Political News

రండి.. ‘బూతుల’ పై చ‌ర్చిద్దాం..

చిత్తూరు జిల్లాలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తాజాగా ఏపీ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కుప్పంలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు. బూతులు ఎవ‌రు మాట్లాడారో.. చ‌ర్చించేందుకు మేం సిద్ధం. నీకు(జ‌గ‌న్‌) ద‌మ్ముంటే.. చ‌ర్చ‌కు రా. నువ్వు చెప్పిన చోట‌కు మ‌మ్మ‌ల్ని ర‌మ్మంటావా? లేక మేం చెప్పిన చోటకు నువ్వు వ‌స్తావా? తేల్చుకో!! అంటూ.. ఆయ‌న స‌వాల్ విసిరారు. పులివెందులైనా.. తాడేప‌ల్లి ప్యాలెస్ అయినా.. అమ‌రావ‌తి అయినా.. కుప్పం అయినా.. చివ‌ర‌కు శ్రీవారం గుడిలో అయినా.. చ‌ర్చ‌కు తాము సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.

రాష్ట్రంలో వినాశ‌క‌ర పాల‌న సాగుతోంద‌న్న చంద్ర‌బాబు.. ప్ర‌జ‌లు ఇప్ప‌టికేవిసిగిపోయార‌ని.. వైసీపీ ప్ర‌భుత్వ ప‌త‌నం ప్రారంభ‌మైం ద‌ని చెప్పారు. దాడుల‌కు.. వ్యాఖ్య‌ల‌కు.. తాము వ్య‌తిరేక‌మ‌న్నారు. ఒక‌వేళ మేం రాజ‌కీయ బూతులు మాట్లాడి ఉంటే.. క్ష‌మాప‌ణ‌లు కోర‌తాం! అని ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ అండ్ కో్.. త‌మ‌పై చేసిన బూతుల‌కు ఏం చెబుతార‌ని నిల‌దీశారు. వైసీపీ ప్ర‌బుత్వంలో ప్ర‌తి ఒక్క‌రూ బిక్కు బిక్కు మంటూ.. ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకుతున్నార‌ని.. చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో అన్ని ధ‌ర‌లు మండిపోతున్నాయ‌ని.. దీనికి తోడు విద్యుత్ చార్జీల‌ను రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా పెంచార‌ని.. చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

జ‌గ‌న్ పాల‌న‌పై మేధావులు కూడా దృష్టి పెట్టాల‌ని.. చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. మేధావుల మౌనం.. రాష్ట్రానికి మంచిదికాద న్నారు. విద్యుత్ చార్జీలు, మ‌ద్యం ధ‌ర‌లు.. నాశిర‌కం మ‌ద్యం విక్ర‌యాలు.. ప్ర‌భుత్వ ఆస్తుల అమ్మ‌కాలు… ఎయిడెడ్ స్కూళ్ల విలీనం వంటి అనేక అంశాల‌పై మేధావులు చ‌ర్చించి.. ఈ ప్ర‌భుత్వానికి బుద్ది చెప్పాల‌ని చంద్ర‌బాబు కోరారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న‌కు ఇటీవ‌ల జ‌రిగిన త‌మ పార్టీపై దాడి ఘ‌ట‌నలే నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. అంతేకాదు.. తాను కుప్పానికి వ‌స్తుంటే.. విద్యుత్ క‌ట్ చేశార‌ని.. ఇది దారుణ‌మ‌ని.. ఒక ప్ర‌తిప‌క్ష నేత‌కు ఈ ప్ర‌భుత్వం ఇచ్చే విలువ ఇదేనా? అని చంద్ర‌బాబు గ‌ద్దించారు.

This post was last modified on October 29, 2021 6:25 pm

Share

Recent Posts

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

43 seconds ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

35 minutes ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

55 minutes ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

1 hour ago

ఫార్చునర్‌లో వచ్చి… చీపురు పట్టి రోడ్లు ఊడ్చేసి వెళ్తాడు!

ఫార్చునర్‌ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…

1 hour ago

బాలయ్య 111… రెండక్షరాల టైటిల్స్ రెడీ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…

2 hours ago