నటి మీరా చోప్రాపై కొందరు ఎన్టీఆర్ అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేసారు. దానిపై ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా, పోలీసులు రంగంలోకి దిగారు. మంత్రి కేటీఆర్ కూడా దీనిపై స్పందించి ట్వీట్ చేసారు. అయితే ఇంత జరుగుతున్నా ఎన్టీఆర్ అసలు స్పందించలేదు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ చివరిగా చేసిన ట్వీట్స్ లో ఒకటి అభిమానులే తన బలం, వారికీ సదా రుణపడి ఉంటా అంటూ ఉంది.
మీరా చోప్రా డైరెక్ట్ గా ఎన్టీఆర్ ని ట్యాగ్ చేసి, ట్వీట్ కానీ వీడియో కానీ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అయినా కానీ తారక రాముడు మౌనముద్రలోనే ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ సంజాయిషీ ఇచ్చుకునేది ఏమీ లేదు. లక్షల మంది అభిమానులు ఎలా ఉండాలనేది ఎన్టీఆర్ కంట్రోల్ చేయలేడు. అయితే లోగడ ఇలాంటి ఫిర్యాదు తన అభిమానులపై వచ్చినపుడు తమిళ స్టార్ అజిత్ చాలా ఘాటుగా స్పందించాడు.
తన అభిమాన సంఘాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్టీఆర్ కూడా అలా అభిమానులను మందలించాలని, మిగతా హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియాలో పద్ధతిగా మసలుకొనేలా చూసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికి అయితే సైలెంట్ గా ఉన్నాడు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…