Political News

పాపం..మర్రి రాజశేఖర్

మర్రి రాజశేఖర్ వైసీపీలోని సీనియర్ నేతల్లో ఒకరు. అయితే దురదృష్టం వెంటాడుతున్న నేతల్లో ముందు వరసలో ఉంటారు. ఇంతకీ ఆయన్ను వెంటాడుతున్న దురదృష్టం ఏమిటంటే ఎంఎల్సీ పదవి అందని ద్రాక్ష పండులా తయారైపోయింది. నిజానికి 2019లోనే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట ఎంఎల్ఏ టికెట్ రావాల్సింది. అయితే చివరి నిముషంలో టికెట్ దక్కలేదు. దాంతో ఎంఎల్ఏ టికెట్ ఇవ్వలేకపోయినందుకు ప్రత్యామ్నాయంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఎంఎల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని స్వయంగా జగన్మోహన్ రెడ్డే హామీ ఇచ్చారు.

అయితే తెరవెనుక ఏమి జరుగుతోందో ఏమో తెలీటం లేదుకానీ గడచిన రెండున్నరేళ్ళుగా ఎప్పుడు ఎంఎల్సీ పదవుల భర్తీ అవకాశం వచ్చినా మర్రికి మాత్రం దక్కటం లేదు. ప్రతిసారి మర్రికి ఎంఎల్సీ ఖాయమని ప్రచారం జరగటం చివరకు అందకుండా పోవటం రివాజుగా మారిపోయింది. తాజాగా ప్రకటించిన 11 మంది ఎంఎల్సీల జాబితాలో కూడా మర్రి పేరు మిస్సయిపోయింది. ముందుగా ఎంఎల్ఏ కోటాలో మూడు పేర్లలో ఉంటుందని అనుకున్నారు. ఎక్కడా కనబడలేదు.

ఇపుడు స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన 11 మంది స్ధానాల్లో మర్రికి ఖాయమనే పార్టీలో ప్రచారం జరిగింది. ఎలాగూ 11 మందికి ఇస్తున్నారు కాబట్టి మర్రికి ఖాయమనే అనుకున్నారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన 11 పేర్లలో మర్రి పేరు మళ్ళీ మిస్సయింది. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినా పదవి దక్కటం లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి జగన్ హామీ ఇస్తే దాన్ని నిలుపుకుంటారనే పేరుంది. కానీ విచిత్రంగా మర్రి విషయంలోనే ప్రతిసారి ఎందుకు మిస్సవుతోందో అర్ధం కావటంలేదు.

జరుగుతున్నది చూస్తుంటే జగన్-మర్రి మధ్య ఏదో జరిగినట్లే అనుమానంగా ఉంది. లేకపోతే ఇన్నిసార్లు అవకాశాలు వస్తున్నా మర్రికి ఛాన్సు మిస్సయే అవకాశమే లేదు. స్ధానికసంస్ధల కోటాలో ఎక్కువమందిని ఎకామిడేట్ చేసే అవకాశం వచ్చినా మర్రికి ఛాన్సు ఎందుకు రాలేదన్నదే పెద్ద పజిల్ అయిపోయింది. మొత్తానికి మర్రిని చూస్తున్న వారంతా పాపం మర్రి అని నిట్టూర్పులు విడవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.

This post was last modified on November 14, 2021 8:39 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

26 mins ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

1 hour ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

2 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

3 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

3 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

4 hours ago