Political News

మోడీ మాస్ట‌ర్ ప్లాన్‌.. రాష్ట్రాల‌పై ఒత్తిడి

రాజ‌కీయ నాయ‌కులు ఏం చేసినా బ‌య‌ట‌కు క‌నిపించేది ఒక‌టి ఉంటే.. దాని వెన‌క మ‌రో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న నేత‌లు ఏం చేసినా.. అధి త‌మ అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు తీసుకున్న నిర్ణ‌యంగానే క‌నిపిస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే? తాజాగా ప్ర‌ధాని మోడీ తీసుకున్న ఓ నిర్ణ‌యం కూడా ఇలాగే ఉంది మ‌రి. దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని దేశ ప్ర‌జ‌ల‌కు కానుక ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం లీట‌ర్‌కు పెట్రోల్‌పై రూ.5, డీజీల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పండ‌గ రోజున ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగించిన నిర్ణ‌య‌మిది అని బీజేపీ శ్రేణులు గొప్ప‌గా చెప్పుకుంటున్నాయి.

అయితే మోడీ నిర్ణయం వెన‌క మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గించిన కేంద్రం.. రాష్ట్రాలు కూడా ఎంతో కొంత ప‌న్ను త‌గ్గించుకోవాల‌ని కోరింది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు ప‌న్ను త‌గ్గించాయి. కానీ బీజేపీయేత‌ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రం ఇంకా ప‌న్ను త‌గ్గించ‌లేదు. మ‌హారాష్ట్ర, ఢిల్లీ, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌, మేఘాల‌య‌, పంజాబ్‌, రాజ‌స్థాన్‌.. ఇలా మొత్తం 14 రాష్ట్రాల్లో ప‌న్ను త‌గ్గింపు లేదు. అక్క‌డి ప్ర‌భుత్వాలు ఇంకా దీనిపై ఓ నిర్ణ‌యం తీసుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌పై బీజేపీ నాయకులు ఇప్పుడు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేంద్రం ప‌న్ను త‌గ్గించ‌గా లేనిది ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎందుకు మౌనంగా ఉందంటూ బీజేపీ నాయ‌కులు మాట‌ల‌తో రెచ్చిపోతున్నారు. ఇలా జ‌ర‌గాల‌నే మోడీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల‌తో పాటు లోక్‌స‌భ స్థానాల‌కూ ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. వాటిలో బీజేపీకి ఎదురు దెబ్బ త‌గిలింది. దీంతో ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌ను చాలా ఆల‌స్యంగా అర్థం చేసుకున్న మోడీ ఇప్పుడు చ‌మురు ఉత్ప‌త్తుల‌పై ఎక్సైజ్ సుంకం త‌గ్గించింద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. అలాగే రాష్ట్రాలు కూడా త‌గ్గించాల‌ని సూచించి ఇప్పుడు ఆయా ప్ర‌భుత్వాల‌ను ఇర‌కాటంలో పెట్టింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కేంద్రం బాట‌లో సాగాయి. కానీ ఇత‌ర రాష్ట్రాలు మాత్రం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. అందులో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ప‌న్ను త‌గ్గించాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌భుత్వంపై ఒత్తిడి వ‌స్తోంది. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడి బండి సంజ‌య్‌తో పాటు డీకే అరుణ లాంటి నాయ‌కులు ఈ మేర‌కు కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నారు. ఏపీలోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఇలాంటి ప‌రిస్థితే ఎదుర‌వుతోంది. మ‌రోవైపు ఏకంగా రూ.40 పెంచి ఇప్పుడు రూ.5 త‌గ్గించ‌డంపై కేంద్రంపైనా సామాన్య ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Satya

Recent Posts

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

34 minutes ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

38 minutes ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

2 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

3 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

3 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

3 hours ago