ఏపీలో రోడ్ల దారుణస్థితి నిరసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు రెండు జిల్లాల్లో రోడ్లపై శ్రమదానం చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు ఉదయం రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. ఎన్ని అడ్డంకులు వస్తున్నా కూడా పవన్ మాత్రం పట్టు విడవకుండా రాజమండ్రిలో ఎంట్రీ ఇచ్చారు. పవన్కు అభిమానులు, జనసేన సైనికులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి పవన్ సభ నిర్వహించే బాలాజీపేట వరకు దారి పొడవునా పవన్ అభిమానులు భారులు తీరి మరి ఆయనకు అభివాదం చేశారు. ముందుగా ధవళేశ్వరం బ్యారేజ్పై శ్రమదానం చేయాలని అనుకున్నా జలవనరుల శాఖ నుంచి అక్కడ శ్రమదానం చేసేందుకు అనుమతులు రాకపోవడంతో చివరకు నగరంలోని హుకుంపేట రోడ్డుకు ప్రోగ్రామ్ను మార్చరు.
నగరంలోని బాలాజీపేటలో పవన్ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతానికి భారీ ఎత్తున పవన్ అభిమానులు చేరుకుంటున్నారు. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ పవన్ అభిమానులను అదుపులోకి తీసుకుంటున్నారు. పవన్ సభకు ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా.. అటు వైజాగ్ నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు తరలి వస్తున్నారు. జనసేనాని ఎంట్రీతో గోదావరి తీరం జనంతో పోటెత్తింది. అయితే వీరిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బాలాజీపేటకు ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర విపరీతమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పవన్ రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్లో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశాక.. బయటకు వస్తోన్న ప్రోగ్రామ్ కావడంతో ఇప్పుడు ఇక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజమండ్రి నగరంలోనే కాకుండా… జిల్లా అంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారిలో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మరో వైపు జిల్లా ఏఎస్సీ లలిత కుమారి మాత్రం తాము ఎలాంటి ఆంక్షలు పెట్టడం లేదని… పవన్కు సభకు వచ్చిన ఇబ్బందేమి లేదని చెప్పడం కొసమెరుపు.
This post was last modified on October 2, 2021 4:08 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…