Political News

అమరావతిపై బీజేపీలో గందరగోళం

అమరావతినే ఏకైక రాజధానిగా కంటిన్యూ చేయాలనే విషయంలో బీజేపీలో గందరగోళం మొదలైందా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే అమరావతినే ఏకైక రాజధానిగా కంటిన్యూ చేయాలనే డిమాండ్ తో రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలం నుంచి తిరుమలకు మహా పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే.

ఈ మహాపాదయాత్రలో రైతులు, వివిధ పార్టీల నేతలు, మద్దతుదారులు పాల్గొంటున్నారు. ఈ యాత్రలో బీజేపీ స్ధానిక నేతలు కూడా పాల్గొంటున్నారట. ఇక్కడే పార్టీలో సమస్యంతా మొదలైంది. బీజేపీ నేతలు పాల్గొంటున్న ఈ యాత్రలో పాల్గొనవద్దని పార్టీ ఏపీ ఇన్చార్జి సునీల్ దేవదర్ ఫోన్లు చేసి ఆదేశాలు జారీచేస్తున్నట్లు సమాచారం. ఒకవైపు బీజేపీ స్టేట్ చీఫ్ సోమువీర్రాజేమో మహా పాదయాత్ర కు మద్దతు పలికారు.

అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ కు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. వీర్రాజు ప్రకటనకు తగ్గట్లుగానే జిల్లాల నేతలు కూడా యాత్రలో పాల్గొంటున్నారు. ఇలా యాత్రలో పాల్గొంటున్న నేతల్లో కొందరికి దేవదర్ ఫోన్లు చేసి పాల్గొనవద్దని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తమ పార్టీ అసలు అమరావతికి వ్యతిరేకమా ? లేకపోతే మద్దతు ఇస్తున్నదా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయానికి స్టేట్ ఇన్చార్జి ఆదేశాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉండటంతో ఎవరి మాట వినాలో నేతలకు అర్ధం కావటంలేదట. అసలు మహాపాదయాత్ర పై పార్టీలో ఎందుకింత గందరగోళం మొదలైందో కూడా నేతలకు అర్ధం కావటంలేదు. సరే దేవదర్ ఫోన్ ఆదేశాలను పక్కనపెట్టేస్తే పార్టీలో రాజధాని విషయంలో స్పష్టమైన చీలిక ఉండటం మాత్రం వాస్తవం. మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయంపై ఉత్తరాంధ్రలోని కొందరు నేతలు మద్దతుగా మాట్లాడుతున్నది వాస్తవం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిదే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. ఇదే నిర్ణయాన్ని అఫిడవిట్ రూపంలో మూడుసార్లు హైకోర్టులో ఇప్పటికే దాఖలు చేసుంది. రైతుల భూములపై జగన్ ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి. మరి ఇంతలోనే మహాపాదయాత్ర విషయంలో బీజేపీలో ఇంత గందరగోళం ఎందుకు మొదలైందో అర్ధం కావటంలేదు.

This post was last modified on November 15, 2021 11:22 am

Share
Show comments
Published by
satya
Tags: AmaravatiBJP

Recent Posts

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

8 mins ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

1 hour ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

2 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

2 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

4 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

4 hours ago