నటి మీరా చోప్రాపై కొందరు ఎన్టీఆర్ అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేసారు. దానిపై ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా, పోలీసులు రంగంలోకి దిగారు. మంత్రి కేటీఆర్ కూడా దీనిపై స్పందించి ట్వీట్ చేసారు. అయితే ఇంత జరుగుతున్నా ఎన్టీఆర్ అసలు స్పందించలేదు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ చివరిగా చేసిన ట్వీట్స్ లో ఒకటి అభిమానులే తన బలం, వారికీ సదా రుణపడి ఉంటా అంటూ ఉంది.
మీరా చోప్రా డైరెక్ట్ గా ఎన్టీఆర్ ని ట్యాగ్ చేసి, ట్వీట్ కానీ వీడియో కానీ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అయినా కానీ తారక రాముడు మౌనముద్రలోనే ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ సంజాయిషీ ఇచ్చుకునేది ఏమీ లేదు. లక్షల మంది అభిమానులు ఎలా ఉండాలనేది ఎన్టీఆర్ కంట్రోల్ చేయలేడు. అయితే లోగడ ఇలాంటి ఫిర్యాదు తన అభిమానులపై వచ్చినపుడు తమిళ స్టార్ అజిత్ చాలా ఘాటుగా స్పందించాడు.
తన అభిమాన సంఘాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్టీఆర్ కూడా అలా అభిమానులను మందలించాలని, మిగతా హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియాలో పద్ధతిగా మసలుకొనేలా చూసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికి అయితే సైలెంట్ గా ఉన్నాడు.
This post was last modified on June 7, 2020 7:51 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…