Political News

జగన్ కీలక నిర్ణయం

వైద్యరంగంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందించటంలో ప్రతి ఎంబీబీఎస్ విద్యార్ధి ఏడాదిపాటు సేవలందించాలన్న జగన్ సూచన తొందరలోనే ఉత్తర్వులు రూపంలో రాబోతోంది. అలాగే ప్రతి పీజీ విద్యార్ధి ఏడాదిపాటు రెసిడెన్సీ చేయాల్సిందే. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష చేసినపుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం సూచనల ప్రకారం ఉన్నతాధికారులు ఫైల్ రెడీచేశారు.

ప్రభుత్వ నిర్ణయం గనుక ఆదేశాల రూపంలో బయటకు వస్తే ప్రతి ఏడాది 5300 మంది ఎంబీబీఎస్ విద్యార్ధులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పనిచేయాల్సుంటుంది. అలాగే 2300 పీజీ విద్యార్ధులు ప్రాంతీయ, జిల్లా బోధనాసుపత్రుల్లో సీనియర్ రెసెడెంట్లుగా పనిచేయాల్సుంటుంది. ఐదున్నరేళ్ళ ఎంబీబీఎస్ కోర్సులో చివరి ఏడాది గ్రామీణ ప్రాంతంలోను, బోధనాసుపత్రుల్లో విద్యార్ధులు పనిచేయాల్సుంటుంది. అంటే ఇకనుండి ఎంబీబీఎస్ కోర్సు ఆరున్నర ఏళ్ళని చెప్పుకోవచ్చు.

జగన్ ఉద్దేశ్యం ఏమిటంటే గ్రామీణప్రాంతాల్లోని జనాలకు నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచటమే. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని జనాలకు వైద్యసేవలు అందుబాటులో లేవన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికోసం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్కులను అమల్లోకి తెచ్చారు. అయితే ఈ క్లినిక్కులు జనాల అవసరాలకు సరిపోవు. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో ఎంబీబీఎస్ విద్యార్ధులు సేవలందించాలనే నిర్ణయం తీసుకున్నది.

నిజానికి ఇలాంటి నిర్ణయం 2010లోనే తీసుకున్నా అమల్లోకి రాలేదు. పైగా 2016లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. పీజీ విద్యార్ధులకు రెసిడెన్సీ విధానాన్ని కూడా ఆప్షనల్ చేశారు. దాంతో విద్యార్ధుల్లో అత్యధికులు గ్రామీణప్రాంతాల్లో పనిచేయటానికి ఇష్టపడటంలేదు. ఇదే సందర్భంలో కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్ధాన్, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో రూరల్ ప్రాక్టీసు విధానం అమల్లో ఉంది. కేరళలో అయితే ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్ధులకు మాత్రమే ఈ నిబంధన అమల్లోఉంది.

గ్రామీణప్రాంతాల్లో ఏడాదిపాటు సేవలందించిన విద్యార్ధులు పీజీలో రెసిడెన్సీ చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. దీన్ని మెడికల్ విద్యార్ధి రిజిస్ట్రేషన్ విషయంలో చెప్పబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా జగన్ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని జనాలకు నిరంతర వైద్యసేవలు అందుబాటులోకి రావటం ఖాయం. చూద్దాం ఎప్పటినుండి అమల్లోకి వస్తుందో.

This post was last modified on September 17, 2021 11:08 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

1 hour ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

1 hour ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

6 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

6 hours ago