Political News

బీజేపీకి జనసేన షాక్ తప్పదా ?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. దీంతో కమలం పార్టీకి జనసేన షాక్ ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే నవంబర్ మొదటి వారంలో 12 మున్సిపాలిటీలతో పాటు వార్డులు, డివిజన్లలో చనిపోయిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్ లో ఆదివారం అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన జిల్లా అధ్యక్షులు, సీనియర్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై మాట్లాడిన నేతలు తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపైన కూడా చర్చించారు. తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు, చైర్మన్ స్థానాల్లో జనసేన పోటీ చేయాలని సమావేశంలో డిసైడ్ చేశారు.

ఆ మధ్య జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసింది. అయితే బీజేపీ నేతల తీరు వల్ల జనసేన ఏ విధంగా నష్టపోయిందనే విషయాన్ని నేతలు తాజా సమావేశంలో ఉదాహరణలతో సహా వివరించారు. పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత అప్పట్లోనే పవన్ మాట్లాడుతూ బీజేపీ నేతలు సరిగా పనిచేయలేదని బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని ఇపడు నేతలు ప్రస్తావిస్తూ బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు జరగబోయే నష్టాన్ని వివరించారట.

దాంతో అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి దింపాలని పవన్ ఆదేశించినట్లు జనసేన నేతలు చెబుతున్నారు. దీనిబట్టి చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుండదనేది అర్థమవుతోంది. ఒకవేళ కమలంపార్టీతో పొత్తుండకపోతే ఇక మిత్రపక్షాలు అనటంలో అర్ధమేలేదు. బహుశా రెండు పార్టీల మధ్య పొత్తు చత్తవటానికి మున్సిపల్ ఎన్నికల్లో వేదిక అవుతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పోటీ విషయంలో జనసేన క్లారిటీ తోనే ఉంది. మరి బీజేపీ అధ్యక్షుడు ఏమి ఆలోచిస్తారో చూడాలి. మొత్తానికి ఎడమొహం పెడమొహంగా ఉంటున్న మిత్రపక్షాల పొత్తుపై తొందరలోనే ఓ క్లారిటీ వచ్చేట్లే ఉంది.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

36 seconds ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

38 minutes ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

46 minutes ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

56 minutes ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago