నటి మీరా చోప్రాపై కొందరు ఎన్టీఆర్ అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేసారు. దానిపై ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా, పోలీసులు రంగంలోకి దిగారు. మంత్రి కేటీఆర్ కూడా దీనిపై స్పందించి ట్వీట్ చేసారు. అయితే ఇంత జరుగుతున్నా ఎన్టీఆర్ అసలు స్పందించలేదు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ చివరిగా చేసిన ట్వీట్స్ లో ఒకటి అభిమానులే తన బలం, వారికీ సదా రుణపడి ఉంటా అంటూ ఉంది.
మీరా చోప్రా డైరెక్ట్ గా ఎన్టీఆర్ ని ట్యాగ్ చేసి, ట్వీట్ కానీ వీడియో కానీ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అయినా కానీ తారక రాముడు మౌనముద్రలోనే ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ సంజాయిషీ ఇచ్చుకునేది ఏమీ లేదు. లక్షల మంది అభిమానులు ఎలా ఉండాలనేది ఎన్టీఆర్ కంట్రోల్ చేయలేడు. అయితే లోగడ ఇలాంటి ఫిర్యాదు తన అభిమానులపై వచ్చినపుడు తమిళ స్టార్ అజిత్ చాలా ఘాటుగా స్పందించాడు.
తన అభిమాన సంఘాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్టీఆర్ కూడా అలా అభిమానులను మందలించాలని, మిగతా హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియాలో పద్ధతిగా మసలుకొనేలా చూసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికి అయితే సైలెంట్ గా ఉన్నాడు.
This post was last modified on June 7, 2020 7:51 am
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…
కొన్ని నెలలు వెనక్కి వెళ్తే.. ప్రభాస్ సినిమా రాజాసాబ్ గురించి ఆ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ సప్తగిరి…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాణ స్వీకార…
ఈ నెల (మే) మొదటి రోజున హైదరాబాద్ కు చెందిన కుటుంబం.. సిరిసిల్లకు చెందిన మరో ఫ్యామిలీ కలిసి యాదాద్రి..…
కమల్ హాసన్ కల్ట్ కామెడీ మూవీస్ లిస్టులో సతి లీలావతిది ప్రత్యేక స్థానం. వచ్చి ముప్పై సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ…