చంద్రబాబు కదలడానికి ముందే.. వైసీపీ ఢిల్లీని చుట్టేస్తోంది! ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. ఇటీవ ల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి.. చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అధికార-విపక్ష పార్టీల మధ్య చెలరేగిన మాటల యుద్ధం.. అనేక రూపాల్లోకి మారింది. బంద్-నిరసన, దీక్ష-నిరసన దీక్ష.. అంటూ.. రెండు పార్టీలూ.. యుద్ధం ప్రకటించుకున్నాయి. ఇక, ఈ విషయాన్ని.. ఢిల్లీకి తీసుకు వెళ్తానని చెప్పిన.. చంద్రబాబు.. అన్నంత పనీ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన పెరిగిపోయిందని.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కొరుతూ.. రాష్ట్రపతిని కలిసి వచ్చారు.
అయితే.. ఇదే విషయంపై అటు ప్రధాని, ఇటు కేంద్ర హోం మంత్రి అమిత్షాతోనూ మాట్లాడతానని అన్నారు. అయితే.. ఢిల్లీలో రెండు రోజులు మకాం వేసినా.. చంద్రబాబుకు వారికి అప్పాయింట్మెంట్లు లభించలేదు. దీంతో బాబు తిరిగి వచ్చారు. అనంతరం..అమిత్ తనకు ఫోన్ చేశారని.. జరిగిన విషయం తెలుసుకుని ఆశ్చర్య పోయారని., త్వరలోనే అప్పాయింట్మెంటు ఇస్తానని హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా ఓకే అన్నారని తెలిసింది. సో.. ఇతమిత్థంగా టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్తితి ఇదీ.
కానీ, ఇంతలో వైసీపీ.. బాబు కదిలే సరికే ఢిల్లీ చుట్టి వచ్చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయకత్వంలో ఆ పార్టీ నేతలు.. సీఎం జగన్ను దూషిస్తూ.. అసభ్యకరంగా మాట్లాడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ నాయకుడు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం.. మాధవ్ కు దాదాపు పది నిమిషాలు సమయం కేటాయించిన కేంద్ర హోంమంత్రికి.. ఆధారాలతో సహా తన లెటర్ ప్యాడ్ లో వివరాలు పొందుపరుస్తూ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు.
దీనికి సంబంధించి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తున్న ఫొటో ను ఆయన సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫిర్యాదుపై వెంటనే రియాక్ట్ అయిన షా.. మీరు చేసిన ఫిర్యాదును పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు మాధవ్ వెల్లడించారు. దీంతో చంద్రబాబు కన్నా ముందే.. అమిత్ షాకు వైసీపీ ఫిర్యాదు చేసింది. మరి.. ఇది ఎటు మలుపుతిరుగుతుంది? ఫస్ట్ ఈ ఫస్ట్ అన్న విధంగా వైసీపీ ముందుగా ఫిర్యాదు చేసింది కనుక.. ఇప్పుడు టీడీపీ ఏం చెప్పినా.. సెకండరీనే అవుతుందా? చూడాలి అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 28, 2021 10:11 pm
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…