రాష్ట్రంలో మొత్తం మంత్రి వర్గం మారిపోతుందా? ముఖ్యమంత్రి జగన్ అందరినీ పక్కన పెట్టేస్తారా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మంత్రి వర్గ మార్పుపై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈయన చెప్పిన విషయాన్ని ఆషామాషీగా తీసిపారేసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే.. జగన్కు బంధువు, మంత్రివర్గంలో కీలక నాయకుడు కాబట్టి.
సో.. విషయంలోకి వెళ్తే.. ఏపీ సీఎం జగన్.. తన మంత్రి వర్గ మార్పుపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవానికి 2019లో ప్రబుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో ముఖ్యమంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేటప్పుడే.. తన మంత్రివర్గాన్ని రెండున్నరేళ్లో 90 శాతం మారుస్తానని చెప్పారు.
అయితే.. దీనిపై ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే.. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితిలో నెట్టుకు రావాలంటే.. పాత మంత్రులు ఉండాల్సిందేనని అందరూ భావిస్తున్నారు. పైగా మంత్రులకు జగన్ పెట్టిన స్థానిక ఎన్నికల టార్గెట్ను కూడా వారు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో మంత్రి వర్గంలో పెద్దగా మార్పులు ఉండవని అనుకున్నారు. ఒకవేళ ఉన్నా.. సీనియర్లు.. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్.. ధర్మాన కృష్ణదాస్.. బొత్స సత్యనారాయణ వంటివారు ఖచ్చితంగా ఉంటారని అనుకున్నారు. అయితే.. ఎవరి పట్ల జగన్ పక్షపాతం చూపించే పరిస్థితి లేదని తాజాగా బాలినేని వ్యాఖ్యలతో స్పష్టమైంది.
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారీ మార్పులుంటాయని చెప్పారు. మంత్రివర్గంలో వంద శాతం కొత్తవారినే తీసుకుంటామని సీఎం చెప్పారని వెల్లడించారు. తనను కూడా తీసేస్తానని చెప్పినట్టు తెలిపారు. అయితే.. తాను విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పినట్లు మంత్రి తెలిపారు. మంత్రివర్గాన్ని వంద శాతం మారుస్తానని సీఎం గతంలోనే చెప్పారన్నారు.
మంత్రివర్గాన్ని వంద శాతం మారిస్తే మంచిదే అని సీఎంకు చెప్పానన్న ఆయన.. తనను కూడా మార్చాలని చెప్పానని తెలిపారు. మంత్రి పదవి పోయినా తాను భయపడనని స్పష్టం చేశారు. తనకు పార్టీయే ముఖ్యమని.. పదవులు కాదని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇప్పటికి జగన్ మంత్రి వర్గంపై ఫుల్లు క్లారిటీ వచ్చిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 26, 2021 2:09 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…