హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే విషయం పై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఎక్కువగా.. కొండా సురేఖ పేరు వినపడుతోంది. ఆమె అయితే.. కరెక్ట్ అంటూ చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మొగ్గు చేపుతూ వస్తున్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ సైతం కొండా వైపుకే మొగ్గుచూపుతున్నారు. కొండా పాత నియోజకవర్గం పరకాలకు హుజురాబాద్ ఆనుకొని ఉండటం, మంత్రిగా కొండాకు ఈ ప్రాంతంపై అవగాహన ఉండటంతో గట్టి అభ్యర్థిగా కొండా సురేఖ అయితేనే బెస్ట్ అంటూ పార్టీ వర్గాలు మొగ్గుచూపుతున్నాయి.
తాజాగా… హుజురాబాద్ పోటీపై కొండా సురేఖ తొలిసారి నోరు విప్పారు. అధిష్టానం, పీసీసీ చీఫ్ కోరితే తాను హుజురాబాద్ బరిలో ఉంటానని స్పష్టం చేశారు. గట్టి అభ్యర్థిగా పార్టీ తనను పోటీ చేయాలని కోరితే కాదు అనని… అయితే, అధికారికంగా పార్టీ పెద్దల నుండి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
అయితే, తాను హుజురాబాద్ నుండి పోటీ చేసినా వరంగల్ ను విడిచిపెట్టనని… తాను వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పాత నియోజకవర్గానికే వస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు.
This post was last modified on September 10, 2021 11:44 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…