Political News

సైదాబాద్ ఘటన.. నిందితుడు ఆత్మహత్య!

సైదాబాద్ లో ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం బాలికను దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పట్టుకోవాలని పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు.. అతనిని పట్టుకుంటే రూ.10లక్షలు రివార్డ్ ఇస్తామంటూ కూడా ప్రకటించారు.

కాగా.. తాజాగా.. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటన అందరినీ షాకింగ్ కి గురి చేసింది. నిందితుడు దొరికితే.. తమకు అప్పగించాలని కొందరు.. కఠినంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. అతను ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే.. దీనిపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. సైదాబాద్‌ బాలిక కుటుంబాన్ని భారీ బందోబస్తు మధ్య తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ గురువారం ఉదయం పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు రూ.20 లక్షల చెక్కు అందిజేశారు. దీంతో పాటు బాలిక కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు ఇస్తామని హామీఇచ్చారు.

మంత్రులు తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. మంత్రులు హడావిడిగా వచ్చి వెళ్లారని నిరసన తెలిపారు. హోంమంత్రి కాన్వాయ్‌ను సేవాలాల్‌ బంజారా సంఘ నేత అడ్డుకున్నారు. ప్రభుత్వం అందజేసిన రూ.20 లక్షల సాయాన్ని వెనక్కిచ్చేస్తామని సైదాబాద్‌ బాలిక కుటుంబ సభ్యులు అంటున్నారు.

This post was last modified on September 16, 2021 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

3 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

6 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

8 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

8 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

9 hours ago