రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి.. ప్రధాని నరేంద్రమోడీ సర్కారుకు మరో భారీ ఎదురు దెబ్బతగిలింది. ఈ ఒప్పందంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఇప్పటి వరకు ఆరోపణల్లో ఏమీ వాస్తవం లేదని.. బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ, తాజాగా.. ఫ్రెంచ్ కు చెందిన అతి పెద్ద పత్రిక.. ‘మీడియా పార్ట్’ ఒక కథనం ప్రచురించింది. దీనిలో రాఫెల్ బాగోతాన్ని పూస గుచ్చినట్టు వివరించింది. ఈ ఒప్పందానికి సంబంధించి బోగస్ ఇన్వాయిస్లు సమర్పించడం తోపాటు.. 7.5 మిలియన్ యూరోల ముడుపులు చేతులు మారాయని స్పష్టం చేసింది. ఇదంతా కూడా మధ్యవర్తి (మిడిల్ మ్యాన్) ద్వారా కథను నడిపించారని తేటతెల్లం చేసింది.
ఫ్రెంచ్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ సంస్థ దస్సాల్ట్ ఏవియేషన్ భారత్తో రాఫెల్ డీల్ను ఏర్పరుచుకోవడంలో సహాయపడటానికి మధ్యవర్తికి కనీసం 7.5 మిలియన్ యూరోల రహస్య కమీషన్లను చెల్లించేలా బూటకపు ఇన్వాయిస్లను ఉపయోగించినట్లు ఫ్రెంచ్ జర్నల్ పేర్కొంది. ఈ కథనం అటు ఫ్రెంచ్లోను, ఇటు భారత్లోనూ సంచలనం రేపుతోంది. అయితే.. దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ లేదా దసాల్ట్ ఏవియేషన్ నుండి ఇంకా ఎటువంటి స్పందన లేదు.
ఫ్రెంచ్ పరిశోధనాత్మక(ఇన్వెస్టిగేటివ్) జర్నల్ మీడియాపార్ట్ తాజాగా పేర్కొన్న కథనం మేరకు.. బోగస్ ఇన్వాయిస్లను ఉపయోగించిందని ఆరోపించిన ఫ్రెంచ్ విమానాల తయారీ సంస్థ దస్సాల్ట్ ఏవియేషన్ భారత్తో రాఫెల్ ఒప్పందాన్ని పొందడంలో సహాయపడటానికి మధ్యవర్తికి కనీసం 7.5 మిలియన్ యూరోల రహస్య కమీషన్లను చెల్లించేలా చేసిందని ఆధారాలతో సహా చూపింది.
36 రాఫెల్ యుద్ధ విమానాల సరఫరా కోసం భారతదేశంతో రూ. 59,000 కోట్ల ఒప్పందంలో అవినీతి మరియు అనుకూలతపై “అత్యంత సున్నితమైన” న్యాయ విచారణకు నాయకత్వం వహించడానికి ఫ్రెంచ్ న్యాయమూర్తిని నియమించినట్లు మీడియాపార్ట్ జూలైలో నివేదించింది.
“భారతదేశానికి 36 రాఫెల్ యుద్ధ విమానాలను విక్రయించడంలో సహాయపడటానికి మధ్యవర్తికి కనీసం 7.5 మిలియన్ యూరోల రహస్య కమీషన్లు చెల్లించడానికి ఫ్రెంచ్ విమానాల తయారీ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్కు వీలు కల్పించిన తప్పుడు ఇన్వాయిస్లను మీడియాపార్ట్ ఈరోజు ప్రచురిస్తోంది” అని జర్నల్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు, “ఈ పత్రాలు” ఉనికిలో ఉన్నప్పటికీ, భారత దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాయని ఆరోపించింది.
ఇది ఆఫ్షోర్ కంపెనీలు, సందేహాస్పద ఒప్పందాలు మరియు తప్పుడు ఇన్వాయిస్లను కలిగి ఉందని పేర్కొంది. భారతదేశం యొక్క ఫెడరల్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ (CBI) నుండి డిటెక్టివ్లు మరియు మనీ లాండరింగ్పై పోరాడుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సహచరులు, ఫ్రెంచ్ ఏవియేషన్ సంస్థ దసాల్ట్ కనీసం 7.5 చెల్లించినట్లు అక్టోబర్ 2018నే గుర్తించినట్టు మీడియాపార్ట్ వెల్లడించింది. మిడిల్మాన్ సుషేన్ గుప్తాకు రహస్య కమీషన్లలో మిలియన్ యూరోలు(రూ. 650 మిలియన్లకు సమానం)“ అందినట్టు మీడియాపార్ట్ నివేదికలో పేర్కొంది.
2016లో 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్కు విక్రయించేందుకు 7.8 బిలియన్ యూరోల డీల్ను సాధించేందుకు ఫ్రెంచ్ సంస్థ విజయం సాధించడానికి ఈ ఒప్పందమే కీలకమని పేర్కొంది. అయితే.. ఈ ఆరోపణలను అటు దస్సాల్ట్, ఇటు భారత ప్రభుత్వం కూడా తోసిపుచ్చాయి. కానీ, అవినీతి జరిగిందనేది .. అటు కేంద్ర ప్రభుత్వానికి.. ఇటు ఫ్రెంచ్ అధికారులకు కూడా తెలుసని.. ఈ పత్రిక వెల్లడించింది. దీంతో ఇప్పుడు మరోసారి రాఫెల్ వివాదం మరింత రాజుకున్నట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు. మరిదీనిపై విపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
This post was last modified on November 9, 2021 4:57 pm
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…