హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే విషయం పై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఎక్కువగా.. కొండా సురేఖ పేరు వినపడుతోంది. ఆమె అయితే.. కరెక్ట్ అంటూ చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మొగ్గు చేపుతూ వస్తున్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ సైతం కొండా వైపుకే మొగ్గుచూపుతున్నారు. కొండా పాత నియోజకవర్గం పరకాలకు హుజురాబాద్ ఆనుకొని ఉండటం, మంత్రిగా కొండాకు ఈ ప్రాంతంపై అవగాహన ఉండటంతో గట్టి అభ్యర్థిగా కొండా సురేఖ అయితేనే బెస్ట్ అంటూ పార్టీ వర్గాలు మొగ్గుచూపుతున్నాయి.
తాజాగా… హుజురాబాద్ పోటీపై కొండా సురేఖ తొలిసారి నోరు విప్పారు. అధిష్టానం, పీసీసీ చీఫ్ కోరితే తాను హుజురాబాద్ బరిలో ఉంటానని స్పష్టం చేశారు. గట్టి అభ్యర్థిగా పార్టీ తనను పోటీ చేయాలని కోరితే కాదు అనని… అయితే, అధికారికంగా పార్టీ పెద్దల నుండి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
అయితే, తాను హుజురాబాద్ నుండి పోటీ చేసినా వరంగల్ ను విడిచిపెట్టనని… తాను వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పాత నియోజకవర్గానికే వస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు.
This post was last modified on September 10, 2021 11:44 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…