Political News

పట్టు వదలని రైతు సంఘాలు

వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన ప్రకటనతో అంతా అయిపోలేదని భారతీయ కిసాన్ సంఘ్ నరేంద్ర మోడీకి తేల్చి చెప్పింది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు ఇంకా మిగిలిన డిమాండ్లను కూడా వాపసు తీసుకోవాల్సిందే అంటు రైతు సంఘాలు గట్టిగా పట్టబట్టాయి. అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా ఈరోజు ‘మహాపంచాయితి’ని నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల చిట్టాను మోడి ముందు రైతు సంఘం ఉంచింది. దాంతో మోడి సర్కార్ లో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన ఏడాదిగా రైతు సంఘాలు తీవ్రంగా వ్యతేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు నరేంద్రమోడి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని మిగిలిన డిమాండ్లను కూడా రద్దు చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఇంతకీ రైతుల మిగిలిన డిమాండ్లు ఏమిటంటే ఉద్యమంలో భాగంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలట. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి, వ్యవసాయ విద్యుత్ కు మీటర్లకు వాడకం బిల్లును ఉపసంహరించుకోవాలట.

అలాగే ర్యాలీ చేస్తున్న లఖింపూర్ ఖేరీ లో కారుతో తొక్కించి చంపిన ఘటనకు మూల కారకుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించి అరెస్టు చేయాలట. తమ డిమాండ్లను కేంద్రం ఆమోదించేవరకు తమ ఉద్యమాన్ని ఆపేదిలేదంటు రైతు సంఘాలు కేంద్రానికి స్పష్టం చేశాయి. 27వ తేదీన సమావేశమై కార్యచరణ నిర్ణయించనున్నట్లు ప్రకటించాయి. 26వ తేదీన ఢిల్లీ శివార్లకు భారీ ఎత్తున రైతులు ర్యాలీగా చేరుకోవాలని డిసైడ్ చేశాయి.

29వ తేదీన పార్లమెంటుకు భారీగా ట్రాక్టర్ల ర్యాలీని కూడా నిర్వహించబోతున్నట్లు రైతు సంఘం ప్రకటించింది. రైతు సంఘాల తాజా ప్రకటనతో కేంద్రంలో టెన్షన్ పెరిగిపోతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే రైతు సంఘాలు ఉద్యమాన్ని నిలిపేస్తాయని మోడి అనుకున్నట్లున్నారు. కానీ తమ డిమాండ్లను నూరుశాతం ఆమోదించి యాక్షన్ లో కనబరిచేంతవరకు ఉద్యమాన్ని నిలిపేది లేదని రైతులు చెప్పటంతో కేంద్రం తల పట్టుకుంటోంది.

విద్యుత్ బిల్లును ఉపసంహసరించుకోవటం, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటం కేంద్రం చేతిలోని పనే. కానీ రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవటం కేంద్రం చేతిలోని పనికాదు. ఎందుకంటే ఇప్పటికే కేసులన్నీ కోర్టు విచారణ పరిధిలోకి వెళిపోయాయి. ఇక చివరదైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను అరెస్టు చేయటమంటే కేంద్రానికి అవమానం అనే చెప్పాలి. ఏదేమైనా ఈనెల 24వ తేదీన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో డిమాండ్ల విషయం తేలిపోతుంది.

This post was last modified on November 22, 2021 11:52 am

Share

Recent Posts

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

2 hours ago

ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున…

2 hours ago

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

3 hours ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

3 hours ago

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

3 hours ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

4 hours ago