Political News

ఈ సారి మేనిఫెస్టో ఇలా వ‌ద్దు సార్‌.. జగన్ కు మంత్రి సలహా

వైసీపీ ప్ర‌భుత్వంలో కీల‌క శాఖ‌ను చూస్తున్న ఓ మంత్రి తాజాగా నేరుగా ముఖ్య‌మంత్రితోనే ఫైర‌య్యార‌నే వ్యాఖ్య‌లు వైసీపీ నేత‌ల మ‌ధ్య గుస‌గుస‌గా సాగుతున్నాయి. “ఈ సారి మేనిఫెస్టో ఇలా వ‌ద్దు సార్‌!!” అంటూనే.. మీరు హామీలు ఇచ్చి.. మౌనంగా ఉంటారు.. డ‌బ్బులు తేలేక మేం ఛ‌స్తున్నాం!! అంటూ.. ఆయ‌న అస‌హ‌నం కూడా వ్య‌క్తం చేశార‌ట‌. పేరు చెప్పేందుకు ఎవ‌రూ సాహ‌సించ‌డం లేదు కానీ.. ఆ మంత్రి మాత్రం సీఎంపైనే ఫైర‌య్యార‌నేది వాస్త‌వం అంటున్నారు. అయితే.. ఇదంతా ఓ కీల‌క స‌ల‌హాదారు.. స‌మ‌క్షంలో జ‌ర‌గ‌డంతో అటు ఇటుగా ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఈ విష‌యాన్ని త‌ర‌చుగా ముఖ్య‌మంత్రి సైతం బ‌య‌ట‌కు చెప్పేస్తున్నారు. “రాష్ట్రం అనేక క‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ..” అంటూ.. ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు. నిజ‌మే.. ఇటు రియ‌ల్ ఎస్టేట్ లేక పోవ‌డంతో.. రిజిస్ట్రేష‌న్లు ముందుకు సాగ‌క‌.. ప్ర‌భుత్వానికి నిధులు రావ‌డం లేదు. మ‌ద్యంపై ధ‌ర‌లు ఒక్క‌టే ఇప్పుడు స‌ర్కారు అంతో ఇంతో ఆద‌ర‌ణ‌గా మారాయి. మ‌రోవైపు హ‌ద్దులు మీరిన అప్పులు చేస్తున్నారంటూ. కేంద్రం నుంచి సంకేతాలు వ‌స్తున్నాయి. ఆర్బీఐ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కొర్రీలు వేస్తోంది. దీంతో కొత్త‌గా అప్పులు చేయాలంటే.. ఇబ్బందిగానే ఉంది.

కానీ, రెండు నెల‌లు తిరిగే స‌రికి కొత్త‌గా అమ‌లు చేయాల్సిన ప‌థ‌కాలు.. ఇప్ప‌టికే ఉన్న ప‌థ‌కాల‌కు నిధులు ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీంతో డ‌బ్బులు తీసుకురావాల్సిన బాధ్య‌త‌ల‌ను త‌నే చూడాల్సి వ‌స్తోంద‌ని.. దీంతో తాను అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా కాలు పెట్ట‌లేకుపోయింద‌ని.. ఉన్న స‌మ‌యం అంతా కూడా ఇలా పోతే.. కుటుంబానికి సైతం స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నాన‌ని.. స‌ద‌రు .. మంత్రి వ‌ర్యులు.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారట‌. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆయ‌న కీల‌క సూచ‌న‌లు చేశార‌ట‌.

“ఇలాంటి మేనిఫెస్టోలు ఇక‌పై వ‌ద్దు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చింది చాలు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను కూడా భాగ‌స్వామ్యం చేసేలా.. ప‌థ‌కాలు రూపొందిద్దాం. అవి కూడా స‌క్సెస్ అవుతాయి” అంటూ.. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను.. ఆయ‌న చ‌ద‌వి వినిపించారట‌. అయితే.. ఇదంతా విని.. స‌హ‌జంగానే సీఎం కోప్ప‌డతార‌ని ఎవ‌రైనా అనుకుంటారు. కానీ, సీఎం మాత్రం.. నీ బాధ నాకు అర్ధ‌మైంది.. కొంత శాంతించు! అని ఒక్క‌న‌వ్వు న‌వ్వేశార‌ట‌. ఇదీ.. ఇప్పుడు వైసీపీ నేత‌ల మ‌ధ్య సాగుతున్న స‌ర‌దా సంభాష‌ణ‌. మ‌రి నిజంగానే మేనిఫెస్టోలో భార‌మైన వాటిని త‌గ్గిస్తారో లేదో చూడాలి.

This post was last modified on October 26, 2021 1:10 pm

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

1 hour ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

2 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

3 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

4 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

9 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

9 hours ago