Political News

సైదాబాద్ ఘటన.. నిందితుడు ఆత్మహత్య!

సైదాబాద్ లో ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం బాలికను దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పట్టుకోవాలని పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు.. అతనిని పట్టుకుంటే రూ.10లక్షలు రివార్డ్ ఇస్తామంటూ కూడా ప్రకటించారు.

కాగా.. తాజాగా.. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటన అందరినీ షాకింగ్ కి గురి చేసింది. నిందితుడు దొరికితే.. తమకు అప్పగించాలని కొందరు.. కఠినంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. అతను ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే.. దీనిపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. సైదాబాద్‌ బాలిక కుటుంబాన్ని భారీ బందోబస్తు మధ్య తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ గురువారం ఉదయం పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు రూ.20 లక్షల చెక్కు అందిజేశారు. దీంతో పాటు బాలిక కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు ఇస్తామని హామీఇచ్చారు.

మంత్రులు తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. మంత్రులు హడావిడిగా వచ్చి వెళ్లారని నిరసన తెలిపారు. హోంమంత్రి కాన్వాయ్‌ను సేవాలాల్‌ బంజారా సంఘ నేత అడ్డుకున్నారు. ప్రభుత్వం అందజేసిన రూ.20 లక్షల సాయాన్ని వెనక్కిచ్చేస్తామని సైదాబాద్‌ బాలిక కుటుంబ సభ్యులు అంటున్నారు.

This post was last modified on September 16, 2021 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డేంజర్ బెల్స్ మ్రోగించిన అఖండ 2

బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…

1 hour ago

అన్నగారికి కొత్త డేట్?

డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…

1 hour ago

పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…

2 hours ago

బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్

అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…

2 hours ago

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

4 hours ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

6 hours ago