Political News

‘టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టారు’

ఏపీ ప్రభుత్వంపై, వైసీపీ అధినేత, సీఎం జగన్ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎయిడెడ్ పాఠశాలల విలీనం వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని, ఆ విషయంలో బడికి వెళ్లే విద్యార్థులు కూడా జగన్ పై గుర్రుగా ఉన్నారని రఘురామ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ నేత పట్టాభిపై దాడి విషయంలో రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.

టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టారని రఘురామ ఆరోపణలు చేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, పట్టాభిని కొట్టారో లేదో వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టాభిని పోలీసులు కొట్టారనేందుకు తన దగ్గర ఆధారాలున్నాయని రఘురామ ధీమాగా చెప్పడం చర్చనీయాంశమైంది. పట్టాభిని అరెస్టు చేసిన తర్వాత ఆయనను కోర్టు నుంచి మచిలీపట్నం జైలుకు తీసుకువెళుతున్నారని, ఆ సమయంలో ఆయనపై దాడి జరిగిందని వెల్లడించారు.

అయితే, తనకు పోలీసులంటే గౌరవమని, కానీ, కొందరు పోలీసుల వల్ల పోలీసులందరికీ చెడ్డపేరు వస్తోందని అన్నారు. కస్టడీలోని వ్యక్తిపై దాడిని పోలీసులు ఖండిస్తారని అభిప్రాయపడ్డారు. పోలీసులు అడిగితే పట్టాభిపై దాడి వివరాలు ఇస్తానని అన్నారు. జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే వైసీపీ నేతలు, పోలీసులు చదువుతున్నారని రఘురామ ఆరోపించారు. త్వరలోనే కొందరు అధికారుల గుట్టును సాక్ష్యాధారాలతో సహా రట్టు చేస్తానని అన్నారు.
ఐఏఎస్ అధికారులు స్వతంత్రగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో గంజాయి స్మగ్లర్లను పట్టుకోలేకపోవడం వల్లే బయటి రాష్ట్రాల్లో వారిని పట్టుకుంటున్నారని అన్నారు.

కాగా, పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఆల్రెడీ పట్టాభికి హైకోర్టు బెయిల్ ఇచ్చిందని, కస్టడీకి కోరడం సరికాదని పట్టాభి తరఫు న్యాయవాది వాదించారు. అయితే, సీఎం జగన్ కు వ్యతిరేకంగా పట్టాభి చేసిన వ్యాఖ్యల వెనకున్నది ఎవరో తెలుసుకోవాల్సిన అవసరముందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు… పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

This post was last modified on October 28, 2021 10:09 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

5 hours ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

5 hours ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

5 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

7 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

7 hours ago

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

9 hours ago