Political News

ప‌ల‌మ‌నేరు వైసీపీలో గ‌డ‌బిడ‌.. ఎందుకు?

చిత్తూరు జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం ప‌ల‌మ‌నేరు. కాంగ్రెస్‌కు కంచుకోట వంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం.. వైసీపీ వైపు మ‌ళ్లింది. దీంతో ఇక్క‌డ వైసీపీ వ‌రుస విజ‌యాలు సాధించింది. 2014లో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఎన్ అమ‌ర్నాథ్‌రెడ్డి.. వైసీపీలో వ‌చ్చి.. ఇక్క‌డ నుంచి పోటీ చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాక‌పోయినా.. ఇక్క‌డ అమ‌ర్నాథ్‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీలోకి చేరి.. మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు.

ఇక‌, 2019 ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ మ‌ళ్లీ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఈ ద‌ఫా.. రాజ‌కీయాల‌కు సంబంధ‌మే లేని వ్య‌క్తి వెంక‌ట్ గౌడ‌ను తీసుకువ‌చ్చి.. వైసీపీ ఇక్క‌డ టికెట్ ఇచ్చింది. జ‌గ‌న్ సునామీలో ఆయ‌న విజ‌యం సాధించారు. ఈయ‌నను మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి శిష్యుడిగా.. పేర్కొంటారు. కేవ‌లం 5వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్ర‌మే చ‌దివిన వెంక‌ట్ గౌడ్ బేల్దార్ మేస్త్రిగా జీవితాన్ని ప్రారంభించి.. రియ‌ల్ ఎస్టేట్ వైపు దృష్టి పెట్టారు. దీనిలో ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే పెద్దిరెడ్డితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా.. వైసీపీ టికెట్ ఇచ్చే వ‌ర‌కు సాగింది.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున టికెట్ ద‌క్కించుకున్న వెంక‌ట్ గౌడ్‌.. పార్టీకి.. పార్టీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత విధేయులు అన‌డంలో సందేహం లేదు. అయితే.. ఎటొచ్చీ.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి దూర‌మ‌య్యారు. త‌న వ్యాపారాలు.. వ్య‌వ‌హారాలు అన్నీ కూడా బెంగ‌ళూరుతో ముడిప‌డి ఉండ‌డంతో గ‌త రెండున్న‌రేళ్లుగా కేవ‌లం విజిటింగ్ ఎమ్మెల్యేగా మాత్ర‌మే ఆయ‌న ఇక్క‌డ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. పైగా మంత్రి పెద్దిరెడ్డి తోనూ విభేదిస్తున్నారు. దీంతో పార్టీ నేత‌లు ఎమ్మెల్యేకు డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఈ ప‌రిణామాల తో ఉలిక్కిప‌డ్డారో ఏమో.. ఎమ్మెల్యే వెంక‌ట గౌడ్ క‌ళ్లు తెరుచుకున్నారు.

గ‌త వారం రోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి వీధిలోనూ ఆయ‌న ప‌ర్య‌టిస్తున్నారు. ఒక‌ర‌కంగా పాద‌యాత్ర చేస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డే ఉన్న స‌మ‌స్య‌ల‌ను నోట్ చేసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు. అయితే.. వాస్త‌వానికి ఇదంతా .. త‌న‌పై వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌కు చెక్ పెట్టేందుకేన‌ని అంటున్నారు సొంత‌త పార్టీ నేత‌లు. మ‌రోవైపు.. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి ఎన్ అమ‌ర్‌నాథ్‌రెడ్డి.. దూకుడుగా ఉన్నారు. స‌మ‌స్య‌ల‌పై వెంట‌నే స్పందిస్తున్నారు. ఎమ్మెల్యేపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో ఒక విధ‌మైన వ్య‌తిరేక‌త త‌న‌కు పెర‌గ‌డంతో ఎమ్మెల్యే అలెర్ట్ అయ్యార‌ని.. ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాల‌ని అంటున్నారు పరిశీల‌కులు.

This post was last modified on September 12, 2021 4:22 pm

Share
Show comments

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

36 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago