ఏపీలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న వార్తలు అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. మంత్రి పదవి రేసులో ఉన్న ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఎవరికి వారు తమ తమ రూట్లలో ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మొత్తం 100 శాతం మంత్రి వర్గాన్ని మార్చేస్తారని.. తాను కూడా మంత్రి వర్గంలో ఉండనని చెప్పారు. దీంతో చాలా మంది నేతల్లో కొత్త ఆశలు కలుగుతున్నాయి.
ఇక పలువురు నేతలు ఇప్పుడిప్పుడే మనసులో మంత్రి పదవిపై ఉన్న మక్కువతో ఓపెన్ అవుతున్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే తాను మంత్రి పదవి రేసులో ఉంటే కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీ సీనియర్ నేత, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ ప్రక్షాళన గురించి ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ గతంలోనే తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
అయితే బీసీ జిల్లా కావడంతో మంత్రి పదవి తనకు రాలేదని.. జగన్ మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇక త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన నేపథ్యంలో సీఎం జగన్ను కలవాలని తన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని.. అయితే మంత్రి వర్గ విస్తరణ జరిగే వరకు తాను ఎవ్వరిని కలవనని కూడా కోలగట్ల చెప్పారు. ఇక తన వయస్సు రీత్యా జగన్ మరోసారి టిక్కెట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.
ఇక వైశ్య వర్గం కోటాలో ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు. ప్రక్షాళనలో ఆయన్ను తప్పిస్తారనే అంటున్నారు. వెల్లంపల్లిని తప్పిస్తే వైశ్య కోటాలో కోలగట్లతో పాటు ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు.
This post was last modified on October 5, 2021 10:19 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…