Political News

అమిత్ షా గురి తప్పిందా ?

నిర్మల్ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలు వింటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు అమిత్ నిర్మల్ బహిరంగ సభలో ఎందుకు పాల్గొన్నారు ? ఎవరిని టార్గెట్ చేయడానికి వచ్చారు ? ఎవరిని టార్గెట్ చేశారు ? అనేది జనాలకు అర్థం కావట్లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అని ఒకటికి పదిసార్లు గట్టి గట్టిగా అరిచి ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి ఆలయం సాక్షిగా కమలనాథులు చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే.

కానీ నిర్మల్ సభలో మాట్లాడిన షా మాత్రం కేసీయార్ ను టార్గెట్ చేయకుండా ఎక్కువగా మజ్లిస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ ను వదిలిపెట్టి ఎంఐఎంను టార్గెట్ చేస్తే బీజేపీకి వచ్చే లాభం ఏమిటో అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్నది కేసీయారే కానీ మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీ అయితే కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఓల్డ్ సిటీ లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు+ఒక ఎంపీ సీటులో మాత్రమే గెలిచిన మజ్లిస్ ను టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏమయి ఉంటుంది ?

ఒకవైపు బీజేపీ చీఫ్ బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డైరెక్టుగా కేసీయార్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళద్దరి టార్గెట్ లో మజ్లిస్ ను కానీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని కాని పెద్దగా పట్టించుకోవటంలేదు. కారణం ఏమిటంటే పైన చెప్పుకున్నట్లుగా ఎంఐఎంను టార్గెట్ చేయటం ద్వారా తమ ఎనర్జీని వేస్టు చేసుకోవడం ఇష్టం లేన్నట్లుంది. అలాంటిది స్దానిక నేతలకున్న పరిజ్ఞానం కూడా అమిత్ షా కు ఉన్నట్లు లేదు. లేదా వ్యూహాత్మకంగా కేసీయార్ ను వదిలిపెట్టేశారా అన్నది అర్థం కావడం లేదు.

ఇక్కడ స్పష్టంగా అర్ధమవుతున్న విషయం ఏమిటంటే కేసీయార్ ను మాత్రం హోంశాఖ మంత్రి టార్గెట్ చేయటానికి ఇష్టపడలేదని. ఈమధ్యనే వారం రోజులపాటు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన కేసీయార్ వరుసబెట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా తో పాటు చాలామంది కేంద్రమంత్రులను కలిసొచ్చారు. అమిత్ తో రెండు మూడు సార్లు కలిసారు. దీనిబట్టి మోడీ, అమిత్ తో కేసీయార్ కు మంచి సంబంధాలున్నట్లు అర్ధమైపోతోంది.

అందుకనే టార్గెట్ చేయాల్సిన కేసీయార్ ను వదిలిపెట్టి సంబంధంలేని మజ్లిస్ ను టార్గెట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో అన్నీ పార్లమెంటు స్ధానాల్లో గెలుస్తామని చెప్పిన అమిత్ అసెంబ్లీ సీట్ల విషయం మాత్రం మాట్లాడలేదు. అసెంబ్లీ సీట్లలో గెలిస్తేనే లోక సభ సీట్లలో విజయం సాధ్యమని తెలిసి కూడా రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అని అమిత్ స్పష్టంగా చెప్పలేదు. దాంతోనే తాజా పర్యటనలో అమిత్ తన గురి తప్పినట్లే అర్ధమవుతోంది.

This post was last modified on September 18, 2021 11:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

33 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago