వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన ప్రకటనతో అంతా అయిపోలేదని భారతీయ కిసాన్ సంఘ్ నరేంద్ర మోడీకి తేల్చి చెప్పింది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు ఇంకా మిగిలిన డిమాండ్లను కూడా వాపసు తీసుకోవాల్సిందే అంటు రైతు సంఘాలు గట్టిగా పట్టబట్టాయి. అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా ఈరోజు ‘మహాపంచాయితి’ని నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల చిట్టాను మోడి ముందు రైతు సంఘం ఉంచింది. దాంతో మోడి సర్కార్ లో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన ఏడాదిగా రైతు సంఘాలు తీవ్రంగా వ్యతేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు నరేంద్రమోడి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని మిగిలిన డిమాండ్లను కూడా రద్దు చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఇంతకీ రైతుల మిగిలిన డిమాండ్లు ఏమిటంటే ఉద్యమంలో భాగంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలట. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి, వ్యవసాయ విద్యుత్ కు మీటర్లకు వాడకం బిల్లును ఉపసంహరించుకోవాలట.
అలాగే ర్యాలీ చేస్తున్న లఖింపూర్ ఖేరీ లో కారుతో తొక్కించి చంపిన ఘటనకు మూల కారకుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించి అరెస్టు చేయాలట. తమ డిమాండ్లను కేంద్రం ఆమోదించేవరకు తమ ఉద్యమాన్ని ఆపేదిలేదంటు రైతు సంఘాలు కేంద్రానికి స్పష్టం చేశాయి. 27వ తేదీన సమావేశమై కార్యచరణ నిర్ణయించనున్నట్లు ప్రకటించాయి. 26వ తేదీన ఢిల్లీ శివార్లకు భారీ ఎత్తున రైతులు ర్యాలీగా చేరుకోవాలని డిసైడ్ చేశాయి.
29వ తేదీన పార్లమెంటుకు భారీగా ట్రాక్టర్ల ర్యాలీని కూడా నిర్వహించబోతున్నట్లు రైతు సంఘం ప్రకటించింది. రైతు సంఘాల తాజా ప్రకటనతో కేంద్రంలో టెన్షన్ పెరిగిపోతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే రైతు సంఘాలు ఉద్యమాన్ని నిలిపేస్తాయని మోడి అనుకున్నట్లున్నారు. కానీ తమ డిమాండ్లను నూరుశాతం ఆమోదించి యాక్షన్ లో కనబరిచేంతవరకు ఉద్యమాన్ని నిలిపేది లేదని రైతులు చెప్పటంతో కేంద్రం తల పట్టుకుంటోంది.
విద్యుత్ బిల్లును ఉపసంహసరించుకోవటం, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటం కేంద్రం చేతిలోని పనే. కానీ రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవటం కేంద్రం చేతిలోని పనికాదు. ఎందుకంటే ఇప్పటికే కేసులన్నీ కోర్టు విచారణ పరిధిలోకి వెళిపోయాయి. ఇక చివరదైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను అరెస్టు చేయటమంటే కేంద్రానికి అవమానం అనే చెప్పాలి. ఏదేమైనా ఈనెల 24వ తేదీన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో డిమాండ్ల విషయం తేలిపోతుంది.
This post was last modified on November 22, 2021 11:52 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…