Political News

అమిత్ షా గురి తప్పిందా ?

నిర్మల్ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలు వింటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు అమిత్ నిర్మల్ బహిరంగ సభలో ఎందుకు పాల్గొన్నారు ? ఎవరిని టార్గెట్ చేయడానికి వచ్చారు ? ఎవరిని టార్గెట్ చేశారు ? అనేది జనాలకు అర్థం కావట్లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అని ఒకటికి పదిసార్లు గట్టి గట్టిగా అరిచి ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి ఆలయం సాక్షిగా కమలనాథులు చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే.

కానీ నిర్మల్ సభలో మాట్లాడిన షా మాత్రం కేసీయార్ ను టార్గెట్ చేయకుండా ఎక్కువగా మజ్లిస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ ను వదిలిపెట్టి ఎంఐఎంను టార్గెట్ చేస్తే బీజేపీకి వచ్చే లాభం ఏమిటో అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్నది కేసీయారే కానీ మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీ అయితే కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఓల్డ్ సిటీ లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు+ఒక ఎంపీ సీటులో మాత్రమే గెలిచిన మజ్లిస్ ను టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏమయి ఉంటుంది ?

ఒకవైపు బీజేపీ చీఫ్ బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డైరెక్టుగా కేసీయార్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళద్దరి టార్గెట్ లో మజ్లిస్ ను కానీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని కాని పెద్దగా పట్టించుకోవటంలేదు. కారణం ఏమిటంటే పైన చెప్పుకున్నట్లుగా ఎంఐఎంను టార్గెట్ చేయటం ద్వారా తమ ఎనర్జీని వేస్టు చేసుకోవడం ఇష్టం లేన్నట్లుంది. అలాంటిది స్దానిక నేతలకున్న పరిజ్ఞానం కూడా అమిత్ షా కు ఉన్నట్లు లేదు. లేదా వ్యూహాత్మకంగా కేసీయార్ ను వదిలిపెట్టేశారా అన్నది అర్థం కావడం లేదు.

ఇక్కడ స్పష్టంగా అర్ధమవుతున్న విషయం ఏమిటంటే కేసీయార్ ను మాత్రం హోంశాఖ మంత్రి టార్గెట్ చేయటానికి ఇష్టపడలేదని. ఈమధ్యనే వారం రోజులపాటు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన కేసీయార్ వరుసబెట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా తో పాటు చాలామంది కేంద్రమంత్రులను కలిసొచ్చారు. అమిత్ తో రెండు మూడు సార్లు కలిసారు. దీనిబట్టి మోడీ, అమిత్ తో కేసీయార్ కు మంచి సంబంధాలున్నట్లు అర్ధమైపోతోంది.

అందుకనే టార్గెట్ చేయాల్సిన కేసీయార్ ను వదిలిపెట్టి సంబంధంలేని మజ్లిస్ ను టార్గెట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో అన్నీ పార్లమెంటు స్ధానాల్లో గెలుస్తామని చెప్పిన అమిత్ అసెంబ్లీ సీట్ల విషయం మాత్రం మాట్లాడలేదు. అసెంబ్లీ సీట్లలో గెలిస్తేనే లోక సభ సీట్లలో విజయం సాధ్యమని తెలిసి కూడా రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అని అమిత్ స్పష్టంగా చెప్పలేదు. దాంతోనే తాజా పర్యటనలో అమిత్ తన గురి తప్పినట్లే అర్ధమవుతోంది.

This post was last modified on September 18, 2021 11:57 am

Share
Show comments
Published by
satya

Recent Posts

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

2 hours ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

2 hours ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

3 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

5 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

5 hours ago

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

7 hours ago