‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది కాకుండా మరో పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అదొక ఐటెం సాంగ్. అల్లు అర్జున్-రష్మిక జంటగా నటిస్తోన్న ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఓ పక్క షూటింగ్ జరుగుతుండగానే.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా షురూ చేసేశారు. ఇప్పుడు ఐటెం సాంగ్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్ లో కనిపించబోతుందట. పూజాహెగ్డే, తమన్నాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఇంకా క్లారిటీ రాలేదు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘రంగస్థలం’ సినిమాలో పూజా ఐటెం సాంగ్ లో కనిపించింది. కానీ ప్రస్తుతం ఆమెకి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ‘పుష్ప’కి డేట్స్ ఇస్తుందా..? అంటే సందేహమే. మరి సుకుమార్ ఎవరిని ఫైనల్ చేసుకున్నారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి సుకుమార్ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉండేలా చూసుకుంటారు. ‘పుష్ప’ కోసం కూడా ఐటెం సాంగ్ ను భారీగా ప్లాన్ చేశారట. నవంబర్ మూడో వారంలో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. దాంతో షూటింగ్ కి ఎండ్ కార్డ్ పడుతుంది. వీలైనంత త్వరగా ఎడిటింగ్ వర్క్ పూర్తి చేసి చెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది.
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…