జనసేనాని, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ చేసిన మంచి పనిపై ఆమె స్పందించి ప్రశంసలు కురిపించడం గమనార్హం.
కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై అభినందించారు. కళాకారుడికి పవన్ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమని గవర్నర్ తమిళి సై అన్నారు.
పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ గవర్నర్ తమిళి సై ట్వీట్ చేశారు. కాగా… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినిమా భీమ్లా నాయక్ లో పాటకు కిన్నెర తో స్వరాలు అందించిన కిన్నెర మొగులయ్యకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కిన్నెర కళ అనేది అరుదైన కళ అని మొగులయ్య లాంటి కళాకారులను కాపాడా లని పవన్ కల్యాణ్ రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
This post was last modified on September 6, 2021 3:55 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…