Political News

వివేకా మృతికి ఆ నలుగురే కారణమంటోన్న సీబీఐ

ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన రెండున్నరేళ్ల తర్వాత ఈ కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటికే ఈ కేసులలో అనుమానితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన సీబీఐ అధికారులు….తాజాగా మరో కీలక అడుగు వేశారు. వివేకా మర్డర్ కేసులో తాజాగా పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

ఈ కేసులో గంగిరెడ్డి, సునీల్‌ యాదశ్, ఉమా శంకర్‌రెడ్డి, దస్తగిరిలపై సీబీఐ అభియోగాలు మోపుతూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వివేకా మృతికి ఆ నలుగురు కారణమని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో నిందితులను ఆగస్టు, సెప్టెంబర్‌లో అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించామని ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది.

ఈ కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని కూడా ఛార్జిషీట్ లో పొందుపరిచింది. నిందితుల్లో ఇద్దరు ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండగా, మరో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది.

4 నెలలుగా ఈ కేసు విచారణ సాగుతోందని, ఈ విచారణలో సేకరించిన కీలక పత్రాలతో కూడిన నాలుగైదు బండిల్స్‌ను చార్జిషీట్‌లోని అంశాలకు ఆధారాలుగా సీబీఐ సమర్పించింది. వాస్తవానికి ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు మంగళవారమే పులివెందుల కోర్టుకు సీబీఐ అధికారులు వచ్చారు. కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలవులో ఉండడంతో దాఖలు చేయలేదు. తాజాగా నేడు కోర్టుకు వచ్చిన సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మరోవైపు, సీబీఐ ఛార్జిషీట్‌ కాపీని తనకు ఇప్పించాలని కోర్టుకు వివేకా కుమార్తె వైఎస్ సునీత విజ్ఞప్తి చేశారు.

This post was last modified on October 27, 2021 8:45 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

11 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

12 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

15 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

15 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

16 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

16 hours ago