Political News

హైకోర్టు తీర్పుపై జగన్ సర్కారుకు పీకే ట్వీట్ పంచ్

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు న్యాయస్థానాల్లో వరుస పెట్టి ఎదురుదెబ్బలు తుగులుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగిస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవటం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే సమయంలో నిమ్మగడ్డ కులం మీద జగన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. ఒక ఉన్నతాధికారి మీద అధికారపక్షం స్పందించిన తీరు చూసి ముక్కున వేలేసుకున్నోళ్లు చాలామందే ఉన్నారు.

తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోవటం కోసం దేనికైనా రెఢీ అన్నట్లు వ్యవహరించే జగన్.. ఆ వాదనను నిజం చేస్తూ.. నిమ్మగడ్డ విషయంలో వ్యవహరించిన వైనంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమైంది. ప్రపంచమంతా మాయదారి రోగాన్ని నిలువరించే విషయం మీద ఫోకస్ పెడితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా రమేశ్ కుమార్ ను ఇంటికి పంపించే విషయంలో అనుసరించే విధానం సరికాదన్న మాట వినిపించింది.

ఈ వాదనలకు బలం చేకూరేలా ఏపీ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఉందని చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ టైమ్లీగా ఒక ట్వీట్ పోస్టు చేశారు. రమేశ్ కుమార్ నియమకాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన తప్పు పడుతూ ఏప్రిల్ పదో తేదీన ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయమా? అని పేర్కొనటం గమనార్హం.

హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై స్పందించిన పవన్ కల్యాణ్.. ‘‘ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఇనుమడింపజేసింది’’ అంటూ చేసిన ట్వీట్ పంచ్ వేశారు. తన ట్వీట్ తో ఏపీ సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. దాని దూకుడుకు కళ్లాలు వేసే వ్యవస్థలు ఉన్నాయన్న విషయాన్ని పవన్ ట్వీట్ చెప్పిందని చెప్పక తప్పదు.

This post was last modified on May 29, 2020 2:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

31 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

33 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

1 hour ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago