Political News

గోదావ‌రి సాక్షిగా జ‌న‌సేనానికి జ‌నం పోటెత్తారు..!


ఏపీలో రోడ్ల దారుణ‌స్థితి నిరసిస్తూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు రెండు జిల్లాల్లో రోడ్ల‌పై శ్ర‌మదానం చేసేందుకు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఈ రోజు ఉద‌యం రాజ‌మండ్రి స‌మీపంలోని మ‌ధుర‌పూడి విమానాశ్ర‌యం చేరుకున్నారు. ఎన్ని అడ్డంకులు వ‌స్తున్నా కూడా ప‌వ‌న్ మాత్రం ప‌ట్టు విడ‌వ‌కుండా రాజ‌మండ్రిలో ఎంట్రీ ఇచ్చారు. ప‌వ‌న్‌కు అభిమానులు, జ‌న‌సేన సైనికులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. విమానాశ్ర‌యం నుంచి ప‌వ‌న్ స‌భ నిర్వ‌హించే బాలాజీపేట వ‌ర‌కు దారి పొడ‌వునా ప‌వ‌న్ అభిమానులు భారులు తీరి మ‌రి ఆయ‌న‌కు అభివాదం చేశారు. ముందుగా ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్‌పై శ్ర‌మదానం చేయాల‌ని అనుకున్నా జ‌ల‌వ‌న‌రుల శాఖ నుంచి అక్కడ శ్ర‌మ‌దానం చేసేందుకు అనుమ‌తులు రాక‌పోవ‌డంతో చివ‌ర‌కు న‌గ‌రంలోని హుకుంపేట రోడ్డుకు ప్రోగ్రామ్‌ను మార్చ‌రు.

న‌గ‌రంలోని బాలాజీపేట‌లో ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేయ‌డంతో ఆ ప్రాంతానికి భారీ ఎత్తున ప‌వ‌న్ అభిమానులు చేరుకుంటున్నారు. భారీగా ట్రాఫిక్ స్తంభించ‌డంతో పోలీసులు రంగంలోకి దిగి ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మ‌రీ ప‌వ‌న్ అభిమానుల‌ను అదుపులోకి తీసుకుంటున్నారు. ప‌వ‌న్ స‌భ‌కు ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచే కాకుండా.. అటు వైజాగ్ నుంచి భారీ స్థాయిలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు త‌ర‌లి వ‌స్తున్నారు. జ‌న‌సేనాని ఎంట్రీతో గోదావ‌రి తీరం జ‌నంతో పోటెత్తింది. అయితే వీరిని ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై జ‌న‌సేన పార్టీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

బాలాజీపేట‌కు ఇరువైపులా 5 కిలోమీట‌ర్ల మేర విప‌రీత‌మైన ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ప‌వ‌న్ రిప‌బ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్లో ప్ర‌భుత్వాన్ని, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు చేశాక‌.. బ‌య‌ట‌కు వస్తోన్న ప్రోగ్రామ్ కావ‌డంతో ఇప్పుడు ఇక్క‌డ హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. రాజ‌మండ్రి న‌గ‌రంలోనే కాకుండా… జిల్లా అంత‌టా తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ముఖ్యంగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో వారిలో మ‌రింత ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. మరో వైపు జిల్లా ఏఎస్సీ ల‌లిత కుమారి మాత్రం తాము ఎలాంటి ఆంక్ష‌లు పెట్ట‌డం లేద‌ని… ప‌వ‌న్‌కు స‌భ‌కు వ‌చ్చిన ఇబ్బందేమి లేద‌ని చెప్ప‌డం కొస‌మెరుపు.

This post was last modified on October 2, 2021 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago