Political News

ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ షాక్

తెలంగాణా ప్రభుత్వంపై విద్యార్ధులు మండిపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా గడచిన ఏడాది విద్యాసంవత్సరం జరగలేదని అందరికీ తెలిసిందే. కేజీ టు పీజీ వరకు విద్యార్ధులందరినీ ఆటోమేటిక్ పాస్ అని ప్రభుత్వం ప్రకటించేసింది. కాబట్టి విద్యార్థులంతా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. అలాంటిది తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ఓ ప్రకటనతో ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్రంగా మండిపోతున్నారు. ఇంతకీ వీళ్ళ కోపానికి కారణం ఏమిటి ?

ఏమిటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కు ప్రమోట్ అయిన మొదటి సంవత్సరం విద్యార్థులు తొందరలోనే పరీక్షలు రాయాలని ప్రకటించడమే. సెకండ్ ఇయర్ కు ప్రమోట్ అయిన మొదటి సంవత్సరం విద్యార్థులంతా యాన్యువల్ పరీక్షలు రాయాల్సిందే అని సబితా చాలా చల్లగా ప్రకటించారు. అప్పుడేమో పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి అందరినీ ఆటోమేటిక్ గా పాస్ చేసినట్లే అని ప్రభుత్వం ప్రకటించింది.

అంటే పరీక్షలు రాయకుండానే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు సుమారు 5 లక్షలమంది సెకెండ్ ఇంటర్మీడియట్ కు ప్రమోట్ అయినట్లే అనుకున్నారు. కాని తాజాగా పరీక్ష రాసి పాస్ అయిన వారిని మాత్రమే సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేస్తామన్న విద్యాశాఖ మంత్రి ప్రకటన పై విద్యార్ధులు తీవ్రంగా మండిపోతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి పునః ప్రారంభమవుతున్న విద్యాలయాలపై సమీక్ష చేస్తారట.

తమ సమీక్షలో వచ్చే ఫీడ్ బ్యాక్ బట్టి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని సబితా చెప్పారు. ఇపుడు చేసిన ప్రకటనే దో అప్పట్లోనే చేసుంటే సరిపోయేది. పరీక్షలు నిర్వహించకుండా మొదటి సంవత్సరం విద్యార్ధులును రెండో సంవత్సరంలోకి ప్రమోట్ చేయమని ప్రకటించుంటే బాగుండేది. ప్రభుత్వ ప్రకటన కు తగ్గట్లుగా విద్యార్ధులంతా మానసికంగా సిద్ధమయ్యేవారు. కానీ అప్పుడేమో పరీక్షలతో సంబంధం లేకుండా ఆటోమేటిక్ పాస్ అని ప్రకటించే ఇప్పుడు పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేసేది లేదని చెప్పడం ఏమిటో సబితకే తెలియాలి.

Satya

Recent Posts

హోమంత్రి కట్టుబొట్టుపై వ్యాఖ్యలు.. ఎవరూ సహించరు

రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…

12 minutes ago

హ్యాపీ దెబ్బకు ఆర్య బయటికి వస్తున్నాడు

మన హీరోల పాత రీ రిలీజులు తెలుగు రాష్ట్రాల్లో ఆడటం పెద్ద విషయం కాదు. చాలాసార్లు చూశాం. పోకిరి, ఖుషి…

18 minutes ago

నీట్ రీ ఎగ్జామ్… ఆ యాప్ బ్యాన్!

నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఏడాది…

49 minutes ago

చికిరిని చూసే కోణం మారిపోయింది

గత ఏడాది పెద్ది నుంచి చికిరి చికిరి వీడియో సాంగ్ విడుదల చేశాక సోషల్ మీడియా ఊగిపోయింది. మిలియన్లలో వ్యూస్,…

1 hour ago

కల్కి 2 కోసం ఆర్ఆర్ఆర్ సీత ?

ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…

2 hours ago

శ్రీనగర్.. ఈ ఏడాది సమ్మర్ విన్నర్.. ఎంత భారీగా ఫ్లైట్ జర్నీలంటే?

ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…

5 hours ago