపూర్ ఖేరీ లో కారుతో తొక్కించి చంపిన ఘటనకు మూల కారకుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించి అరెస్టు చేయాలట. తమ డిమాండ్లను కేంద్రం ఆమోదించేవరకు తమ ఉద్యమాన్ని ఆపేదిలేదంటు రైతు సంఘాలు కేంద్రానికి స్పష్టం చేశాయి. 27వ తేదీన సమావేశమై కార్యచరణ నిర్ణయించనున్నట్లు ప్రకటించాయి. 26వ తేదీన ఢిల్లీ శివార్లకు భారీ ఎత్తున రైతులు ర్యాలీగా చేరుకోవాలని డిసైడ్ చేశాయి.
29వ తేదీన పార్లమెంటుకు భారీగా ట్రాక్టర్ల ర్యాలీని కూడా నిర్వహించబోతున్నట్లు రైతు సంఘం ప్రకటించింది. రైతు సంఘాల తాజా ప్రకటనతో కేంద్రంలో టెన్షన్ పెరిగిపోతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే రైతు సంఘాలు ఉద్యమాన్ని నిలిపేస్తాయని మోడి అనుకున్నట్లున్నారు. కానీ తమ డిమాండ్లను నూరుశాతం ఆమోదించి యాక్షన్ లో కనబరిచేంతవరకు ఉద్యమాన్ని నిలిపేది లేదని రైతులు చెప్పటంతో కేంద్రం తల పట్టుకుంటోంది.
విద్యుత్ బిల్లును ఉపసంహసరించుకోవటం, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటం కేంద్రం చేతిలోని పనే. కానీ రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవటం కేంద్రం చేతిలోని పనికాదు. ఎందుకంటే ఇప్పటికే కేసులన్నీ కోర్టు విచారణ పరిధిలోకి వెళిపోయాయి. ఇక చివరదైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను అరెస్టు చేయటమంటే కేంద్రానికి అవమానం అనే చెప్పాలి. ఏదేమైనా ఈనెల 24వ తేదీన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో డిమాండ్ల విషయం తేలిపోతుంది.
జూన్ నెల వచ్చేసింది. కొత్త రిలీజులు క్యూ కడుతున్నాయి. పెద్ది ఆల్రెడీ ఓపెనింగ్ రికార్డులు మొదలుపెట్టేసింది. వచ్చే వారం నుంచి…
తాజాగా విడుదలైన పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర మీద సోషల్ మీడియాలో గట్టి చర్చే జరుగుతోంది. అసలామె క్యారెక్టర్ ని…
ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు.. అది కూడా కొత్త వాళ్లతో ఒక ప్రేమకథ చేసిన వాడు.. మెగా పవర్…
సంక్రాంతి తర్వాత సరైన భారీ చిత్రాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్కు ‘పెద్ది’ సినిమా ఊపిరులూదుతోంంది. టాక్ ఎలా ఉందన్నదాంతో…
కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొన్నేళ్ల క్రితం వరకు మన ప్రేక్షకులకు అంతగా సుపరిచితం కాదు. జైలర్…
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…