Political News

8 నెలలకే చీఫ్ జస్టిస్ బదిలి

ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు తీసుకున్న ఏకే గోస్వామిని 8 నెలలకే బదిలీ చేస్తున్నారు. మామూలుగా ఇలా జరగదు. ఎందుకంటే  చీఫ్ జస్టిస్ గా నియమితులైన వ్యక్తి సీటులో సెటిల్ అవటానికే కనీసం ఆరు మాసాలు పడుతుంది. తాను బాధ్యతలు స్వీకరించేనాటికి హైకోర్టులో విచారణ జరుగుతున్న, పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కీలకమైన కేసుల గురించి తెలుసుకోవడానికి, స్టడీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.

తాను విచారించాల్సిన కేసుల విషయంలో ఏ చీఫ జస్టిస్ అయినా ముందుగా బాగా స్టడీ చేస్తారని అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఏకే గోస్వామి బాధ్యతలు తీసుకునే సమయానికే మూడు రాజధానుల సమస్య, రాజధాని అమరావతి వివాదం కేంద్రంగా దాఖలైన అనేక కేసులు విచారణకు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో రోజువారి విచారణ చేపడతామని గోస్వామి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

రాజధాని కేసుల విచారణను వచ్చే నవంబర్ కు వాయిదా వేశారు. గోస్వామి ముందు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన జేకే మహేశ్వరి కూడా మూడు రాజధానుల వివాదం, అమరావతి వివాదాలను ప్రాధాన్యత క్రమంలో విచారిస్తామని చెప్పారు. అయితే హఠాత్తుగా బదిలీ అయిపోవటంతో గోస్వామి వచ్చారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఇంకా ముఖ్యమైన వివాదాలకు సంబంధించిన కేసులపై పూర్తి స్థాయి విచారణను చేపట్టనేలేదు. ఇంతలోనే బదిలీ అయిపోతున్నారు. గోస్వామి ప్లేసులో ప్రశాంతకుమార్ మిశ్రాను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

This post was last modified on September 18, 2021 11:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

2 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

5 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

6 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

6 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

8 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

8 hours ago