Political News

పార్టీలను వణికిస్తున్న ఎంఐఎం

తొందరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం మిగిలిన పార్టీలను వణికించేస్తోంది. ముస్లిం ఓట్లను దక్కించుకోవటమే టార్గెట్ గా ఎన్నికల్లో పోటీచేయబోతున్న ఎంఐఎం వల్ల ఏ పార్టీకి దెబ్బపడుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ప్రతి పార్టీ కూడా ఎంఐఎం వల్ల తమకేమీ నష్టం జరగదని చెప్పుకుంటోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే యూపీలో చాలా కులాలకు ప్రత్యేకించి పార్టీలున్నాయి, గట్టి నేతలూ ఉన్నారు.

కానీ ముస్లింలకు మాత్రం ఏకీకృతపార్టీకానీ లేదా అందరినీ కలుపుకుని పోగలగిన గట్టినేత కానీ ఇప్పటివరకు లేరు. ఆ లోటును తమ పార్టీ భర్తీ చేస్తుందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గట్టిగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో ఎంఐఎం తరపున 100 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు పోటీచేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. యూపీలో కులాల వారీగా చూస్తే జాతవ్, యాదవ్, రాజ్ బర్, నిషాద్ సామాజికవర్గాలకు ప్రత్యేకించి పార్టీలున్నాయి. అలాగే వాటికి గట్టి నేతలూ ఉన్నారు.

కానీ రాష్ట్ర జనాభాలో 19 శాతం ఉన్న ముస్లింలకు మాత్రం ప్రత్యేకంగా పార్టీ లేదు, గట్టి నేతాలేరు. ఈ విషయం మీద అసద్ బాగా ఆలోచించినట్లున్నారు. అందుకనే క్షేత్రస్ధాయిలో సర్వే చేయించుకుని యూపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ ఎంతో ప్రతిష్టగా తీసుకున్న అయోధ్య నుండే యూపీలో పాదయాత్రను అసద్ మొదలుపెట్టారు. మార్గమద్యంలో వచ్చే నియోజకవర్గాల్లో ముస్లిం సమాజంలోని పెద్దలు, కీలక వ్యక్తులు, ఇత పార్టీల్లోని నేతలు, మామూల జనాలను కలుస్తున్నారు.

ముస్లింలకు ప్రత్యేకంగా పార్టీ అవసరాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ అవసరాన్ని ఎంఐఎం తీరుస్తుందని భరోసా ఇస్తున్నారు. ఎంఐఎం పోటీచేయబోయే 100 నియోజకవర్గాల్లో కనీసం 80 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లే ఎక్కువ. ముస్లిం ఓట్లలో ఎక్కువ ఎవరికి పడితే వారిదే గెలుపు. అందుకనే తాను టార్గెట్ చేసిన 100 నియోజకవర్గాలపైనే అసద్ ఎక్కువగా దృష్టిపెట్టారు. అసద్ సమావేశాలకు ముస్లిం కమ్యూనిటి సానుకూలంగా స్పందిస్తోంది. ఈ కారణం వల్లే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ బాగా ఇబ్బందులు పడుతున్నాయి.

ఎందుకంటే ముస్లింలు సంప్రదాయకంగా పై మూడుపార్టీలకు ఓట్లేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో మాత్రం బీజేపీకి కూడా చాలా చోట్ల ముస్లింలు మద్దతు ఇచ్చారు. మెజారిటి ముస్లింలు ఓట్లేసిన కారణంగానే వాళ్ళ సామాజికవర్గం ఎక్కువున్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలిచింది. అయితే బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఎక్కడా ముస్లింలకు టికెట్లివ్వలేదు.

దాంతో రాబోయే ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వాలా ? అవసరంలేదా అనే విషయాన్ని బీజేపీ తేల్చుకోలేకపోతోంది. అలాగే ముస్లింలు తమకు మద్దతుగా నిలబడతాయా లేదా అనేది పై మూడు పార్టీలను గందరగోళంలో పడేశాయి. మొత్తానికి ఎంఐఎం అన్నీపార్టీలను వణికించేస్తున్నది మాత్రం వాస్తవం.

This post was last modified on October 1, 2021 12:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

1 hour ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

2 hours ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

2 hours ago

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.…

2 hours ago

రేసు గుర్రం కొంచెం తొందరపడిందేమో

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళ – తెలంగాణ మధ్య నిప్పు రాజుకుంది

కేర‌ళ రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…

4 hours ago