Political News

టీటీడీ ఏమన్నా పునరావాస కేంద్రమా ?

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యులపై అనేక విమర్శలు మొదలయ్యాయి. 25 మందితో కూడిన బోర్డు సభ్యుల ఫైలును జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేశారు. అలాగే మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే గతంలో ఎన్నడూ లేనట్లు మొత్తం 75 మందిని బోర్డు సభ్యులుగా నియమించినట్లయ్యింది. ఈ నియామకంలో రాజకీయ అనివార్యతే కనబడుతోంది.

ఇందులో చిన్న ట్విస్టు ఏమిటంటే మొదటి 25 మంది మాత్రమే బోర్డు సమావేశాల్లో పాల్గొంటారు. అవసరమైతే ఓటింగ్ లో పాల్గొనే హక్కు కూడా ఉంటుంది. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన 50 మందికి బోర్డు సమావేశాలతో సంబంధం లేదు. కాబట్టి అవసరమైనపుడు ఓటింగ్ లో పాల్గొనే అవకాశం కూడా లేనట్లే. కాకపోతే దర్శనాలకు సంబంధించి బోర్డు సభ్యులతో సమానంగా ప్రోటోకాల్ ఉంటుందట. నిజానికి సభ్యులను తీసుకున్నా ప్రత్యేక ఆహ్వానితులను తీసుకున్నా వాళ్ళ వల్ల టీటీడీకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా ? అనేదే ప్రశ్న.

ఇక్కడ రెండు విషయాలున్నాయి. మొదటిదేమో బోర్డు సభ్యుల వల్ల టీటీడీకి ఉపయోగం ఉండటం. రెండో అంశం టీటీడీ వల్ల సభ్యులు లాభపడటం. ఈ రెండు అంశాలను తీసుకుంటే సభ్యుల వల్ల టీటీడీకి వస్తున్న లాభం దాదాపు ఉండటం లేదు. సభ్యత్వాన్ని అడ్డంపెట్టుకుని టీటీడీని ఉపయోగించుకుంటున్న వాళ్ళే అత్యధికులు. దశాబ్దాల చరిత్రను తీసుకుంటే ఏదో రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లబ్ధిపొందిన సభ్యులే అత్యధికులున్నారు కానీ సభ్యుల వల్ల సంస్ధకు జరిగిన ఉపయోగం దాదాపు లేదనే చెప్పాలి.

బోర్డులో ఎంత మందిని సభ్యులుగా నియమిస్తే సంస్ధకు అంత ఇబ్బందలన్న విషయం అందరికీ తెలిసిందే. బోర్డు సభ్యుల హోదాలో దర్శనాలు, ప్రసాదాలు, కాటేజీలను కేటాయింపు చేసుకోవటంలో కంపు చేయడం పెరిగిపోతుంది. వీటికి అదనంగా దేవస్థానం అధికారులపై అధికారాలను చెలాయించటం, బ్రోకర్ వ్యవస్థను పెంచి పోషించటానికి తప్ప ఇంతమంది వల్ల ఉపయోగం ఉండదనే అనుకోవాలి.

వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఎంతమంది సభ్యులకు దేవుడిపైన భక్తి, టీటీడీ అభివృద్ధి పైన శ్రద్ధ ఉన్నాయన్నదే ప్రధానం. నిజంగా దేవుడిపై భక్తి ఉంటే దేవస్థానంపై పెత్తనం, అధికారం చేయాలనే ఆలోచనను పక్కన పెట్టేసి సంస్ధకు ఏదైనా మేలు చేయాలి. అలాంటి వాళ్ళు బోర్డులో సభ్యులుగా కనబడటం లేదు. ఇది ఇప్పటి పరిస్థితి కాదు. చాలా సంవత్సరాలుగా జరుగుతున్నది ఇదే. ఏదేమైనా జగన్ ప్రభుత్వం తాజా నియమించిన 75 మంది సభ్యుల నియామకాలు మాత్రం పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది మాత్రం వాస్తవం.

This post was last modified on September 16, 2021 10:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

8 minutes ago

ఫ్యామిలీ మ్యాన్ హీరో చుట్టూ టైటిల్ వివాదం

రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…

31 minutes ago

చిరు సినిమాలో దురంధర్ పాప?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…

55 minutes ago

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…

2 hours ago

వారణాసి విశేషాలతో అభిమానుల్లో హుషారు

గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…

2 hours ago

ఐమాక్స్ కోసం రాజమౌళి ధర్నా

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…

2 hours ago