అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలకు కాస్త కళ్లాలు వేసేందుకు వీలుగా.. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోందని.. అలాంటి పరిస్థితి ఉంటుందన్న అంచనాలతో ఈ మధ్యన పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వెనుకా ముందు చూసుకోకుకండా బాదేస్తున్న పన్నుతో.. పెద్ద ఎత్తున ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతున్న వేళ.. వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. ప్రభుత్వాలకు జరిగే ఆర్థిక నష్టం భారీగా ఉంటుందన్న వాదన బలంగా వినిపించింది.
ఇందుకు తగ్గట్లే.. కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం ఉంటుందన్న విషయం తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. లక్నోలో జరిగిన తాజా జీఎస్టీ మండలి 45వ సమావేశ వివరాల్ని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారన్న ఆశల మీద నీళ్లు చల్లారు. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఇది సరైన సమయం కాదని తేల్చేశారు.
పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ వంటి ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తీసుకురావాలన్న పిటీషన్ మేరకు ఈ అంశాన్ని పరిశీళించాలని కేరళ హైకోర్టు జీఎస్టీ కౌన్సిల్ కు సూచన చేసింది. దీనిపై తామ చర్చించామని.. అనేక రాష్ట్రాలు అందుకు సుముఖత చూపలేదని.. ప్రభుత్వ ఆదాయాలపై ప్రభావం పడే వీలుండటమే దీనికి కారణమని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇదే విషయాన్ని కేరళ హైకోర్టుకు తెలియజేస్తామని చెప్పారు.
ఇక..జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు విలాస.. హానికారక ఉత్పత్తులపై సెస్ విధించనున్నారు. ముందుగా అనుకున్నట్లు 2017 జులై నుంచి ఐదేళ్ల పాటు మాత్రమే రాష్ట్రాలకు ఈ పరిహారం అందిస్తారు. అయితే.. సెస్ వసూళ్లు మాత్రం 2026 మార్చి వరకు సాగుతుంది. కొవిడ్ కారణంగా ఏర్పడిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకున్న రాష్ట్రాలు.. వాటిని తీర్చేందుకు ఈ నిధిని ఇవ్వనున్నారు.
కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…
నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…
పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…
పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…