అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలకు కాస్త కళ్లాలు వేసేందుకు వీలుగా.. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోందని.. అలాంటి పరిస్థితి ఉంటుందన్న అంచనాలతో ఈ మధ్యన పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వెనుకా ముందు చూసుకోకుకండా బాదేస్తున్న పన్నుతో.. పెద్ద ఎత్తున ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతున్న వేళ.. వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. ప్రభుత్వాలకు జరిగే ఆర్థిక నష్టం భారీగా ఉంటుందన్న వాదన బలంగా వినిపించింది.
ఇందుకు తగ్గట్లే.. కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం ఉంటుందన్న విషయం తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. లక్నోలో జరిగిన తాజా జీఎస్టీ మండలి 45వ సమావేశ వివరాల్ని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారన్న ఆశల మీద నీళ్లు చల్లారు. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఇది సరైన సమయం కాదని తేల్చేశారు.
పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ వంటి ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తీసుకురావాలన్న పిటీషన్ మేరకు ఈ అంశాన్ని పరిశీళించాలని కేరళ హైకోర్టు జీఎస్టీ కౌన్సిల్ కు సూచన చేసింది. దీనిపై తామ చర్చించామని.. అనేక రాష్ట్రాలు అందుకు సుముఖత చూపలేదని.. ప్రభుత్వ ఆదాయాలపై ప్రభావం పడే వీలుండటమే దీనికి కారణమని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇదే విషయాన్ని కేరళ హైకోర్టుకు తెలియజేస్తామని చెప్పారు.
ఇక..జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు విలాస.. హానికారక ఉత్పత్తులపై సెస్ విధించనున్నారు. ముందుగా అనుకున్నట్లు 2017 జులై నుంచి ఐదేళ్ల పాటు మాత్రమే రాష్ట్రాలకు ఈ పరిహారం అందిస్తారు. అయితే.. సెస్ వసూళ్లు మాత్రం 2026 మార్చి వరకు సాగుతుంది. కొవిడ్ కారణంగా ఏర్పడిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకున్న రాష్ట్రాలు.. వాటిని తీర్చేందుకు ఈ నిధిని ఇవ్వనున్నారు.
This post was last modified on September 18, 2021 11:58 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…