తాజాగా ఏపీలో జరిగిన ఘటనల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించిన తీరుపై నెటిజన్లు.. ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. రైట్ వేవ్లో బాబు రియాక్షన్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య జరిగిన వివాదంలో నేరుగా చంద్రబాబు జోక్యం చేసుకుని మంచి పనిచేశారని.. అంటున్నారు.
నిజానికి ఇప్పుడు కనుక ఊరుకుని ఉంటే.. టీడీపీ పై ప్రజల్లో సానుభూతి పెరిగేది కాదని అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు దీక్షకు దిగడం.. కలిసి వచ్చిన పరిణామంగా నెటిజన్లు చెబుతున్నారు. ఆయన 36 గంటల పాటు ఓపికగా దీక్ష చేసిన వైనం.. అందరినీ కదిలించిందని.. ఎవరూ ఊహించని విధంగా సభకు తమ్ముళ్లు కదిలి వచ్చారని.. చెబుతున్నారు.
చంద్రబాబు.. తన జీవితంలో తొలిసారి చేపట్టిన 36 గంటల నిరవధిక నిరసన దీక్ష పార్టీలో జోష్ పెంచిందని ఎన్నారై ల నుంచి కూడా స్పందన వస్తోంది. టీడీపీలో సరికొత్త ఒరవడి తీసుకువచ్చిందని.. నేతల మధ్య అంతరాలను తగ్గించిందని అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల తర్వాత.. టీడీపీలో నిస్తేజం ఏర్పడింది. గెలిచిన వారిలోనూ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. అంతేకాదు.. ఉన్నవారిలోనూ ఎక్కువ మంది పార్టీకి అంటీ ముట్టనట్టు ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉంటుందా? అనే చర్చ జోరుగా హల్చల్ చేసింది. ఈ సమయంలో బాబు దీక్ష ద్వారా అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని అంటున్నారు.
నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న వారు.. భారీ ఎత్తున తరలి రావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పుంజుకుందనే భావన సర్వత్రా వినిపిస్తోంది. ఇటీవలే సీవోటరు సర్వే వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే వాదన స్పష్టమైంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చేపట్టిన దీక్షకు ప్రజల నుంచి మద్దతు లభించిందని చెబుతున్నారు. ఇక, రాష్ట్రంలో జరిగిన ఘటనను ఢిల్లీ వరకు తీసుకువెళ్లడం ద్వారా.. కేంద్రం స్థాయిలో తమకు పలుకుబడి ఉందని.. తమకు ఎంతో మైలేజీ ఉందని చెబుతున్న వైసీపీకి.. గట్టి షాక్ తగిలేలా.. చేయగలిగారని.. చంద్రబాబుకు లైకులు పడుతున్నాయి. మొత్తానికి టీడీపీ చేపట్టిన ఈ ఉద్యమం.. ఎన్నారైలలో చర్చకు దారితీసింది.
This post was last modified on October 26, 2021 10:43 pm
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన శంకు స్థాపన తాలూకు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…