హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే విషయం పై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఎక్కువగా.. కొండా సురేఖ పేరు వినపడుతోంది. ఆమె అయితే.. కరెక్ట్ అంటూ చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మొగ్గు చేపుతూ వస్తున్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ సైతం కొండా వైపుకే మొగ్గుచూపుతున్నారు. కొండా పాత నియోజకవర్గం పరకాలకు హుజురాబాద్ ఆనుకొని ఉండటం, మంత్రిగా కొండాకు ఈ ప్రాంతంపై అవగాహన ఉండటంతో గట్టి అభ్యర్థిగా కొండా సురేఖ అయితేనే బెస్ట్ అంటూ పార్టీ వర్గాలు మొగ్గుచూపుతున్నాయి.
తాజాగా… హుజురాబాద్ పోటీపై కొండా సురేఖ తొలిసారి నోరు విప్పారు. అధిష్టానం, పీసీసీ చీఫ్ కోరితే తాను హుజురాబాద్ బరిలో ఉంటానని స్పష్టం చేశారు. గట్టి అభ్యర్థిగా పార్టీ తనను పోటీ చేయాలని కోరితే కాదు అనని… అయితే, అధికారికంగా పార్టీ పెద్దల నుండి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
అయితే, తాను హుజురాబాద్ నుండి పోటీ చేసినా వరంగల్ ను విడిచిపెట్టనని… తాను వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పాత నియోజకవర్గానికే వస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు.
This post was last modified on September 10, 2021 11:44 am
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…