Political News

జగన్ అండ్ కో.. దీనికేం సమాధానం చెబుతారు?


అది 2019 మార్చి 15వ తేదీ.. ఇంకో నెల రోజుల్లోపే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. అలాంటి టైంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి.. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లుగా వార్తలొచ్చాయి. ఆ వార్తను ముందుగా రిపోర్ట్ చేసింది సాక్షి మీడియానే. కానీ కాసేపటి తర్వాత వివేకా చనిపోయింది గుండెపోటుతో కాదు.. ఆయన్ని ఎవరో దారుణంగా హత్య చేశారన్న సమాచారం బయటికి వచ్చింది. ఒంటిపై తీవ్ర గాయాలతో వివేకా విగత జీవిగా మారిన ఫొటోలు సైతం మీడియాలో వైరల్ అయ్యాయి.

జగన్ సహా వైకాపా నేతలంతా వివేకాను హత్య చేయించింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే అంటూ నిందమోపారు. మరుసటి రోజు సాక్షి పత్రికలో ఒక ఫుల్ పేజీ స్టోరీ వేశారు. దానికి హెడ్డింగ్.. నారాసుర రక్తచరిత్ర. సాక్షాత్తూ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేతిలో కత్తి ఉన్నట్లుగా గ్రాఫిక్ చేయించి.. ఆయనే ఈ హత్య చేయించినట్లు, ఇంకా మరెన్నో హత్యలు కూడా చేసినట్లుగా కథనం తీర్చిదిద్దారు. వివేకా హత్య నింద చంద్రబాబు మీద మోపి ఆయనపై జనాలకు అనుమానాలు కలిగేలా.. అదే సమయంలో జగన్‌కు సానుభూతి వచ్చేలా చేయడంలో సాక్షి మీడియా విజయవంతం అయింది.

కట్ చేస్తే రెండు నెలలు తిరిగేసరికి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో ఈ కేసు ఏమాత్రం ముందుకు కదల్లేదు. ఏపీ పోలీసులు హత్యకు సూత్రధారులెవరో తేల్చలేకపోయారు. నిజంగా చంద్రబాబో లేదా టీడీపీ నేతలో ఈ హత్య చేయించి ఉంటే జగన్ సర్కారు దాన్ని నిరూపించడం కష్టమేమీ కాదు. ఏపీ పోలీసుల నిర్వాకంతో కోర్టు జోక్యం చేసుకుని కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ చేసిన దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో ఈ హత్య వెనుకు ఉన్నదెవరో బయటికి వచ్చింది.

ఈ హత్యలో జగన్‌ దగ్గరి బంధువు, ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా.. వివేకాతో సన్నిహితంగా ఉన్న వాళ్లే.. దాదాపుగా అందరూ వైకాపా వాళ్లే ఈ హత్యలో పాల్గొన్నట్లుగా దస్తగిరి వాంగ్మూలం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. మరి ఆనాడు చంద్రబాబు అండ్ కో మీద నిందలేసి ఆ స్థాయిలో సాక్షి మీడియా, వైకాపా వాళ్లు చేసిన హడావుడికి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారన్నది ప్రశ్న.

This post was last modified on November 14, 2021 3:53 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

51 mins ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

54 mins ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

1 hour ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

2 hours ago

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

3 hours ago

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

4 hours ago