‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది కాకుండా మరో పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అదొక ఐటెం సాంగ్. అల్లు అర్జున్-రష్మిక జంటగా నటిస్తోన్న ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఓ పక్క షూటింగ్ జరుగుతుండగానే.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా షురూ చేసేశారు. ఇప్పుడు ఐటెం సాంగ్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్ లో కనిపించబోతుందట. పూజాహెగ్డే, తమన్నాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఇంకా క్లారిటీ రాలేదు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘రంగస్థలం’ సినిమాలో పూజా ఐటెం సాంగ్ లో కనిపించింది. కానీ ప్రస్తుతం ఆమెకి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ‘పుష్ప’కి డేట్స్ ఇస్తుందా..? అంటే సందేహమే. మరి సుకుమార్ ఎవరిని ఫైనల్ చేసుకున్నారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి సుకుమార్ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉండేలా చూసుకుంటారు. ‘పుష్ప’ కోసం కూడా ఐటెం సాంగ్ ను భారీగా ప్లాన్ చేశారట. నవంబర్ మూడో వారంలో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. దాంతో షూటింగ్ కి ఎండ్ కార్డ్ పడుతుంది. వీలైనంత త్వరగా ఎడిటింగ్ వర్క్ పూర్తి చేసి చెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది.
This post was last modified on November 14, 2021 8:15 am
జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…