Political News

మంత్రి హ‌రీష్‌రావుకు షాక్‌..

తెలంగాణ మంత్రి, సాక్షాత్తూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు.. హ‌రీష్‌రావుకు.. భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఉప ఎన్నికకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బలమూరి వెంకట్‌ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 42 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. ఈ నెల 13తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

అయితే.. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కితీరాల‌నే క‌సితో ప‌నిచేస్తున్నారు మంత్రి హ‌రీష్ రావు. ఎందుకంటే.. ఇప్ప‌టికే జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నిక‌లో సీఎం కేసీఆర్ అప్ప‌గించిన బాధ్య‌త విష‌యంలో ఆయ‌న గాడి త‌ప్పారు. అక్క‌డ బీజేపీ గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో హ‌రీష్‌కు మార్కులు త‌గ్గాయ‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఇప్పుడు హుజూరాబాద్‌ను ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అంతేకాదు.. ఇక్క‌డ గెలిచి.. తాను ఐర‌న్ లెగ్ కాద‌నే ప్ర‌చారం చేసుకునేందుకు ఆయ‌న రెడీగా ఉన్నారు. ఇక‌, ఇక్క‌డ గెలుపు అనేది అధికార పార్టీకి ప్రాణ‌ప్ర‌దంగా మారింది. మ‌రోవైపు.. బీజేపీ నేత‌, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కూడా భారీ స్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు. అందివ‌చ్చిన అన్ని అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో హ‌రీష్ వ‌ర్సెస్ ఈట‌ల అన్న‌ట్టుగా పోటీ మారిపోయింది. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు.. ప‌థ‌కాలు వంటివాటిపై హ‌రీష్‌.. కొన్నాళ్లుగా ఫోక‌స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రోజు మొత్తంలో ఎక్కువ సేపు హుజూరాబాద్‌లోనే ఉంటున్నారు. అడుగ‌డుగునా స‌భ‌లు నిర్వ‌హిస్తున్నారు. భారీ సంఖ్య‌లో జ‌నాల‌ను పోగేసే బాధ్య‌త‌ల‌ను కార్య‌క‌ర్త‌ల‌కు, కీల‌క నేత‌ల‌కు అప్పగించారు. అయితే.. తాజాగా సోమ‌వారం ఇక్క‌డ నిర్వ‌హించిన ప్రచార సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఉపఎన్నికల నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఎన్నికల సభలో మాట్లాడారు. అయితే ఈ సభలో ముందు వరుసలో మాత్రమే జనాలు ఉన్నారు. వెనుక వరుసలో జనాలు లేక ఖాళీ కుర్చీలు కనిపించాయి. ఎన్నిక‌ల‌కు మ‌రో 18 రోజులే ఉండ‌డం.. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి ఎదురు కావ‌డం..హ‌రీ ష్ వ‌ర్గంలో గుబులు రేపుతోంది. కాగా. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ‌రి దీనిని ఎలా చూస్తారో చూడాలి.

This post was last modified on October 11, 2021 8:22 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

6 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

7 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

10 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

10 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

11 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

11 hours ago