Political News

పాపం..మర్రి రాజశేఖర్

మర్రి రాజశేఖర్ వైసీపీలోని సీనియర్ నేతల్లో ఒకరు. అయితే దురదృష్టం వెంటాడుతున్న నేతల్లో ముందు వరసలో ఉంటారు. ఇంతకీ ఆయన్ను వెంటాడుతున్న దురదృష్టం ఏమిటంటే ఎంఎల్సీ పదవి అందని ద్రాక్ష పండులా తయారైపోయింది. నిజానికి 2019లోనే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట ఎంఎల్ఏ టికెట్ రావాల్సింది. అయితే చివరి నిముషంలో టికెట్ దక్కలేదు. దాంతో ఎంఎల్ఏ టికెట్ ఇవ్వలేకపోయినందుకు ప్రత్యామ్నాయంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఎంఎల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని స్వయంగా జగన్మోహన్ రెడ్డే హామీ ఇచ్చారు.

అయితే తెరవెనుక ఏమి జరుగుతోందో ఏమో తెలీటం లేదుకానీ గడచిన రెండున్నరేళ్ళుగా ఎప్పుడు ఎంఎల్సీ పదవుల భర్తీ అవకాశం వచ్చినా మర్రికి మాత్రం దక్కటం లేదు. ప్రతిసారి మర్రికి ఎంఎల్సీ ఖాయమని ప్రచారం జరగటం చివరకు అందకుండా పోవటం రివాజుగా మారిపోయింది. తాజాగా ప్రకటించిన 11 మంది ఎంఎల్సీల జాబితాలో కూడా మర్రి పేరు మిస్సయిపోయింది. ముందుగా ఎంఎల్ఏ కోటాలో మూడు పేర్లలో ఉంటుందని అనుకున్నారు. ఎక్కడా కనబడలేదు.

ఇపుడు స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన 11 మంది స్ధానాల్లో మర్రికి ఖాయమనే పార్టీలో ప్రచారం జరిగింది. ఎలాగూ 11 మందికి ఇస్తున్నారు కాబట్టి మర్రికి ఖాయమనే అనుకున్నారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన 11 పేర్లలో మర్రి పేరు మళ్ళీ మిస్సయింది. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినా పదవి దక్కటం లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి జగన్ హామీ ఇస్తే దాన్ని నిలుపుకుంటారనే పేరుంది. కానీ విచిత్రంగా మర్రి విషయంలోనే ప్రతిసారి ఎందుకు మిస్సవుతోందో అర్ధం కావటంలేదు.

జరుగుతున్నది చూస్తుంటే జగన్-మర్రి మధ్య ఏదో జరిగినట్లే అనుమానంగా ఉంది. లేకపోతే ఇన్నిసార్లు అవకాశాలు వస్తున్నా మర్రికి ఛాన్సు మిస్సయే అవకాశమే లేదు. స్ధానికసంస్ధల కోటాలో ఎక్కువమందిని ఎకామిడేట్ చేసే అవకాశం వచ్చినా మర్రికి ఛాన్సు ఎందుకు రాలేదన్నదే పెద్ద పజిల్ అయిపోయింది. మొత్తానికి మర్రిని చూస్తున్న వారంతా పాపం మర్రి అని నిట్టూర్పులు విడవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.

This post was last modified on November 14, 2021 8:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

1 hour ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

3 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

6 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

14 hours ago