Political News

పెట్రోలుపై జీఎస్టీ… ఆశ దోశ అప్పడం

అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలకు కాస్త కళ్లాలు వేసేందుకు వీలుగా.. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోందని.. అలాంటి పరిస్థితి ఉంటుందన్న అంచనాలతో ఈ మధ్యన పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వెనుకా ముందు చూసుకోకుకండా బాదేస్తున్న పన్నుతో.. పెద్ద ఎత్తున ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతున్న వేళ.. వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. ప్రభుత్వాలకు జరిగే ఆర్థిక నష్టం భారీగా ఉంటుందన్న వాదన బలంగా వినిపించింది.

ఇందుకు తగ్గట్లే.. కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం ఉంటుందన్న విషయం తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. లక్నోలో జరిగిన తాజా జీఎస్టీ మండలి 45వ సమావేశ వివరాల్ని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారన్న ఆశల మీద నీళ్లు చల్లారు. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఇది సరైన సమయం కాదని తేల్చేశారు.

పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ వంటి ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తీసుకురావాలన్న పిటీషన్ మేరకు ఈ అంశాన్ని పరిశీళించాలని కేరళ హైకోర్టు జీఎస్టీ కౌన్సిల్ కు సూచన చేసింది. దీనిపై తామ చర్చించామని.. అనేక రాష్ట్రాలు అందుకు సుముఖత చూపలేదని.. ప్రభుత్వ ఆదాయాలపై ప్రభావం పడే వీలుండటమే దీనికి కారణమని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇదే విషయాన్ని కేరళ హైకోర్టుకు తెలియజేస్తామని చెప్పారు.

ఇక..జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు విలాస.. హానికారక ఉత్పత్తులపై సెస్ విధించనున్నారు. ముందుగా అనుకున్నట్లు 2017 జులై నుంచి ఐదేళ్ల పాటు మాత్రమే రాష్ట్రాలకు ఈ పరిహారం అందిస్తారు. అయితే.. సెస్ వసూళ్లు మాత్రం 2026 మార్చి వరకు సాగుతుంది. కొవిడ్ కారణంగా ఏర్పడిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకున్న రాష్ట్రాలు.. వాటిని తీర్చేందుకు ఈ నిధిని ఇవ్వనున్నారు.

This post was last modified on September 18, 2021 11:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

41 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago