Political News

ఈ సారి మేనిఫెస్టో ఇలా వ‌ద్దు సార్‌.. జగన్ కు మంత్రి సలహా

వైసీపీ ప్ర‌భుత్వంలో కీల‌క శాఖ‌ను చూస్తున్న ఓ మంత్రి తాజాగా నేరుగా ముఖ్య‌మంత్రితోనే ఫైర‌య్యార‌నే వ్యాఖ్య‌లు వైసీపీ నేత‌ల మ‌ధ్య గుస‌గుస‌గా సాగుతున్నాయి. “ఈ సారి మేనిఫెస్టో ఇలా వ‌ద్దు సార్‌!!” అంటూనే.. మీరు హామీలు ఇచ్చి.. మౌనంగా ఉంటారు.. డ‌బ్బులు తేలేక మేం ఛ‌స్తున్నాం!! అంటూ.. ఆయ‌న అస‌హ‌నం కూడా వ్య‌క్తం చేశార‌ట‌. పేరు చెప్పేందుకు ఎవ‌రూ సాహ‌సించ‌డం లేదు కానీ.. ఆ మంత్రి మాత్రం సీఎంపైనే ఫైర‌య్యార‌నేది వాస్త‌వం అంటున్నారు. అయితే.. ఇదంతా ఓ కీల‌క స‌ల‌హాదారు.. స‌మ‌క్షంలో జ‌ర‌గ‌డంతో అటు ఇటుగా ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఈ విష‌యాన్ని త‌ర‌చుగా ముఖ్య‌మంత్రి సైతం బ‌య‌ట‌కు చెప్పేస్తున్నారు. “రాష్ట్రం అనేక క‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ..” అంటూ.. ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు. నిజ‌మే.. ఇటు రియ‌ల్ ఎస్టేట్ లేక పోవ‌డంతో.. రిజిస్ట్రేష‌న్లు ముందుకు సాగ‌క‌.. ప్ర‌భుత్వానికి నిధులు రావ‌డం లేదు. మ‌ద్యంపై ధ‌ర‌లు ఒక్క‌టే ఇప్పుడు స‌ర్కారు అంతో ఇంతో ఆద‌ర‌ణ‌గా మారాయి. మ‌రోవైపు హ‌ద్దులు మీరిన అప్పులు చేస్తున్నారంటూ. కేంద్రం నుంచి సంకేతాలు వ‌స్తున్నాయి. ఆర్బీఐ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కొర్రీలు వేస్తోంది. దీంతో కొత్త‌గా అప్పులు చేయాలంటే.. ఇబ్బందిగానే ఉంది.

కానీ, రెండు నెల‌లు తిరిగే స‌రికి కొత్త‌గా అమ‌లు చేయాల్సిన ప‌థ‌కాలు.. ఇప్ప‌టికే ఉన్న ప‌థ‌కాల‌కు నిధులు ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీంతో డ‌బ్బులు తీసుకురావాల్సిన బాధ్య‌త‌ల‌ను త‌నే చూడాల్సి వ‌స్తోంద‌ని.. దీంతో తాను అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా కాలు పెట్ట‌లేకుపోయింద‌ని.. ఉన్న స‌మ‌యం అంతా కూడా ఇలా పోతే.. కుటుంబానికి సైతం స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నాన‌ని.. స‌ద‌రు .. మంత్రి వ‌ర్యులు.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారట‌. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆయ‌న కీల‌క సూచ‌న‌లు చేశార‌ట‌.

“ఇలాంటి మేనిఫెస్టోలు ఇక‌పై వ‌ద్దు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చింది చాలు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను కూడా భాగ‌స్వామ్యం చేసేలా.. ప‌థ‌కాలు రూపొందిద్దాం. అవి కూడా స‌క్సెస్ అవుతాయి” అంటూ.. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను.. ఆయ‌న చ‌ద‌వి వినిపించారట‌. అయితే.. ఇదంతా విని.. స‌హ‌జంగానే సీఎం కోప్ప‌డతార‌ని ఎవ‌రైనా అనుకుంటారు. కానీ, సీఎం మాత్రం.. నీ బాధ నాకు అర్ధ‌మైంది.. కొంత శాంతించు! అని ఒక్క‌న‌వ్వు న‌వ్వేశార‌ట‌. ఇదీ.. ఇప్పుడు వైసీపీ నేత‌ల మ‌ధ్య సాగుతున్న స‌ర‌దా సంభాష‌ణ‌. మ‌రి నిజంగానే మేనిఫెస్టోలో భార‌మైన వాటిని త‌గ్గిస్తారో లేదో చూడాలి.

This post was last modified on October 26, 2021 1:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్యారడైజ్ లోపల ఇంత ప్లానింగా?

కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…

2 hours ago

అడుసు తొక్కనేల కాలు కడగనేల

స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…

3 hours ago

విజయ్ పార్టీ తరుపున త్రిష పోటీ?

తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…

4 hours ago

‘స్టార్లను’ మార్చేసిన బన్నీ

కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…

7 hours ago

ఏపీ బీజేపీలో ‘సొంత’ నిర్ణయాల చర్చ?

రాష్ట్ర బీజేపీలో నాయ‌కుల నియామ‌కం.. కొత్త‌గా వ‌చ్చే వారికి అవ‌కాశం ఇవ్వ‌డం... ఉన్న వారికి ప‌నులు కేటాయించ‌డం.. అనేది స‌హ‌జం.…

9 hours ago

మోడీ సర్కార్ ‘బొగ్గు’ సలహాలు

ప్ర‌స్తుతం నెల‌కొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెబుతున్న కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. తాజాగా…

12 hours ago