Political News

8 నెలలకే చీఫ్ జస్టిస్ బదిలి

ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు తీసుకున్న ఏకే గోస్వామిని 8 నెలలకే బదిలీ చేస్తున్నారు. మామూలుగా ఇలా జరగదు. ఎందుకంటే  చీఫ్ జస్టిస్ గా నియమితులైన వ్యక్తి సీటులో సెటిల్ అవటానికే కనీసం ఆరు మాసాలు పడుతుంది. తాను బాధ్యతలు స్వీకరించేనాటికి హైకోర్టులో విచారణ జరుగుతున్న, పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కీలకమైన కేసుల గురించి తెలుసుకోవడానికి, స్టడీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.

తాను విచారించాల్సిన కేసుల విషయంలో ఏ చీఫ జస్టిస్ అయినా ముందుగా బాగా స్టడీ చేస్తారని అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఏకే గోస్వామి బాధ్యతలు తీసుకునే సమయానికే మూడు రాజధానుల సమస్య, రాజధాని అమరావతి వివాదం కేంద్రంగా దాఖలైన అనేక కేసులు విచారణకు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో రోజువారి విచారణ చేపడతామని గోస్వామి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

రాజధాని కేసుల విచారణను వచ్చే నవంబర్ కు వాయిదా వేశారు. గోస్వామి ముందు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన జేకే మహేశ్వరి కూడా మూడు రాజధానుల వివాదం, అమరావతి వివాదాలను ప్రాధాన్యత క్రమంలో విచారిస్తామని చెప్పారు. అయితే హఠాత్తుగా బదిలీ అయిపోవటంతో గోస్వామి వచ్చారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఇంకా ముఖ్యమైన వివాదాలకు సంబంధించిన కేసులపై పూర్తి స్థాయి విచారణను చేపట్టనేలేదు. ఇంతలోనే బదిలీ అయిపోతున్నారు. గోస్వామి ప్లేసులో ప్రశాంతకుమార్ మిశ్రాను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

This post was last modified on September 18, 2021 11:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

6 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

6 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

7 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

7 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

7 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

9 hours ago