Political News

తెలంగాణలో ప‌ద్మశ్రీకి అర్హులు లేరా?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల దూకుడు త‌గ్గించారు. గ‌త నెల‌లో ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత‌.. కేంద్రంపైనా.. బీజేపీపైనా.. జాతీయ స్థాయిలో విమ‌ర్వ‌ల‌కు దూరంగా ఉన్నారు. అయితే.. తాజాగా ఆయ‌న త‌న పాత ధోర‌ణిలో కేంద్రంపై విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ప‌ట్ల కేంద్రం నిర్ల‌క్ష్య వైఖరి అనుస‌రిస్తోంద‌ని నిప్పులు చెరిగారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. టూరిజంతో పాటు పలు విష‌యాల్లో కేంద్రం తెలంగాణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని విమర్శించారు. పద్మశ్రీ అవార్డుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

తెలంగాణ‌లో క‌ళాకారులు, విశిష్ఠ వ్యక్తులు ఎంతో మంది ఉన్నారని.. అయినా.. కేంద్రం ఎవ‌రికీ ఈ అవార్డులు ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “తెలంగాణలో ప‌ద్మశ్రీకి అర్హులు లేరా?.. పద్మశ్రీ అవార్డు కోసం జాబితా పంపాలా? వ‌ద్దా?” అని ప్రధాని మోడీ, అమిత్‌షాను కలిసి విజ్ఞప్తి చేశానని చెప్పారు. అంతేకాదు.. తెలంగాణ చాలా చ‌రిత్ర, సంప్ర‌దాయాలు.. గొప్ప క‌ళ‌ల‌తో కూడుకున్న ప్రాంతమని సీఎం కేసీఆర్ అన్నారు. 58 సంవ‌త్స‌రాలు స‌మైక్యాంధ్ర ప్ర‌దేశ్‌లో తెలంగాణ‌ను ప‌ట్టించుకోలేదని విమర్శించారు. అద్భుత‌మైన జ‌ల‌పాతాలు తెలంగాణ‌లో ఉన్నాయన్నారు. ఖ‌మ్మంలో పాండ‌వుల గుట్ట‌ను ప‌ట్టించుకోలేదని విమ‌ర్శించారు.

చారిత్రాక ఉజ్వ‌ల‌మైన అవ‌శేషాలు ఉన్న తెలంగాణ ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రితో ఉందని కేసీఆర్ దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ‌లోని ప్ర‌కృతి సౌంద‌ర్యాల‌ను ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ కాపాడుకుంటామని చెప్పారు. అన్ని జిల్లాల‌కు సంబంధించిన ఎమ్మెల్యేల‌తో ఓ క‌మిటీని ఏర్పాటు చేస్తామన్నారు. చారిత్రాక‌ ప్ర‌దేశాలు, కోట‌లు, ద‌ర్శ‌నీయ స్థ‌లాలు, విశిష్ట‌మైన దేవాయాల ప్రాచుర్యాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే.. చాలా రోజుల త‌ర్వాత‌.. కేంద్రంపై కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. తెలంగాణ సంస్కృతి.. సంప్ర‌దాయాలు అంటూ.. తొలిసారి అసెంబ్లీలో ఆయ‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

వాస్త‌వానికి 2021-22 కు సంబంధించిన ప‌ద్మ అవార్డుల కోసం.. కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పుడో ఆన్‌లైన్ పోర్ట‌ల్‌ను ప్రారంభించింది. ఇది సెప్టెంబ‌రు 15తో గ‌డువు తీరిపోయింది. ప్ర‌త్య‌కంగా ప్ర‌భుత్వాల నుంచి ఎలాంటి సిఫార‌సుల‌ను తీసుకోబోమ‌ని.. అంద‌రూ పోర్ట‌ల్‌లోనే న‌మోదు చేయాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. కానీ, కేసీఆర్ వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి. మ‌రి దీనిపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

6 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

6 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

7 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

8 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

8 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

8 hours ago