ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన రెండున్నరేళ్ల తర్వాత ఈ కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటికే ఈ కేసులలో అనుమానితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన సీబీఐ అధికారులు….తాజాగా మరో కీలక అడుగు వేశారు. వివేకా మర్డర్ కేసులో తాజాగా పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది.
ఈ కేసులో గంగిరెడ్డి, సునీల్ యాదశ్, ఉమా శంకర్రెడ్డి, దస్తగిరిలపై సీబీఐ అభియోగాలు మోపుతూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వివేకా మృతికి ఆ నలుగురు కారణమని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో నిందితులను ఆగస్టు, సెప్టెంబర్లో అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించామని ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది.
ఈ కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని కూడా ఛార్జిషీట్ లో పొందుపరిచింది. నిందితుల్లో ఇద్దరు ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండగా, మరో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది.
4 నెలలుగా ఈ కేసు విచారణ సాగుతోందని, ఈ విచారణలో సేకరించిన కీలక పత్రాలతో కూడిన నాలుగైదు బండిల్స్ను చార్జిషీట్లోని అంశాలకు ఆధారాలుగా సీబీఐ సమర్పించింది. వాస్తవానికి ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు మంగళవారమే పులివెందుల కోర్టుకు సీబీఐ అధికారులు వచ్చారు. కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలవులో ఉండడంతో దాఖలు చేయలేదు. తాజాగా నేడు కోర్టుకు వచ్చిన సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మరోవైపు, సీబీఐ ఛార్జిషీట్ కాపీని తనకు ఇప్పించాలని కోర్టుకు వివేకా కుమార్తె వైఎస్ సునీత విజ్ఞప్తి చేశారు.
This post was last modified on October 27, 2021 8:45 pm
గత శుక్రవారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది కమెడియన్ సత్య హీరోగా పరిచయం అయిన సినిమా. అయినా సరే..…
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…