నటి మీరా చోప్రాపై కొందరు ఎన్టీఆర్ అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేసారు. దానిపై ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా, పోలీసులు రంగంలోకి దిగారు. మంత్రి కేటీఆర్ కూడా దీనిపై స్పందించి ట్వీట్ చేసారు. అయితే ఇంత జరుగుతున్నా ఎన్టీఆర్ అసలు స్పందించలేదు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ చివరిగా చేసిన ట్వీట్స్ లో ఒకటి అభిమానులే తన బలం, వారికీ సదా రుణపడి ఉంటా అంటూ ఉంది.
మీరా చోప్రా డైరెక్ట్ గా ఎన్టీఆర్ ని ట్యాగ్ చేసి, ట్వీట్ కానీ వీడియో కానీ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అయినా కానీ తారక రాముడు మౌనముద్రలోనే ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ సంజాయిషీ ఇచ్చుకునేది ఏమీ లేదు. లక్షల మంది అభిమానులు ఎలా ఉండాలనేది ఎన్టీఆర్ కంట్రోల్ చేయలేడు. అయితే లోగడ ఇలాంటి ఫిర్యాదు తన అభిమానులపై వచ్చినపుడు తమిళ స్టార్ అజిత్ చాలా ఘాటుగా స్పందించాడు.
తన అభిమాన సంఘాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్టీఆర్ కూడా అలా అభిమానులను మందలించాలని, మిగతా హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియాలో పద్ధతిగా మసలుకొనేలా చూసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికి అయితే సైలెంట్ గా ఉన్నాడు.
This post was last modified on June 7, 2020 7:51 am
తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం, ప్రీమియర్ షోలు వేయడం గురించి ఏడాది కిందట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది.…
చాలా కాలంగా నిర్మాతలను వేధిస్తున్న సమస్య బుక్ మై షో రేటింగ్స్, రివ్యూస్. టికెట్లు కొన్నా కొనకపోయినా ఇవి ఇచ్చే…
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…