సైదాబాద్ లో ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం బాలికను దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పట్టుకోవాలని పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు.. అతనిని పట్టుకుంటే రూ.10లక్షలు రివార్డ్ ఇస్తామంటూ కూడా ప్రకటించారు.
కాగా.. తాజాగా.. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటన అందరినీ షాకింగ్ కి గురి చేసింది. నిందితుడు దొరికితే.. తమకు అప్పగించాలని కొందరు.. కఠినంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. అతను ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే.. దీనిపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. సైదాబాద్ బాలిక కుటుంబాన్ని భారీ బందోబస్తు మధ్య తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ గురువారం ఉదయం పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు రూ.20 లక్షల చెక్కు అందిజేశారు. దీంతో పాటు బాలిక కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు ఇస్తామని హామీఇచ్చారు.
మంత్రులు తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. మంత్రులు హడావిడిగా వచ్చి వెళ్లారని నిరసన తెలిపారు. హోంమంత్రి కాన్వాయ్ను సేవాలాల్ బంజారా సంఘ నేత అడ్డుకున్నారు. ప్రభుత్వం అందజేసిన రూ.20 లక్షల సాయాన్ని వెనక్కిచ్చేస్తామని సైదాబాద్ బాలిక కుటుంబ సభ్యులు అంటున్నారు.
This post was last modified on September 16, 2021 11:05 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…