జనసేనాని, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ చేసిన మంచి పనిపై ఆమె స్పందించి ప్రశంసలు కురిపించడం గమనార్హం.
కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై అభినందించారు. కళాకారుడికి పవన్ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమని గవర్నర్ తమిళి సై అన్నారు.
పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ గవర్నర్ తమిళి సై ట్వీట్ చేశారు. కాగా… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినిమా భీమ్లా నాయక్ లో పాటకు కిన్నెర తో స్వరాలు అందించిన కిన్నెర మొగులయ్యకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కిన్నెర కళ అనేది అరుదైన కళ అని మొగులయ్య లాంటి కళాకారులను కాపాడా లని పవన్ కల్యాణ్ రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
This post was last modified on September 6, 2021 3:55 pm
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…