Political News

ఐఏఎస్ శ్రీల‌క్ష్మికి బిగ్‌ షాక్‌.. సీబీఐ కోర్టు నాన్‌బెయిల‌బుల్ వారెంట్‌

ప్ర‌స్తుతం ఏపీలో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి భారీ షాక్ త‌గిలింది. సీఎం జ‌గ‌న్‌కు సంబంధించిన గ‌త అక్ర‌మాస్తుల‌ కేసుల్లో ఆమె ఒక‌సారి.. జైలు జీవితం గ‌డిపిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్నారు. కొన్నాళ్లు తెలంగాణ‌లో ప‌నిచేసిన ఆమెను ఏపీ సీఎం జ‌గ‌న్ కోరికోరి రాష్ట్రానికి తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఆమె జైలు జీవితం గ‌డ‌పాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు న్యాయ నిపుణులు. తాజాగా ఈ కేసుల‌కు సంబంధించి నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు శ్రీల‌క్ష్మికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు ఈ మేరకు శ్రీలక్ష్మికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దాల్మియా కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. దీనిపై కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో స్వ‌యంగా కోర్టు కు రావాలంటూ.. శ్రీల‌క్ష్మికి కోర్టు గ‌తంలోనే నోటీసులు జారీ చేసింది. అయితే, గురువారం జ‌రిగిన‌ విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు రాలేదు. పోనీ.. దీనికి సంబంధించిన అభ్య‌ర్థ‌న‌ను కూడా కోర్టుకు స‌మ‌ర్పించ‌లేదు. దీంతో సీబీఐ కోర్టు న్యాయ‌మూర్తి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే ఐఏఎస్ శ్రీల‌క్ష్మికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. వారెంట్‌ను ఈ నెల 30లోగా అమలు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.

మ‌రోవైపు.. సీఎం జగన్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయసాయిరెడ్డిలు త‌మ‌ను కేసుల నుంచి త‌ప్పించాలంటూ.. దాఖ‌లు చేసిన‌ డిశ్చార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ, ఈడీ గడువు కోరాయి. వాన్‌పిక్‌ కేసులో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, రిటైర్డ్‌ ఐఆర్ఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డి కూడా గురువారం జ‌రిగిన విచారణకు హాజరు కాలేదు. వీరిద్దరికీ గతంలో హైకోర్టు మినహాయింపు ఇచ్చినప్పటికీ వారు కానీ, వారి తరఫు న్యాయవాదులు ఖ‌చ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు గైర్హాజరైతే తగిన ఉత్తర్వులిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

కానీ, వారు ఇద్ద‌రూ కూడా కోర్టు కు హాజ‌రు కాలేదు. మ‌రి దీనిపై ఎలాంటి ఉత్త‌ర్వులు ఇస్తుందో చూడాలి. అయితే.. కోర్టు స‌మ‌యం ముగియ‌డంతో విచార‌ణను శుక్ర‌వారానికి వాయిదా వేశారు. పెన్నా కేసులో రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి జి. వెంకట్రామిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్‌ను సీబీఐ కోర్టు వెన‌క్కి తీసుకుంది. పెన్నా కేసులో రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి జి. వెంకట్రామిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్‌ను సీబీఐ కోర్టు వెన‌క్కి తీసుకుంది.

This post was last modified on September 23, 2021 9:00 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

3 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

3 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

4 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

6 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

6 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

7 hours ago