వైద్యరంగంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందించటంలో ప్రతి ఎంబీబీఎస్ విద్యార్ధి ఏడాదిపాటు సేవలందించాలన్న జగన్ సూచన తొందరలోనే ఉత్తర్వులు రూపంలో రాబోతోంది. అలాగే ప్రతి పీజీ విద్యార్ధి ఏడాదిపాటు రెసిడెన్సీ చేయాల్సిందే. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష చేసినపుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం సూచనల ప్రకారం ఉన్నతాధికారులు ఫైల్ రెడీచేశారు.
ప్రభుత్వ నిర్ణయం గనుక ఆదేశాల రూపంలో బయటకు వస్తే ప్రతి ఏడాది 5300 మంది ఎంబీబీఎస్ విద్యార్ధులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పనిచేయాల్సుంటుంది. అలాగే 2300 పీజీ విద్యార్ధులు ప్రాంతీయ, జిల్లా బోధనాసుపత్రుల్లో సీనియర్ రెసెడెంట్లుగా పనిచేయాల్సుంటుంది. ఐదున్నరేళ్ళ ఎంబీబీఎస్ కోర్సులో చివరి ఏడాది గ్రామీణ ప్రాంతంలోను, బోధనాసుపత్రుల్లో విద్యార్ధులు పనిచేయాల్సుంటుంది. అంటే ఇకనుండి ఎంబీబీఎస్ కోర్సు ఆరున్నర ఏళ్ళని చెప్పుకోవచ్చు.
జగన్ ఉద్దేశ్యం ఏమిటంటే గ్రామీణప్రాంతాల్లోని జనాలకు నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచటమే. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని జనాలకు వైద్యసేవలు అందుబాటులో లేవన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికోసం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్కులను అమల్లోకి తెచ్చారు. అయితే ఈ క్లినిక్కులు జనాల అవసరాలకు సరిపోవు. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో ఎంబీబీఎస్ విద్యార్ధులు సేవలందించాలనే నిర్ణయం తీసుకున్నది.
నిజానికి ఇలాంటి నిర్ణయం 2010లోనే తీసుకున్నా అమల్లోకి రాలేదు. పైగా 2016లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. పీజీ విద్యార్ధులకు రెసిడెన్సీ విధానాన్ని కూడా ఆప్షనల్ చేశారు. దాంతో విద్యార్ధుల్లో అత్యధికులు గ్రామీణప్రాంతాల్లో పనిచేయటానికి ఇష్టపడటంలేదు. ఇదే సందర్భంలో కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్ధాన్, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో రూరల్ ప్రాక్టీసు విధానం అమల్లో ఉంది. కేరళలో అయితే ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్ధులకు మాత్రమే ఈ నిబంధన అమల్లోఉంది.
గ్రామీణప్రాంతాల్లో ఏడాదిపాటు సేవలందించిన విద్యార్ధులు పీజీలో రెసిడెన్సీ చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. దీన్ని మెడికల్ విద్యార్ధి రిజిస్ట్రేషన్ విషయంలో చెప్పబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా జగన్ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని జనాలకు నిరంతర వైద్యసేవలు అందుబాటులోకి రావటం ఖాయం. చూద్దాం ఎప్పటినుండి అమల్లోకి వస్తుందో.
This post was last modified on September 17, 2021 11:08 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…