Movie News

‘పుష్ప’.. ఐటెం సాంగ్ ఒక్కటే బ్యాలెన్స్!

‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది కాకుండా మరో పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అదొక ఐటెం సాంగ్. అల్లు అర్జున్-రష్మిక జంటగా నటిస్తోన్న ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఓ పక్క షూటింగ్ జరుగుతుండగానే.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా షురూ చేసేశారు. ఇప్పుడు ఐటెం సాంగ్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్ లో కనిపించబోతుందట. పూజాహెగ్డే, తమన్నాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఇంకా క్లారిటీ రాలేదు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘రంగస్థలం’ సినిమాలో పూజా ఐటెం సాంగ్ లో కనిపించింది. కానీ ప్రస్తుతం ఆమెకి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ‘పుష్ప’కి డేట్స్ ఇస్తుందా..? అంటే సందేహమే. మరి సుకుమార్ ఎవరిని ఫైనల్ చేసుకున్నారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి సుకుమార్ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉండేలా చూసుకుంటారు. ‘పుష్ప’ కోసం కూడా ఐటెం సాంగ్ ను భారీగా ప్లాన్ చేశారట. నవంబర్ మూడో వారంలో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. దాంతో షూటింగ్ కి ఎండ్ కార్డ్ పడుతుంది. వీలైనంత త్వరగా ఎడిటింగ్ వర్క్ పూర్తి చేసి చెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది.

This post was last modified on November 14, 2021 8:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

4 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

4 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

7 hours ago