ఏపీలో రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా మారాయన్నది తెలిసిందే. ఎవరికి వారు తమ లక్ష్మణ రేఖల్ని దాటేస్తూ.. తమకు తగ్గ వాదనను వినిపిస్తున్నారు. ఈ క్రమంలో బూతులు తిడతారా? అంటూ ఆవేదనగా ప్రశ్నిస్తూనే.. మరిన్ని బూతుల్ని ప్రయోగించటం కనిపిస్తోంది.
దీనికి వారి ప్రత్యర్థులు సైతం ఏ మాత్రం తగ్గకుండా.. తమ యథాశక్తితో మాటల్ని రువ్వుతున్నారు. ఇలాంటివేళ.. విజయవాడ ఎంపీ కమ్ సీనియర్ టీడీపీ నేత కేశినేని నాని మరింత ఘాటు వ్యాఖ్యను చేశారు.
ఇప్పటికే అధికార వైసీపీ.. విపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా.. మొన్న టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడికి సైతం పాల్పడిన వైనం చోటు చేసుకుంది. ఈ దాడికి నిరసనగా చంద్రబాబు.. నిరసన దీక్ష చేయగా.. దానికి ప్రతిగా జనాగ్రహ దీక్ష పేరుతో అధికార వైసీపీ నేతలు నిర్వహించారు. బాబు నిర్వహించిన దీక్షకు పెద్ద ఎత్తున జనం పార్టీ ఆఫీసుకు రావటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు సంఘీభావంగా కొందరు నేతలు మండిపడుతున్నారు.
తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా రియాక్టు అయిన తీరు మిగిలిన వారికికాస్త భిన్నంగా మారింది. ఇటీవల కాలంలో ఆయన టీడీపీని వదిలేసి.. బీజేపీలోకి చేరతారన్న ప్రచారం జరుగుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఆయన పార్టీ ఆఫీసుకు రావటం.. అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా వ్యవహరించి.. వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ అంటే వీరుడు.. సూరుడు అని చెప్పుకుంటారని.. ఏదైనా ఉంటే చెప్పండి.. డైరెక్టుగా ఫైట్ చేసుకుందామని సవాలు విసిరారు. ‘విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్సా? వీఎంసీ గ్రౌండ్సా ఏదో ఒకటి తేల్చేకుందాం. వైసీపీ నేతలు టైమ్.. డేట్ చెబితే మేమూ వచ్చేస్తాం. వైసీపీ ఎక్కడంటే అక్కడ మా వాళ్లు రెడీగా ఉన్నారు. కొట్టుకుందామంటే కొట్టేసకుందాం. రోజూ కొట్టుకుంటూ ఏపీకి చెడ్డపేరు తేవొద్దు. జగన్ రాక్షస పాలన ప్రపంచమంతా చెప్పుకుంటోంది’ అంటూ నిప్పులు చెరిగారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా శాంతిభద్రతల సమస్య వచ్చిందా? అని ప్రశ్నించిన ఆయన.. 2019లో జగన్ కు ప్రజలు గొప్ప అవకాశాన్ని ఇస్తే.. దాన్ని చెడగొట్టుకుంటున్నారన్నారు. ఏం చేసినా ప్రజలు ఒప్పుకుంటారని భావిస్తే అది చెల్లుబాటుకాదని.. సరైన సమయంలో ఓటర్లు తగిన సమయంలో మూల్యం చెల్లిస్తారని వార్నింగ్ ఇచ్చారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…