భారత ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడంలో సమర్థంగా వ్యవహరించిందని.. లాక్ డౌన్ను చాలా పకడ్బందీగా అమలు చేసిందని అందరూ తెగ పొగిడేశారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)తో పాటు ప్రపంచ దేశాలు కూడా భారత్ను పొగిడాయి. కానీ నెలన్నరకు మించి లాక్డౌన్ను భరించే శక్తి లేక ప్రభుత్వం నాలుగో దశ లాక్ డౌన్ నుంచి చాలా మినహాయింపులు ఇచ్చేసింది.
ఇప్పుడు నామమాత్రంగా నడుస్తోంది లాక్ డౌన్. జనాలు మామూలుగానే తిరిగేస్తున్నారు. అన్ని వ్యాపారాలూ నడుస్తున్నాయి. కానీ దేశంలో లాక్ డౌన్ ఎత్తేశారంటే కరోనా ప్రభావం తగ్గిపోయిందని ఎంతమాత్రం కాదని కేసుల సంఖ్య చూస్తే స్పష్టమవుతోంది. వైరస్ వ్యాప్తి ఇప్పుడే మనం పీక్స్ను చూస్తున్నాం. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ అత్యంత అవసరమని స్పష్టమవుతోంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో లాక్డౌన్ను పరిశీలిస్తే కరోనా వ్యాప్తి పెరుగుతున్న దశలో లాక్ డౌన్ అమలు చేశారు. వైరస్ ప్రభావం బాగా తగ్గాక లాక్ డౌన్ ఎత్తారు. దీంతో అక్కడ పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. కరోనా కారణంగా దారుణంగా దెబ్బ తిన్న ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్.. ఈ దేశాలన్నీ కూడా లాక్ డౌన్తో సత్ఫలితాలు సాధించాయి. కరోనా కర్వ్ డౌన్ అయ్యాకే లాక్ డౌన్ను సడలించాయి.
లాక్ డౌన్ మొదలైన కొంత కాలానికి కరోనా పీక్స్కు చేరుకుని.. ఆ తర్వాత నెమ్మదించింది. అప్పుడు సడలింపులు వచ్చాయి. కానీ ఇండియాలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా జరిగింది. కరోనా పతాక స్థాయిని అందుకుంటున్న దశలో లాక్ డౌన్ను సడలించారు. ఇప్పుడు ఇంకా ప్రమాదకర స్థాయికి చేరుకున్నాం.
వైరస్ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు ఈ కర్వ్ డౌన్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. దీనికి సంబంధించిన గ్రాఫ్ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో షేర్ చేశాడు. దాన్ని చూస్తే ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో తప్పటడుగు వేసిందని స్పష్టమవుతోంది.
This post was last modified on June 6, 2020 9:08 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…