అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలకు కాస్త కళ్లాలు వేసేందుకు వీలుగా.. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోందని.. అలాంటి పరిస్థితి ఉంటుందన్న అంచనాలతో ఈ మధ్యన పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వెనుకా ముందు చూసుకోకుకండా బాదేస్తున్న పన్నుతో.. పెద్ద ఎత్తున ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతున్న వేళ.. వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. ప్రభుత్వాలకు జరిగే ఆర్థిక నష్టం భారీగా ఉంటుందన్న వాదన బలంగా వినిపించింది.
ఇందుకు తగ్గట్లే.. కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం ఉంటుందన్న విషయం తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. లక్నోలో జరిగిన తాజా జీఎస్టీ మండలి 45వ సమావేశ వివరాల్ని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారన్న ఆశల మీద నీళ్లు చల్లారు. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఇది సరైన సమయం కాదని తేల్చేశారు.
పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ వంటి ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తీసుకురావాలన్న పిటీషన్ మేరకు ఈ అంశాన్ని పరిశీళించాలని కేరళ హైకోర్టు జీఎస్టీ కౌన్సిల్ కు సూచన చేసింది. దీనిపై తామ చర్చించామని.. అనేక రాష్ట్రాలు అందుకు సుముఖత చూపలేదని.. ప్రభుత్వ ఆదాయాలపై ప్రభావం పడే వీలుండటమే దీనికి కారణమని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇదే విషయాన్ని కేరళ హైకోర్టుకు తెలియజేస్తామని చెప్పారు.
ఇక..జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు విలాస.. హానికారక ఉత్పత్తులపై సెస్ విధించనున్నారు. ముందుగా అనుకున్నట్లు 2017 జులై నుంచి ఐదేళ్ల పాటు మాత్రమే రాష్ట్రాలకు ఈ పరిహారం అందిస్తారు. అయితే.. సెస్ వసూళ్లు మాత్రం 2026 మార్చి వరకు సాగుతుంది. కొవిడ్ కారణంగా ఏర్పడిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకున్న రాష్ట్రాలు.. వాటిని తీర్చేందుకు ఈ నిధిని ఇవ్వనున్నారు.
This post was last modified on September 18, 2021 11:58 am
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…