ఇంతకుముందు ఫిబ్రవరి రెండో సగం.. మార్చి ప్రథమార్ధం అంటేనే అన్ సీజన్ అనుకునేవాళ్లు. ఆ టైంలో మామూలుగా విద్యార్థులకు పరీక్షలుంటాయి. వాళ్లతో పాటు ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు రావు. అందుకే ఆ టైంలో పెద్దగా వసూళ్లు ఉండవు. కాబట్టే పేరున్న సినిమాలను ఆ టైంలో రిలీజ్ చేయరు.
కానీ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలు వసూళ్ల మోత మోగించాయి. వచ్చే ఏడాది ఈ రెండు నెలల్లోనే ఆచార్య, ఎఫ్-3, ఖిలాడి, మేజర్ లాంటి క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఫిబ్రవరి, మార్చి నెలల విషయంలో ఇలా అభిప్రాయాలు మారిపోతుండగా.. నవంబరేమో అస్సలు సినిమాలకు అచ్చిరాని నెలగా మారిపోతోంది. కొన్నేళ్లుగా ఈ నెలలో రిలీజవుతున్న సినిమాలేవీ సరిగా ఆడటం లేదు. ఈ ఏడాది కూడా నవంబరు డల్లుగా మారిపోయింది.
గత నెలలో దసరా సినిమాలే కాక వేరేవి కూడా సందడి చేశాయి. వచ్చే నెలలో ఎలాగూ భారీ చిత్రాల సందడి ఉంది. కానీ మధ్యలో నవంబరే ఎటూ కాకుండా తయారైంది. దీపావళి కానుకగా వచ్చిన సినిమాల్లో ఏవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మంచి రోజులు వచ్చాయితో పాటు తమిళ అనువాదాలు పెద్దన్న, ఎనిమీ నిరాశ పరిచాయి.
ఇక ఈ వారం సినిమాలపై ప్రేక్షకులకు ఏమంత ఆసక్తి లేదని వాటికి వచ్చిన డల్ ఓపెనింగ్స్ను బట్టి అర్థమవుతోంది. పుష్పక విమానం, రాజా విక్రమార్క, కురుప్.. ఈ మూడు చిత్రాల్లో దేనికీ మంచి టాక్ రాలేదు. ఇక వచ్చే వారం అయితే బాక్సాఫీస్ వెలవెలబోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఊరూ పేరూ లేని.. చిన్నా చితకా సినిమాలు తప్ప పేరున్న సినిమాలేవీ వచ్చే వారానికి షెడ్యూల్ కాలేదు. ఇక నవంబరు చివరి వారంలో గుడ్ లక్ సఖి, అనుభవించు రాజా రావాల్సి ఉంది. అవీ చిన్న స్థాయి సినిమాలే. వాటిపై అంచనాలూ తక్కువే. మొత్తానికి నవంబరులో బాక్సాఫీస్ పూర్తిగా డల్ అయినట్లే కనిపిస్తోంది. డిసెంబరు మొదటి వారంలో అఖండ వస్తే కానీ మళ్లీ బాక్సాఫీస్లో వేడి పుట్టేలా లేదు.
This post was last modified on November 14, 2021 11:18 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…