జనసేనాని, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ చేసిన మంచి పనిపై ఆమె స్పందించి ప్రశంసలు కురిపించడం గమనార్హం.
కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై అభినందించారు. కళాకారుడికి పవన్ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమని గవర్నర్ తమిళి సై అన్నారు.
పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ గవర్నర్ తమిళి సై ట్వీట్ చేశారు. కాగా… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినిమా భీమ్లా నాయక్ లో పాటకు కిన్నెర తో స్వరాలు అందించిన కిన్నెర మొగులయ్యకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కిన్నెర కళ అనేది అరుదైన కళ అని మొగులయ్య లాంటి కళాకారులను కాపాడా లని పవన్ కల్యాణ్ రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
This post was last modified on September 6, 2021 3:55 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…