Political News

పాపం..మర్రి రాజశేఖర్

మర్రి రాజశేఖర్ వైసీపీలోని సీనియర్ నేతల్లో ఒకరు. అయితే దురదృష్టం వెంటాడుతున్న నేతల్లో ముందు వరసలో ఉంటారు. ఇంతకీ ఆయన్ను వెంటాడుతున్న దురదృష్టం ఏమిటంటే ఎంఎల్సీ పదవి అందని ద్రాక్ష పండులా తయారైపోయింది. నిజానికి 2019లోనే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట ఎంఎల్ఏ టికెట్ రావాల్సింది. అయితే చివరి నిముషంలో టికెట్ దక్కలేదు. దాంతో ఎంఎల్ఏ టికెట్ ఇవ్వలేకపోయినందుకు ప్రత్యామ్నాయంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఎంఎల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని స్వయంగా జగన్మోహన్ రెడ్డే హామీ ఇచ్చారు.

అయితే తెరవెనుక ఏమి జరుగుతోందో ఏమో తెలీటం లేదుకానీ గడచిన రెండున్నరేళ్ళుగా ఎప్పుడు ఎంఎల్సీ పదవుల భర్తీ అవకాశం వచ్చినా మర్రికి మాత్రం దక్కటం లేదు. ప్రతిసారి మర్రికి ఎంఎల్సీ ఖాయమని ప్రచారం జరగటం చివరకు అందకుండా పోవటం రివాజుగా మారిపోయింది. తాజాగా ప్రకటించిన 11 మంది ఎంఎల్సీల జాబితాలో కూడా మర్రి పేరు మిస్సయిపోయింది. ముందుగా ఎంఎల్ఏ కోటాలో మూడు పేర్లలో ఉంటుందని అనుకున్నారు. ఎక్కడా కనబడలేదు.

ఇపుడు స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన 11 మంది స్ధానాల్లో మర్రికి ఖాయమనే పార్టీలో ప్రచారం జరిగింది. ఎలాగూ 11 మందికి ఇస్తున్నారు కాబట్టి మర్రికి ఖాయమనే అనుకున్నారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన 11 పేర్లలో మర్రి పేరు మళ్ళీ మిస్సయింది. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినా పదవి దక్కటం లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి జగన్ హామీ ఇస్తే దాన్ని నిలుపుకుంటారనే పేరుంది. కానీ విచిత్రంగా మర్రి విషయంలోనే ప్రతిసారి ఎందుకు మిస్సవుతోందో అర్ధం కావటంలేదు.

జరుగుతున్నది చూస్తుంటే జగన్-మర్రి మధ్య ఏదో జరిగినట్లే అనుమానంగా ఉంది. లేకపోతే ఇన్నిసార్లు అవకాశాలు వస్తున్నా మర్రికి ఛాన్సు మిస్సయే అవకాశమే లేదు. స్ధానికసంస్ధల కోటాలో ఎక్కువమందిని ఎకామిడేట్ చేసే అవకాశం వచ్చినా మర్రికి ఛాన్సు ఎందుకు రాలేదన్నదే పెద్ద పజిల్ అయిపోయింది. మొత్తానికి మర్రిని చూస్తున్న వారంతా పాపం మర్రి అని నిట్టూర్పులు విడవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.

This post was last modified on November 14, 2021 8:39 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

15 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

1 hour ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

1 hour ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago