Political News

చేరిక‌లు.. ప్ర‌చారాలు.. సంద‌డి షురూ!

ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కుల‌ను ఆక‌ర్షించ‌డం.. త‌మ ప్ర‌యోజ‌నాల కోసం నేత‌లు పార్టీలు మార‌డం.. హోరాహోరీ ప్ర‌చారం.. సెల‌బ్రిటీల చేరిక‌లు.. ఇలా దేశ‌వ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లో ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైపోయింది. వ‌చ్చే ఏడాది కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు పంజాబ్, గోవా, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్ర శాస‌న‌స‌భ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నిక‌ల‌కు మ‌రికొద్ది నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఇప్ప‌టి నుంచే ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం క‌స‌ర‌త్తులు మొద‌లెట్టేశాయి. ఆ దిశ‌గా వ్యూహాలు, ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి.

కేంద్రంలో అధికారంలోకి రావాల‌నుకునే పార్టీల‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ఎంతో కీల‌క‌మైన‌వి. దేశంలోనే అత్య‌ధికంగా 403 అసెంబ్లీ స్థానాలు ఉండ‌డంతో అన్ని పార్టీలు అక్క‌డ విజ‌యం కోసం తీవ్రంగానే పోరాడ‌తాయి. ప్ర‌స్తుతం అక్క‌డ అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నిక‌ల్లోనూ జెండా ఎగ‌రేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. మ‌రోవైపు ఈ రాష్ట్రంలో అధికారం సాధించి కేంద్రంలో గద్దెనెక్కే దిశ‌గా అడుగులు వేయాల‌ని కాంగ్రెస్ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది.

మ‌రోవైపు ఆ రాష్ట్రంలో పాగా కోసం స‌మాజ్‌వాదీ పార్టీ శాయాశ‌క్తులా కృషి చేస్తోంది. అందులో భాగంగానే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా అధ్యక్షుడు అఖిలేశ్ యాద‌వ్ అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా యూపీలో ఏడుగురు ఎమ్మెల్యేలు అఖిలేశ్ స‌మ‌క్షంలో స‌మాజ్‌వాదీ పార్టీలో చేరారు. అందులో ఒక‌రు అధికార బీజేపీ ఎమ్మెల్యే కాగా.. మిగ‌తా ఆరుగురు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ శాస‌న‌సభ్యులు. పార్టీకి వ్య‌తిరేక బావుటా ఎగ‌రేయ‌డంతో ఆ ఆరుగురిపై బీఎస్పీ పార్టీ వేటు వేసినట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు దేశంలో బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని భావిస్తున్న తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం ప‌శ్చిమ బెంగాల్‌కే ప‌రిమిత‌మైన ఆమె.. ఇప్పుడు ఇత‌ర రాష్ట్రాల్లోనూ పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆమె గోవాపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. తాజాగా టెన్నిస్ దిగ్గ‌జం లియాండ‌ర్ పేస్‌ను గోవాలోనే పార్టీలో చేర్చుకున్న ఆమె.. అక్క‌డ మూడు రోజుల ప‌ర్య‌టించి పార్టీ శ్రేణుల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల కోసం సిద్ధం చేశారు. ఇక దేశంలో తిరిగి పున‌ర్వైభ‌వం సాధించాల‌నే ధ్యేయంతో ఉన్న కాంగ్రెస్ కూడా ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. ఆ పార్టీ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ ఇప్ప‌టి నుంచే గోవాలో ప్ర‌చారం మొద‌లెట్టారు. ఇలా మొత్తానికి ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు నుంచే ఆ సంద‌డి ప్రారంభమైంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

This post was last modified on November 1, 2021 9:14 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

1 hour ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

3 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

3 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

5 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

8 hours ago