Political News

హైకోర్టు తీర్పుపై జగన్ సర్కారుకు పీకే ట్వీట్ పంచ్

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు న్యాయస్థానాల్లో వరుస పెట్టి ఎదురుదెబ్బలు తుగులుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగిస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవటం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే సమయంలో నిమ్మగడ్డ కులం మీద జగన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. ఒక ఉన్నతాధికారి మీద అధికారపక్షం స్పందించిన తీరు చూసి ముక్కున వేలేసుకున్నోళ్లు చాలామందే ఉన్నారు.

తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోవటం కోసం దేనికైనా రెఢీ అన్నట్లు వ్యవహరించే జగన్.. ఆ వాదనను నిజం చేస్తూ.. నిమ్మగడ్డ విషయంలో వ్యవహరించిన వైనంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమైంది. ప్రపంచమంతా మాయదారి రోగాన్ని నిలువరించే విషయం మీద ఫోకస్ పెడితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా రమేశ్ కుమార్ ను ఇంటికి పంపించే విషయంలో అనుసరించే విధానం సరికాదన్న మాట వినిపించింది.

ఈ వాదనలకు బలం చేకూరేలా ఏపీ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఉందని చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ టైమ్లీగా ఒక ట్వీట్ పోస్టు చేశారు. రమేశ్ కుమార్ నియమకాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన తప్పు పడుతూ ఏప్రిల్ పదో తేదీన ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయమా? అని పేర్కొనటం గమనార్హం.

హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై స్పందించిన పవన్ కల్యాణ్.. ‘‘ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఇనుమడింపజేసింది’’ అంటూ చేసిన ట్వీట్ పంచ్ వేశారు. తన ట్వీట్ తో ఏపీ సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. దాని దూకుడుకు కళ్లాలు వేసే వ్యవస్థలు ఉన్నాయన్న విషయాన్ని పవన్ ట్వీట్ చెప్పిందని చెప్పక తప్పదు.

This post was last modified on May 29, 2020 2:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

11 minutes ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

28 minutes ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

3 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

5 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

6 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

6 hours ago