Political News

రెండేళ్లు మూడు రాజ‌ధానులు క‌లేనా.. ఇక మ‌ర్చిపోవ‌డ‌మే ?

ఏపీ రాజ‌ధానిపై గ‌త కొద్ది రోజులుగా నెల‌కొన్న అనిశ్చితి ఇప్ప‌ట్లో వీడేలా లేదు. ఏపీ ఏర్ప‌డిన తొలి ఐదేళ్లలోనే కాదు.. ఇప్పుడు ప్ర‌భుత్వం మారి వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండేళ్ల‌కు కూడా రాజ‌ధాని వ్య‌వ‌హారం రోజు రోజుకు వెన‌క్కు వెళ్లిపోతోంది. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు చివ‌రి రెండేళ్లు రాజ‌ధాని అమ‌రావ‌తి అంటూ హ‌డావిడి చేశారు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక మూడు రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న తేవడం.. అది ఇప్ప‌ట‌కీ ఓ కొలిక్కి రాక‌పోవ‌డంతో అస‌లు ఏపీకి ఏది రాజ‌ధానో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఓవ‌రాల్‌గా చూస్తే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా ఏపీ రాజ‌ధాని అనేదే లేకుండానే కాలం ముగిసేలా క‌నిపిస్తోంది. తాజా ప‌రిణామాలు దీనికి మ‌రింత ఊతం ఇస్తున్నాయి.

ఇక కోర్టుల్లో ఇప్ప‌టికే రాజ‌ధాని అంశం యేడాదిన్న‌ర కాలంగా న‌లుగుతూ వ‌స్తోంది. ఇది ఎంత‌కు తేలే ప‌రిస్థితి లేదు. దీంతో హైకోర్టు ఏపీ రాజ‌ధాని అంశంపై న‌వంబ‌ర్ 15వ తేదీ నుంచి ప్ర‌తి రోజు విచారించేలా నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఇది కూడా త్వ‌ర‌గా పూర్త‌వుతుంద‌ని న‌మ్మ‌లేం..! న‌వంబ‌ర్ 15 నుంచి రోజు విచార‌ణ‌కు తీసుకున్నా కూడా వ‌చ్చే వేస‌వి వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని అంటున్నారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఇప్ప‌టికే రెండున్న‌రేళ్లు పూర్త‌వుతోంది. మ‌రో రెండున్న‌రేళ్లు ఆయ‌న అధికారంలో ఉంటారు. ఈ రెండున్న‌రేళ్ల‌లో సైతం జ‌గ‌న్ రాజ‌ధాని విష‌యాన్ని ఓ కొలిక్కి తెస్తార‌ని మాత్రం ఊహించ‌లేం..! చివ‌రి యేడాది ఎలాగూ ఎన్నిక‌ల వ్య‌వ‌హారాలు, హ‌డావిడే ఉంటుంది. అంటే మ‌రో యేడాదిన్న‌ర‌లో రాజ‌ధాని ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది. ఎంత కోర్టు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చినా కూడా మ‌రో యేడాదిలో రాజ‌ధాని ప్ర‌క్రియ పూర్త‌వ్వ‌డం క‌ష్టంగానే ఉంది.

ఇక కోర్టుల నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే ఇప్పుడు ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చూస్తూనే ఉన్నాం. జీతాల‌కే దిక్కూ దివాణం లేదు. చివ‌ర‌కు రోడ్ల ప‌నుల కోసం సైతం టెండ‌ర్లు పిలిస్తే కాంట్రాక్ట‌ర్లు కూడా అటు వైపు క‌న్నెత్తి చూడ‌డం లేదు. ప‌నులు చేస్తే బిల్లులు రావ‌న్న విష‌యంపై వారికి స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఉండ‌డంతోనే అస‌లు ఏపీలో ప‌నులు చేసేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఏదేమైనా ఏపీకి తొలి, మ‌లి ప్ర‌భుత్వాల పాల‌న‌లో రాజ‌ధాని అన్న‌ది పెద్ద క‌ల‌గానే మిగిలి పోనుంది.

This post was last modified on August 25, 2021 3:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

35 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

1 hour ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

6 hours ago