ఇంతకుముందు ఫిబ్రవరి రెండో సగం.. మార్చి ప్రథమార్ధం అంటేనే అన్ సీజన్ అనుకునేవాళ్లు. ఆ టైంలో మామూలుగా విద్యార్థులకు పరీక్షలుంటాయి. వాళ్లతో పాటు ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు రావు. అందుకే ఆ టైంలో పెద్దగా వసూళ్లు ఉండవు. కాబట్టే పేరున్న సినిమాలను ఆ టైంలో రిలీజ్ చేయరు.
కానీ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలు వసూళ్ల మోత మోగించాయి. వచ్చే ఏడాది ఈ రెండు నెలల్లోనే ఆచార్య, ఎఫ్-3, ఖిలాడి, మేజర్ లాంటి క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఫిబ్రవరి, మార్చి నెలల విషయంలో ఇలా అభిప్రాయాలు మారిపోతుండగా.. నవంబరేమో అస్సలు సినిమాలకు అచ్చిరాని నెలగా మారిపోతోంది. కొన్నేళ్లుగా ఈ నెలలో రిలీజవుతున్న సినిమాలేవీ సరిగా ఆడటం లేదు. ఈ ఏడాది కూడా నవంబరు డల్లుగా మారిపోయింది.
గత నెలలో దసరా సినిమాలే కాక వేరేవి కూడా సందడి చేశాయి. వచ్చే నెలలో ఎలాగూ భారీ చిత్రాల సందడి ఉంది. కానీ మధ్యలో నవంబరే ఎటూ కాకుండా తయారైంది. దీపావళి కానుకగా వచ్చిన సినిమాల్లో ఏవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మంచి రోజులు వచ్చాయితో పాటు తమిళ అనువాదాలు పెద్దన్న, ఎనిమీ నిరాశ పరిచాయి.
ఇక ఈ వారం సినిమాలపై ప్రేక్షకులకు ఏమంత ఆసక్తి లేదని వాటికి వచ్చిన డల్ ఓపెనింగ్స్ను బట్టి అర్థమవుతోంది. పుష్పక విమానం, రాజా విక్రమార్క, కురుప్.. ఈ మూడు చిత్రాల్లో దేనికీ మంచి టాక్ రాలేదు. ఇక వచ్చే వారం అయితే బాక్సాఫీస్ వెలవెలబోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఊరూ పేరూ లేని.. చిన్నా చితకా సినిమాలు తప్ప పేరున్న సినిమాలేవీ వచ్చే వారానికి షెడ్యూల్ కాలేదు. ఇక నవంబరు చివరి వారంలో గుడ్ లక్ సఖి, అనుభవించు రాజా రావాల్సి ఉంది. అవీ చిన్న స్థాయి సినిమాలే. వాటిపై అంచనాలూ తక్కువే. మొత్తానికి నవంబరులో బాక్సాఫీస్ పూర్తిగా డల్ అయినట్లే కనిపిస్తోంది. డిసెంబరు మొదటి వారంలో అఖండ వస్తే కానీ మళ్లీ బాక్సాఫీస్లో వేడి పుట్టేలా లేదు.
This post was last modified on November 14, 2021 11:18 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…