మనదేశంలోని రాజకీయ నాయకుల్లో చాలామంది పలురకాల కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుండగా, మరికొందరు ఆర్థికపరమైన, అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారు. పరిమిత సంఖ్యలో కోర్టులుండడం…అపరిమిత సంఖ్యలో కేసులున్నాయి. దీంతో, పొలిటిషియన్లపై ఉన్న కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో, సదరు రాజకీయ నాయకులపై విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటోంది.
ఆ విచారణ పెండింగ్ లో ఉండగానే చాలా మంది నేతలు…ఒకటికి రెండుసార్లు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి సీఎంలుగా కొనసాగుతున్న ఉదంతాలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసుల విచారణకు సంబంధించి సుప్రీం కోర్టు గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసుల విచారణ వేగవంతం చేయాలని కింది కోర్టులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇకపై ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణను రోజువారీ జరపాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది.
నేటి నుంచి జగన్ తోపాటు అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్నవారి కేసుల విచారణను రోజువారీ జరగనుంది. ఆ కేసుల్లో దాఖలైన రిట్ పిటిషన్లపై రోజూ విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. గతంలో సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు కోరారు. ఆ పిటిషన్ తో పాటు 2012 నుంచి దాఖలైన 40 వ్యాజ్యాలు హైకోర్టు విచారణ జాబితాలో ఉన్నాయి. మరోవైపు, ఈ విచారణ మొదలుబెట్టేందుకు వారం రోజుల గడువు కావాలనిజగన్ తరఫు న్యాయవాదులు కోరారు.
అయితే, సుప్రీం ఆదేశానుసారం ప్రతి రోజు విచారణ జరుపుతామని, అందుకు సిద్ధంగా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. హెటిరో, అరబిందో కేసులతో విచారణ మొదలు పెడతామని వెల్లడించింది. అరబిందో ఫార్మా, హెటిరో ఫార్మా లిమిటెడ్లకు భూకేటాయింపుల్లో అవకతకవకలు, క్విడ్ ప్రోకో కేసులపై తొలుత విచారణ జరగనుంది. మరోవైపు, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 28, 2021 1:42 pm
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…